అన్వేషించండి

Viral News: సీఎం నియోజకవర్గంలో దారుణం- మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు, అసలేం జరిగిందంటే..

Kuppam News | సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో సోమవారం దారుణం జరిగింది. భర్త అప్పు తీర్చకపోవడంతో అతడి భార్యను బలవంతంగా చెట్టుకు కట్టేసి కొట్టారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదని మహిళలను చెట్టుకు కట్టేసి వేధించారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ అమానుష ఘటన జరిగింది. తల్లిని చెట్టుకు కట్టేస్తుంటే ఆమె పిల్లలు గుక్క పట్టి ఏడవడం ఎందరినో కదిలిస్తోంది. నీ భర్త వచ్చి అప్పు డబ్బులు  తిరిగి చెల్లించి, నిన్ను విడిపించుకోవాలి. లేకపోతే నీ సంగతి చూస్తామంటూ ఆమెను సాటి మహిళలు సైతం కర్రతో దాడి చేసి కొట్టారు.

ఆ వివరాలిలా ఉన్నాయి..
కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష భార్యభర్తలు. భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 ఏళ్ల కిందట 80,000 వేలు రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని ఒత్తిడి పెరగడం, తన వద్ద డబ్బులు లేకపోవడంతో తిమ్మరాయప్ప అప్పును తీర్చలేకపోయాడు. అప్పు తీర్చలేక  భార్య శిరీష, బిడ్డలను వదిలేసి గ్రామం నుంచి వెళ్ళిపోయాడు తిమ్మరాయప్ప. 

కాగా, భర్త తిమ్మరాయప్ప చేసిన అప్పును కూలీ పనులు చేస్తూ తీరుస్తోంది శిరీష. కూలీ పనులతో వచ్చిన డబ్బులతోనే పిల్లల్ని పోషిస్తోంది. సకాలంలో అప్పు చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అప్పు తీర్చగలరని శిరీషను అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. తన అప్పుడబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మునికన్నప్ప బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటిటో ఆగకుండా శిరీషను బలవంతంగా తీసుకెళ్లి వేప చెట్టుకు తాడుతో కట్టేశాడు. ఇది చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భర్త ఇటీవల గ్రామాన్ని వదిలివెళ్లడంతో శిరీష సైతం పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది.   నారాయణపురం స్కూల్లో కుమారుడి టీసీ తీసుకునేందుకు సోమవారం వచ్చిన శిరీషను మునికన్నప్ప, అతడి భార్య పట్టుకున్నారు. అప్పు ఇచ్చిన మునికన్నప్ప కుటుంబసభ్యులు శిరీషను బలవంతంగా చెట్టుకు కట్టేసి అప్పు తీర్చాలని వేధించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదుతో  మునికన్నప్ప కుటుంబసభ్యులపై BNS 341/323/324/506/34/ IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు‌.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Advertisement

వీడియోలు

విశ్వం మూలం వారణాసి నగరమే! అందుకే డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్
Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం
Ravindra Jadeja IPL 2026 | జడేజా ట్రేడ్ వెనుక వెనుక ధోనీ హస్తం
Rishabh Pant Record India vs South Africa | చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌
Sanju Samson Responds on IPL Trade | సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Bigg Boss Telugu Day 70 Promo : భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
Viral Video: మేనేజర్‌ను బట్టలూడదీసి దారుణంగా కొట్టిన హోటల్ ఓనర్ అరెస్ట్.. కారణం తెలిస్తే షాక్
మేనేజర్‌ను బట్టలూడదీసి దారుణంగా కొట్టిన హోటల్ ఓనర్ అరెస్ట్.. కారణం తెలిస్తే షాక్
Indian Rupee vs World Currencies : ఇండియన్ రూపాయి బలంగా ఉన్న దేశాలు ఇవే.. అక్కడ లక్షరూపాయలు మూడు కోట్లంత విలువ
ఇండియన్ రూపాయి బలంగా ఉన్న దేశాలు ఇవే.. అక్కడ లక్షరూపాయలు మూడు కోట్లంత విలువ
Hyundai Venue లేక Kia Syros, ఫీచర్ల పరంగా ఏది బెస్ట్ ? కొనే ముందు ఇవి తెలుసుకోండి
Hyundai Venue లేక Kia Syros, ఫీచర్ల పరంగా ఏది బెస్ట్ ? కొనే ముందు ఇవి తెలుసుకోండి
Embed widget