అన్వేషించండి

AJIO Scam: బిగ్‌ స్కామ్‌ - కూపన్లు, ప్రైజ్‌ల పేరిట బురిడీ, హైకోర్టులో కేసు

హైకోర్టు ఆదేశంతో దిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు.

AJIO Scam: మన దేశంలో టెక్నాలజీ, సోషల్‌ మీడియా వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ కొత్త మోసాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కేటుగాళ్లు చాలా తెలివిగా జనాన్ని టోకరా ఇస్తున్నారు, నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి ఓ కేసులో దిల్లీ హైకోర్టు కూడా జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ కేసులో, ముకేష్ అంబానీ కంపెనీ పేరుతో భారీ స్థాయిలో మాయజేశారు మోసగాళ్లు. హైకోర్టు ఆదేశంతో దిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు.

రిలయన్స్‌కు చెందిన కంపెనీ పేరిట మోసం
దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీకి (Mekesh Ambani) చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, AJIO.com పేరుతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను నడుపుతోంది. ఆజియో బ్రాండ్‌ మన దేశంలో చాలా మందికి సుపరిచితం. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు (Reliance Industries) చెందిన లైఫ్ స్టైల్ బ్రాండ్ ఇది. ఆజియో బ్రాండ్ పాపులారిటీని ఉపయోగించుకుని, కొందరు వ్యక్తులు ప్రజల్ని మోసం చేశారు. ఈ విషయం తెలియగానే, తమ బ్రాండ్‌ దుర్వినియోగం అవుతోందంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ కేసు పెట్టింది. విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు.. ఈ కేసులో దర్యాప్తు చేయాలని, కేటుగాళ్ల గురించి కూపీ లాగాలని దిల్లీ పోలీస్‌ సైబర్ సెల్‌ను ఆదేశించింది.

ఈ స్కామ్ ఏంటి?
ఈ స్కామ్‌ ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతోంది. సైబర్‌ నేరగాళ్లు, తాము ఆజియోలో పని చేస్తున్నామని చెబుతూ ప్రజలకు ఫోన్లు చేస్తున్నారు. తాము ఆజియో అధికారులమని, కంపెనీ మీకు స్పెషల్‌గా అద్భుతమైన ఆఫర్‌ ఇస్తోందని తియ్యటి మాటలు చెబుతారు. తాము సూచించిన బ్యాంక్‌ ఖాతాల్లో రూ. 5000 నుంచి 10 లక్షల వరకు డిపాజిట్ చేయమని అడుగుతారు. డబ్బును డిపాజిట్ చేస్తే, దానికి ప్రతిఫలంగా వారికి అంతకుమించిన విలువైన స్క్రాచ్ కూపన్లు, గిఫ్ట్‌ కార్డులు, ప్రైజ్ మనీ వంటి లభిస్తాయని అబద్ధపు హామీలు ఇస్తారు. ఈ విధంగా... ఆజియో, ఆజియో ఆన్‌లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జనం నుంచి డబ్బులు వసూలు చేశారు. జనాన్ని నమ్మించడానికి AJIO ట్రేడ్‌మార్క్‌ను, లోగోను కూడా ఉపయోగించుకున్నారు. 

ఈ స్కామ్‌ గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ దృష్టికి వెళ్లింది. దీంతో... ఆజియో పేరిట మోసం చేస్తున్నారని, ట్రేడ్‌మార్క్‌ను, లోగోను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫిర్యాదు చేసింది. తన కంప్లైంట్‌లో, ఆరుగురు వ్యక్తులు, సంస్థలను నిందితులుగా చేర్చింది. మోసానికి పాల్పడుతున్న వ్యక్తులు కోల్‌కతాకు చెందిన వారని సమాచారం. మోసగాళ్లు ప్రజల ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

దిల్లీ హైకోర్టు ఆదేశం
ఈ కేసులో మోసపూరిత కార్యకలాపాలను అడ్డుకునేందుకు అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను వెంటనే సీజ్‌ చేయాలని దిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే, సదరు ఖాతాలు తెరిచిన తేదీ నుంచి ఇప్పటి వరకు లావాదేవీల స్టేట్‌మెంట్ సమర్పించాలని సూచించింది. బ్యాంక్‌ అకౌంట్‌ KYC వివరాలు సహా అందుబాటులో ఉన్న అన్ని  పేపర్లు, సాక్ష్యాలను సమర్పించాలని చెప్పింది. నిందితులు ఉపయోగించిన మొబైల్ నంబర్లను వెంటనే బ్లాక్ చేయాలని టెలికాం కంపెనీలను కూడా దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget