అన్వేషించండి

RBI: ఖాతాలో డబ్బు లేకున్నా పేమెంట్‌ చేయొచ్చు, కొత్త ప్లాన్‌ తీసుకొస్తున్న ఆర్‌బీఐ

మీ ఖాతాలో డబ్బు లేకపోయినా మీరు చెల్లింపులు చేయగలరు. అయితే, సంబంధిత ఖాతాను UPIతో లింక్ చేసి ఉండాలి.

Reserve Bank Of India: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా మీరు ఎవరికైనా డబ్బు చెల్లించాలంటే, మీ బ్యాంక్‌ ఖాతాలో అందుకు సరిపడా డబ్బులు ఉండాలి. ఇకపై, బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా చెల్లింపులు చేయగలిగే సదుపాయం తీసుకొస్తోంది ఆర్‌బీఐ. 

ఈ నెల 6వ తేదీన, మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ చాలా కీలక ప్రకటనలు చేశారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా ప్రి-అప్రూవ్డ్‌ క్రెడిట్ లైన్స్‌ (pre-approved credit lines) లేదా ప్రి-శాంక్షన్డ్‌ క్రెడిట్‌ లైన్స్‌ (pre-sanctioned credit lines) తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా, మీ ఖాతాలో డబ్బు లేకపోయినా మీరు చెల్లింపులు చేయగలరు. అయితే, సంబంధిత ఖాతాను UPIతో లింక్ చేసి ఉండాలి. 

భారతదేశంలో పేమెంట్స్‌ విధానం కొంతకాలంగా చాలా వేగంగా మారుతోంది. ముఖ్యంగా, UPI వచ్చాక భారతదేశంలో చెల్లింపుల విధానమే మారిపోయింది. బ్యాంక్‌ ఖాతాలో ఉన్న డబ్బును, కేవలం ఫోన్‌ నంబర్‌ను ఉపయోగించి క్షణాల్లో వేరొక ఖాతాకు పంపుతున్నాం. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా చెల్లింపు సేవలను మరింత ఆధునీకరించేలా, UPIని బలోపేతం చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ చాలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా, రూపే క్రెడిట్ కార్డ్‌లను UPIతో లింక్ చేయడానికి కొంతకాలం క్రితమే అనుమతి ఇచ్చింది. 

కొత్త ప్లాన్‌తో చెల్లింపు విధానం ఎలా మారుతుంది?                                   
UPIతో బ్యాంక్ ఖాతాను లింక్ చేయడం ద్వారా చెల్లింపులు చేసే విధానం అందరికీ తెలిసిందే. పేమెంట్స్‌ యాప్‌ వాలెట్‌లో ఉన్న డబ్బును కూడా UPIని ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా UPI చెల్లింపులు చేయవచ్చు. ఇలాంటి సేవలకు కొనసాగింపుగా తీసుకొచ్చిందే "UPI ద్వారా ప్రి-శాంక్షన్డ్‌ క్రెడిట్‌ లైన్స్‌ చెల్లింపులు". అంటే, బ్యాంకు ఒక వ్యక్తికి క్రెడిట్‌ కార్డ్‌ తరహాలోనే క్రెడిట్‌ను జారీ చేస్తే.. ఆ మొత్తాన్ని UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

బ్యాంకు డిపాజిట్ లేకపోయినా చెల్లింపు                                   
RBI ప్రతిపాదించిన ఈ కొత్త పద్ధతి అమలులోకి వస్తే... కస్టమర్‌లు ప్రి-అప్రూవ్డ్ క్రెడిట్స్‌ నుంచి కూడా UPI చెల్లింపులు చేయగలుగుతారు. UPI ద్వారా క్రెడిట్ లైన్ ఫెసిలిటీ, కస్టమర్‌లకు పాయింట్-ఆఫ్-సేల్‌ అనుభవాన్ని మరింత మెరుగ్గా, సులభంగా మారుస్తుంది. ఈ విధానం అమలు, విధివిధానాలపై పూర్తి స్థాయి సమాచారాన్ని ఆర్‌బీఐ ఇంకా విడుదల చేయలేదు, నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్‌ అవుతుంది.     

క్రెడిట్ కార్డుల సంఖ్యను వెంట తీసుకెళ్లాల్సిన రిస్క్‌ను తగ్గించి, యుపీఐ ద్వారా క్రెడిట్‌ లావాదేవీలు జరిపే అవకాశం కల్పించడానికి ప్రి-శాంక్షన్డ్‌ క్రెడిట్‌ లైన్స్‌ విధానం తీసుకొస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget