అన్వేషించండి

Stock Market Update: బేర్‌మన్న సూచీలు..! సెన్సెక్స్‌ 433, నిఫ్టీ 130 డౌన్‌.. కారణాలు ఇవే!

మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, ద్రవోల్బణం పెరిగే సూచనలతో విక్రయాలు పెరిగాయి. ఐపీవోలకు మాత్రం స్పందన బాగుంది.

స్టాక్‌ మార్కెట్లు నేడు 'బేర్‌'మన్నాయి! నష్టాల్లోనే మొదలై నష్టాల్లోనే ముగిశాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లు బలహీన సంకేతాలు ఇవ్వడం, నెగెటివ్‌ సెంటిమెంట్‌ ఉండటంతో గురువారం సూచీలు ఎరుపు రంగులోనే ఉన్నాయి. సెన్సెక్స్‌ 433 పాయింట్ల వరకు నష్టపోగా నిఫ్టీ 17,900 దిగువన ముగిసింది.

క్రితం రోజు 60,352 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ గురువారం ఉదయం భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 60,291 వద్ద మొదలైంది. 59,656 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ తర్వాత కాస్త కోలుకుంది. చివరికి 433 పాయింట్ల నష్టంతో 59,919 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 130 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 17,967 వద్ద మొదలైన సూచీ 17,798 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 17,886 వద్ద ముగిసింది.

ద్రవ్యోల్బణం సూచనలు రావడంతో బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో, ఫార్మా సూచీలు 1-2 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం వరకు నష్టపోయాయి. లోహ సూచీ మాత్రం లాభాల్లోనే కదలాడింది. నిఫ్టీలో టైటాన్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టీసీఎస్‌, ఎం అండ్‌ ఎం లాభపడగా ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌మహీంద్రా నష్టపోయాయి.

మార్కెట్‌ కబుర్లు
* సఫైర్‌ ఫుడ్స్‌ ఐపీవోను ఆఖరి రోజు 5.43 రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు.
* హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ రెండో త్రైమాసికంలో రూ.848.2 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది 38.3 శాతం వృద్ధి.
* భారత్‌ డైనమిక్స్‌  నికర లాభం రెండో త్రైమాసికంలో 64.9 శాతం పెరిగి రూ.43.2 కోట్లుగా నమోదైంది.
* సఫైర్‌ ఫుడ్స్‌ ఐపీవోకు 4.82 రెట్లు స్పందన లభించింది.
* మ్యాట్రిమోనీ డాట్‌ కామ్‌ నికర లాభం 66 శాతం పెరిగి రూ.16.6 కోట్లుగా ఉంది.
* నాట్కో ఫార్మా నికర లాభం క్యూ2లో 67.8 శాతం పెరిగి రూ.65 కోట్లుగా ఉంది.

Also Read: Credit Card Spends: అయ్య బాబోయ్‌..! క్రెడిట్‌ కార్డులతో లక్ష కోట్లు గీకేశారు..! రికార్డులు బద్దలు

Also Read: Online Term Plan: ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!

Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్‌ మొదలైంది.. వివరాలు ఇవే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget