అన్వేషించండి

Visakhapatnam News:: విశాఖలో కుటుంబంపై దాడి చేసిన నిందితుడి అరెస్ట్‌.. రాజకీయ ప్రమేయం లేదన్న పోలీసులు

Andhra Pradesh News:: విశాఖ నగర పరిధిలోని కంచరపాలెంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు.

Visakhapatnam Crime News: విశాఖ నగర పరిధిలోని కంచరపాలెంలో గురువారం రాత్రి రెండు కుటుంబాలు మధ్య జరిగిన గొడవ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కుటుంబాల మధ్య చోటుచోటుకున్న గొడవలో ఇరు కుటుంబాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాలు, మీడియా వేదికగా బయటకు రావడంతో పెద్ద రచ్చ జరిగింది. అధికార పార్టీకి ఓటేయకపోవడంతో ఆ పార్టీకి చెందిన వ్యక్తులు ఒక కుటుంబంపై దాడికి పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

ఈ గొడవపై విచారణ చేపట్టిన పోలీసులు దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అనంతరం మాట్లాడిన పోలీసులు ఇరు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో రాజకీయ ప్రమేయం లేదని తేల్చారు. దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ మేక సత్తిబాబు వివరించారు. కంచరపాలెం పరిధిలో మహిళలపై జరిగిన దాడికి వ్యక్తిగత గొడవలే కారణమని ఆయన స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు వివరాలను ఆయన వెల్లడించారు.

ఈ దాడి ఘటనను ఓట్ల కోసం జరిగిన దాడిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. స్థానిక బర్మా క్యాంప్‌ నూకాలమ్మ ఆలయ సమీపంలో సుంకరి ఆనందరావు, భార్య ధనలక్ష్మి, కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠతో కలిసి ఉంటోందన్నారు. ఆమె ఇంటికి సమీపంలో లోకేష్‌ తన కుటుంబంతో ఉంటున్నారని. ఈ రెండు కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో చిన్నపాటి వివాదానికి ముందు నూకరత్నం, ఆమె కుటుంబ సభ్యులు లోకేష్‌ ఇంటిపై గొడవకు దిగి, వారి ఇంటిపై బీరు సీసాలు విసిరారని వివరించారు. ఇంటికి సమీపంలో ఉన్న లోకేష్‌కు విషయం తెలిసి అక్కడకు చేరుకున్నాడని, తన ఇంటిపై గొడవకు వచ్చిన నూకరత్నం, ఆమె కుటుంబ సభ్యులను తిట్టాడన్నారు. దీంతో నూకరత్నం, ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి రాగా వారిపై లోకేష్‌ కర్నతో దాడి చేయగా, నూకరత్నం, ఆమె కుమార్తె, మరో యువకునికి గాయాలయ్యాయన్నారు. గాయాలైన వారంతా కేజీహెచ్‌లోని అత్యవసర విభాగంలో చేర్చి వైద్య సేవలు పొందుతున్నారన్నారు. దాడికి పాల్పడిన లోకేష్‌, మరో నలుగురిపై కేసులు నమోదు చేశారన్నారు. లోకేష్‌ను రిమాండ్‌కు తరలించారని ఆయన వివరించారు. 

వైసీపీకి ఓటేయకపోవడం వల్లే దాడి

అధికార వైసీపీకి ఓటేయకపోవడం వల్లే దాడికి పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. పలు చానెల్స్‌లోనూ ఇదే విషయాన్ని ప్రసారం చేశారు. వైసీపీకి ఓటేయలేదన్న ఉద్ధేశంతోనే వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న కొందరు ఈ దాడికి పాల్పడ్డారంటూ సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం హోరెత్తింది. అయితే, ఈ ప్రచారాన్నిపోలీసులు ఖండించారు. ఇరు కుటుంబాల మధ్య గొడవను రాజకీయాలకు ఆపాదించే ప్రయత్నం చేయవద్దని పోలీసులు కోరడం గమనార్హం. అయితే, బాధితులుగా ఉన్న వారి కథనం మరోలా ఉండడం గమనార్హం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Injury: ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్
ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్
YS Viveka Case: వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
NTR Fan : ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం  !
ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం !
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Injury: ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్
ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్
YS Viveka Case: వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
NTR Fan : ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం  !
ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం !
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
AP Politics: ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
3 Roses Season 2 Web Series: మరో 2 కొత్త రోజెస్ వచ్చేస్తున్నాయ్! - ఓటీటీలోకి వచ్చేస్తోన్న '3 రోజెస్' సిరీస్ సీజన్ 2.. ఈసారి ఫన్ మామూలుగా ఉండదంతే..
మరో 2 కొత్త రోజెస్ వచ్చేస్తున్నాయ్! - ఓటీటీలోకి వచ్చేస్తోన్న '3 రోజెస్' సిరీస్ సీజన్ 2.. ఈసారి ఫన్ మామూలుగా ఉండదంతే..
Embed widget