అన్వేషించండి

AJIO Scam: బిగ్‌ స్కామ్‌ - కూపన్లు, ప్రైజ్‌ల పేరిట బురిడీ, హైకోర్టులో కేసు

హైకోర్టు ఆదేశంతో దిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు.

AJIO Scam: మన దేశంలో టెక్నాలజీ, సోషల్‌ మీడియా వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ కొత్త మోసాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కేటుగాళ్లు చాలా తెలివిగా జనాన్ని టోకరా ఇస్తున్నారు, నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి ఓ కేసులో దిల్లీ హైకోర్టు కూడా జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ కేసులో, ముకేష్ అంబానీ కంపెనీ పేరుతో భారీ స్థాయిలో మాయజేశారు మోసగాళ్లు. హైకోర్టు ఆదేశంతో దిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు.

రిలయన్స్‌కు చెందిన కంపెనీ పేరిట మోసం
దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీకి (Mekesh Ambani) చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, AJIO.com పేరుతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను నడుపుతోంది. ఆజియో బ్రాండ్‌ మన దేశంలో చాలా మందికి సుపరిచితం. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు (Reliance Industries) చెందిన లైఫ్ స్టైల్ బ్రాండ్ ఇది. ఆజియో బ్రాండ్ పాపులారిటీని ఉపయోగించుకుని, కొందరు వ్యక్తులు ప్రజల్ని మోసం చేశారు. ఈ విషయం తెలియగానే, తమ బ్రాండ్‌ దుర్వినియోగం అవుతోందంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ కేసు పెట్టింది. విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు.. ఈ కేసులో దర్యాప్తు చేయాలని, కేటుగాళ్ల గురించి కూపీ లాగాలని దిల్లీ పోలీస్‌ సైబర్ సెల్‌ను ఆదేశించింది.

ఈ స్కామ్ ఏంటి?
ఈ స్కామ్‌ ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతోంది. సైబర్‌ నేరగాళ్లు, తాము ఆజియోలో పని చేస్తున్నామని చెబుతూ ప్రజలకు ఫోన్లు చేస్తున్నారు. తాము ఆజియో అధికారులమని, కంపెనీ మీకు స్పెషల్‌గా అద్భుతమైన ఆఫర్‌ ఇస్తోందని తియ్యటి మాటలు చెబుతారు. తాము సూచించిన బ్యాంక్‌ ఖాతాల్లో రూ. 5000 నుంచి 10 లక్షల వరకు డిపాజిట్ చేయమని అడుగుతారు. డబ్బును డిపాజిట్ చేస్తే, దానికి ప్రతిఫలంగా వారికి అంతకుమించిన విలువైన స్క్రాచ్ కూపన్లు, గిఫ్ట్‌ కార్డులు, ప్రైజ్ మనీ వంటి లభిస్తాయని అబద్ధపు హామీలు ఇస్తారు. ఈ విధంగా... ఆజియో, ఆజియో ఆన్‌లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జనం నుంచి డబ్బులు వసూలు చేశారు. జనాన్ని నమ్మించడానికి AJIO ట్రేడ్‌మార్క్‌ను, లోగోను కూడా ఉపయోగించుకున్నారు. 

ఈ స్కామ్‌ గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ దృష్టికి వెళ్లింది. దీంతో... ఆజియో పేరిట మోసం చేస్తున్నారని, ట్రేడ్‌మార్క్‌ను, లోగోను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫిర్యాదు చేసింది. తన కంప్లైంట్‌లో, ఆరుగురు వ్యక్తులు, సంస్థలను నిందితులుగా చేర్చింది. మోసానికి పాల్పడుతున్న వ్యక్తులు కోల్‌కతాకు చెందిన వారని సమాచారం. మోసగాళ్లు ప్రజల ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

దిల్లీ హైకోర్టు ఆదేశం
ఈ కేసులో మోసపూరిత కార్యకలాపాలను అడ్డుకునేందుకు అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను వెంటనే సీజ్‌ చేయాలని దిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే, సదరు ఖాతాలు తెరిచిన తేదీ నుంచి ఇప్పటి వరకు లావాదేవీల స్టేట్‌మెంట్ సమర్పించాలని సూచించింది. బ్యాంక్‌ అకౌంట్‌ KYC వివరాలు సహా అందుబాటులో ఉన్న అన్ని  పేపర్లు, సాక్ష్యాలను సమర్పించాలని చెప్పింది. నిందితులు ఉపయోగించిన మొబైల్ నంబర్లను వెంటనే బ్లాక్ చేయాలని టెలికాం కంపెనీలను కూడా దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget