అన్వేషించండి

SIM Card Rules: కొత్త సిమ్‌ తీసుకోవాలంటే కొత్త రూల్స్‌, ఇకపై ట్రిక్స్‌ పని చేయవు

ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించి, సంపూర్ణంగా డిజిటల్‌ కేవైసీకి మారాలన్నది టెలికాం మంత్రిత్వ శాఖ ఉద్దేశం.

New Mobile Connection Rules: కొత్త మొబైల్‌ సిమ్‌ ‍కార్డ్‌ ‍‌(SIM Card) తీసుకోవాలంటే అతి త్వరలోనే రూల్స్‌ మారబోతున్నాయి. భారత టెలికాం మంత్రిత్వ శాఖ, కొత్త మొబైల్ కనెక్షన్‌ కొనుగోలు నిబంధనలను (New SIM Card Rules) మార్చింది. కొత్త రూల్స్‌ కొత్త సంవత్సరం నుంచి, అంటే 01 జనవరి 2024 నుంచి అమల్లోకి వస్తాయి. 

పూర్తిగా పేపర్‌లెస్‌ ఈ-కేవైసీకి (Paperless e-KYC)
దేశంలో డిజిటలైజేషన్‌ను (Digitization) ప్రోత్సహించేందుకు టెలికాం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది, కొత్త సిమ్ కార్డు తీసుకునే విధానాన్ని పూర్తిగా పేపర్‌లెస్‌ ఈ-కేవైసీకి మారుస్తోంది. ప్రస్తుతం, ఒక వ్యక్తి కొత్త సిమ్‌ కార్డ్‌ తీసుకోవాలంటే దాని కోసం ఒక అప్లికేషన్‌ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్‌ ఫారంతో పాటు ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌, ఫొటో ఇవ్వాలి. కొన్ని కంపెనీలు ఇప్పటికే పేపర్‌లెస్‌ విధానాన్ని ఫాలో అవుతున్నా, కొన్ని చోట్ల ఇప్పటికీ పేపర్‌ ఆధారిత అప్లికేషన్‌ విధానమే నడుస్తోంది. ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించి, సంపూర్ణంగా డిజిటల్‌ కేవైసీకి మారాలన్నది టెలికాం మంత్రిత్వ శాఖ ఉద్దేశం.       

కేవైసీ రూల్స్‌లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్లో భాగంగా, కొత్త రూల్‌ తీసుకువస్తున్నట్లు టెలికాం విభాగం (DoT) ఓ ప్రకటన విడుదల చేసింది. 2012 నుంచి అనుసరిస్తున్న పేపర్‌ విధానానికి ఇకపై చెల్లుచీటీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.      

మరో ఆసక్తికర కథనం: మహిళల కోసం గోల్డెన్‌ టిప్స్‌ - బంగారం, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌ - ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

ఇకపై అలాంటి ట్రిక్స్‌ పని చేయవు
డిజిటల్‌ కేవైసీకి (Digital KYC) మారడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. పేపర్‌ విధానాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు వందల సంఖ్యలో సిమ్‌ కార్డులు తీసుకుంటున్నారు. వాటిని అక్రమాలకు, అసాంఘిక కార్యక్రమాలకు, దేశ విద్రోహ చర్యలకు ఉపయోగిస్తున్నారు. పైగా, ఒక వ్యక్తికి తెలీకుండా అతని పేరిట సిమ్‌ కార్డులు పొందుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో, అమాయకులు పోలీసు కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పేపర్‌లెస్‌ ఈ-కేవైసీకి మారితే, అక్రమార్కుల ట్రిక్స్‌ పని చేయవు, ఇష్టం వచ్చినట్లు కొత్త సిమ్‌లు తీసుకోవడానికి వీలవదు.          

2024 జనవరి 01 నుంచి, ఏ వ్యక్తయినా కొత్త సిమ్‌/మొబైల్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే, డిజిటల్‌ కేవైసీని పూర్తి చేయాలి. ఇది కాకుండా, పాత నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. ఒక వ్యక్తి ఒకేసారి ఎక్కువ సిమ్ కార్డులను కొనుగోలు చేయాలంటే, కమర్షియల్‌ కనెక్షన్ ద్వారా మాత్రమే పొందడానికి వీలవుతుంది. కొత్త సిమ్‌ కార్డ్ తీసుకునే సమయంలో, సిమ్‌ కార్డ్‌ కొనుగోలుదారుతో పాటు విక్రేత కూడా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పేపర్‌లెస్‌ ఈ-కేవైసీ విధానం వస్తే, టెలికాం కంపెనీలకు పేపర్‌ ఖర్చు తగ్గుతుంది, వాటిని వెరిఫై చేసే సమయం మిగులుతుంది. టెలికాం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియా కంపెనీలు స్వాగతించాయి.

మరో ఆసక్తికర కథనం: జియోట్యాగింగ్ లేకుండా పన్ను మినహాయింపు రాదు, ఈ టెక్నాలజీని ఎలా వాడాలో తెలుసుకోండి

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget