అన్వేషించండి

Reliance - MG Motors: కార్ల బిజినెస్‌లోకి రిలయన్స్‌! ఎంజీ మోటార్స్‌తో చర్చలు?

Reliance - MG Motors: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్ల వ్యాపారంలోకి అడుగు పెట్టనుందా! ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది!

Reliance - MG Motors: 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్ల వ్యాపారంలోకి అడుగు పెట్టనుందా! ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది! అన్ని సవ్యంగా కుదిరితే ఎంజీ మోటార్స్‌లో వాటా కొనుగోలు చేయొచ్చని సమాచారం!

చైనీస్‌ ఆటో కంపెనీ ఎస్‌ఏఐసీకి చెందిన ఎంజీ మోటార్స్‌ తన వ్యాపారంలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్విటీ వాటాలను అమ్మేందుకు కొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హీరో గ్రూప్‌, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఉన్నాయని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గురువారం రిపోర్ట్‌ చేసింది.

'భారత కంపెనీలతో చర్చలు విస్తృతంగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ఒప్పంద ప్రక్రియను ముగించాలని ఎంజీ మోటార్స్‌ దృఢ నిశ్చయంతో ఉంది' అని ఒకరు తెలిపారు. దేశంలో తర్వాతి దశ విస్తరణకు ఎంజీ మోటార్స్‌కు నిధులు అత్యంత అవసరమని పేర్కొన్నారు. మంచి విలువకు ఈక్విటీని విక్రయించేందుకు ప్రయత్నిస్తోందని వెల్లడించారు.

చైనాతో అనుబంధం ఉన్న కంపెనీల పెట్టుబడులు, విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అంత సులభంగా అనుమతులు ఇవ్వడం లేదు. భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తకర పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణం. తమ మాతృ సంస్థ నుంచి నిధుల సేకరణ కోసం ఎంజీ మోటార్స్‌ రెండేళ్లుగా ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. కొంత మేర విజయం సాధించినా నిధుల కోసం మిగిలిన అవకాశాలను పరిశీలిస్తోంది.

ఎంజీ మోటార్స్‌ ఇండియా కార్యకలాపాలను భారతీయీకరణ చేయాలన్నదే తమ ధ్యేయమని కంపెనీ సీఈవో రాజీవ్‌ చాబా అన్నారు. అందుకే ఆర్థిక సంస్థలు, భాగస్వాములు, హై నెట్‌వర్త్‌ వ్యక్తులకు మెజారిటీ స్టేక్‌ విక్రయించేందుకు చూస్తున్నామని తెలిపారు. రెండు నుంచి నాలుగేళ్లలో షేర్‌ హోల్డింగ్‌, కంపెనీ బోర్డు, మేనేజ్‌మెంట్‌, సప్లై చైన్‌ను భారతీయీకరణ చేస్తామని వెల్లడించారు.

భారత వ్యక్తులు, కంపెనీలకు వాటాను అమ్మడం ద్వారా రాబోయే 2-4 ఏళ్లలో రూ.5000 కోట్ల మేర నిధులు సేకరించేందుకు ఎంజీ మోటార్స్‌ ఇండియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం గుజరాత్‌లోని హలోల్‌లో కార్లను తయారు చేస్తోంది. ఇందుకోసం జనరల్‌ మోటార్స్ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏడాదికి 1.2 లక్షల కార్లను ఉత్పత్తి చేయొచ్చు. ఇక్కడే రెండో ప్లాంట్‌నూ విస్తరించనుంది. దాంతో ఏడాదికి మూడు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయనుంది.

రాబోయే కాలంలో 4-5 కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తామని ఎంజీ మోటార్స్‌ తెలిపింది. ప్రధానంగా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌పై ఫోకస్‌ చేశామని వెల్లడించింది. దేశంలోని మొత్తం విక్రయాల్లో 65-75 శాతం వాటా ఈవీ సెగ్మెంట్‌ నుంచే ఉంటుందని విశ్వాసంతో ఉంది. ఇతరులతో కలిసి సెల్‌ తయారీ, హైడ్రోజన్‌ ఫ్యూయెల్‌ సెల్‌ టెక్నాలజీని తయారు చేసేందుకు చూస్తున్నామంది. విస్తరణ ద్వారా 2028 కల్లా 20,000 మందికి ఉపాధి అందించాలన్న లక్ష్యంతో ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget