By: ABP Desam | Updated at : 04 Mar 2023 12:00 PM (IST)
Edited By: Arunmali
వ్యాపారంలోనే కాదు, దాతృత్వంలోనూ వీళ్లే టాప్
Top Philanthropists of India: పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు.. భారతదేశంలోని ఉన్న లక్షలాది వ్యాపారవేత్తల్లో కొంతమంది మాత్రం చాలా స్పెషల్. వాళ్లు, తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటారు. సమాజం నుంచి తీసుకున్న సంపదను తిరిగి సమాజాభివృద్ధి కోసం వెచ్చిస్తుంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరోపకారుల (Philanthropists) జాబితాను ఫోర్బ్స్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. 2022 లిస్ట్లో భారతీయ పారిశ్రామికవేత్తల పేర్లు కూడా ఇందులో భారీ సంఖ్యలో ఉన్నాయి. 2022 సంవత్సరంలో, రూ. 100 కోట్ల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన 15 మంది భారతీయులు ఈ లిస్ట్లో ఉన్నారు. అదే సంవత్సరంలో, రూ. 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని విరాళంగా ఇచ్చిన భారతీయ పారిశ్రామికవేత్తల సంఖ్య 20. తమ సంపదలో ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇస్తూ, అపర దాన కర్ణులుగా నిలిచిన భారతదేశ పారిశ్రామికవేత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశ అపర దాన కర్ణుల జాబితా:
శివ్ నాడార్
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (Shiv Nadar) భారతదేశంలోని అతి పెద్ద దానశీలుల్లో ఒకరు. ఏటా కోట్ల విలువైన ఆస్తులను ఇస్తున్నారు. పేద, అణగారిన వర్గాల కోసం శివ్ నాడార్ ఫౌండేషన్ అనే సంస్థను నడుపుతున్నారు. శివ నాడార్, 2022 సంవత్సరం వరకు మొత్తం రూ. 1,161 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఈ డబ్బుతో విద్యారంగాభివృద్ధి కోసం పనులు జరుగుతున్నాయి. 2022లో, సగటున, ప్రతి రోజూ దాదాపు 3 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.
రతన్ టాటా
రతన్ టాటా (Ratan Tata) కూడా తన సంపదలో ఎక్కువ భాగాన్ని దాతృత్వానికి కేటాయిస్తున్నారు. రూ. 80 లక్షలతో రతన్ టాటా ట్రస్ట్ 1919లో స్థాపించారు. ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చే దేశంలోని ప్రాచీన ఫౌండేషన్ ఇది.
అజీమ్ ప్రేమ్ జీ
విప్రో ఫౌండర్ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ Azim Premji), 2022 సంవత్సరంలో మొత్తం 484 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం రూ. 1,737,47 కోట్లు విరాళంగా వివిధ సంస్థలకు అందాయి.
ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) పేరు కూడా దాతృత్వ జాబితాలో చేరింది. ఫోర్బ్స్ ప్రకారం, 2022 సంవత్సరంలో ముఖేష్ అంబానీ మొత్తం రూ. 411 కోట్ల విరాళం ఇచ్చారు. ఇందులో ఎక్కువ భాగం విద్య కోసం ఖర్చు చేశారు.
కుమార్ మంగళం బిర్లా
దాతల జాబితాలో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ యజమాని కుమార మంగళం బిర్లా (Kumara Mangalam Birla), 2022లో మొత్తం రూ. 242 కోట్లను దాతృత్వ కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చారు.
గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ (Gautam Adani), 2022 సంవత్సరంలో మొత్తం రూ. 190 కోట్లను విరాళాల కోసం ఖర్చు చేశారు. తన 60వ పుట్టిన రోజు సందర్భంగా, మొత్తం 60,000 కోట్ల రూపాయల విరాళం ఇస్తానని కూడా ప్రకటించారు.
Gold-Silver Price 24 March 2023: మెరుపు తగ్గని పసిడి, ఏకంగా ₹1000 పెరిగిన వెండి
America Jobs: అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!
Petrol-Diesel Price 24 March 2023: పర్సు ఖాళీ చేస్తున్న పెట్రోల్-డీజిల్ రేట్లు, హైరేంజ్ నుంచి దిగట్లా
Hindenburg On Block : మరో బాంబ్ పేల్చిన హిండెన్ బర్గ్, ఈసారి జాక్ డోర్సే పేమెంట్స్ సంస్థ 'బ్లాక్' వంతు
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి