అన్వేషించండి

SIM Card Rules: కొత్త సిమ్‌ తీసుకోవాలంటే కొత్త రూల్స్‌, ఇకపై ట్రిక్స్‌ పని చేయవు

ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించి, సంపూర్ణంగా డిజిటల్‌ కేవైసీకి మారాలన్నది టెలికాం మంత్రిత్వ శాఖ ఉద్దేశం.

New Mobile Connection Rules: కొత్త మొబైల్‌ సిమ్‌ ‍కార్డ్‌ ‍‌(SIM Card) తీసుకోవాలంటే అతి త్వరలోనే రూల్స్‌ మారబోతున్నాయి. భారత టెలికాం మంత్రిత్వ శాఖ, కొత్త మొబైల్ కనెక్షన్‌ కొనుగోలు నిబంధనలను (New SIM Card Rules) మార్చింది. కొత్త రూల్స్‌ కొత్త సంవత్సరం నుంచి, అంటే 01 జనవరి 2024 నుంచి అమల్లోకి వస్తాయి. 

పూర్తిగా పేపర్‌లెస్‌ ఈ-కేవైసీకి (Paperless e-KYC)
దేశంలో డిజిటలైజేషన్‌ను (Digitization) ప్రోత్సహించేందుకు టెలికాం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది, కొత్త సిమ్ కార్డు తీసుకునే విధానాన్ని పూర్తిగా పేపర్‌లెస్‌ ఈ-కేవైసీకి మారుస్తోంది. ప్రస్తుతం, ఒక వ్యక్తి కొత్త సిమ్‌ కార్డ్‌ తీసుకోవాలంటే దాని కోసం ఒక అప్లికేషన్‌ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్‌ ఫారంతో పాటు ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌, ఫొటో ఇవ్వాలి. కొన్ని కంపెనీలు ఇప్పటికే పేపర్‌లెస్‌ విధానాన్ని ఫాలో అవుతున్నా, కొన్ని చోట్ల ఇప్పటికీ పేపర్‌ ఆధారిత అప్లికేషన్‌ విధానమే నడుస్తోంది. ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించి, సంపూర్ణంగా డిజిటల్‌ కేవైసీకి మారాలన్నది టెలికాం మంత్రిత్వ శాఖ ఉద్దేశం.       

కేవైసీ రూల్స్‌లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్లో భాగంగా, కొత్త రూల్‌ తీసుకువస్తున్నట్లు టెలికాం విభాగం (DoT) ఓ ప్రకటన విడుదల చేసింది. 2012 నుంచి అనుసరిస్తున్న పేపర్‌ విధానానికి ఇకపై చెల్లుచీటీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.      

మరో ఆసక్తికర కథనం: మహిళల కోసం గోల్డెన్‌ టిప్స్‌ - బంగారం, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌ - ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

ఇకపై అలాంటి ట్రిక్స్‌ పని చేయవు
డిజిటల్‌ కేవైసీకి (Digital KYC) మారడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. పేపర్‌ విధానాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు వందల సంఖ్యలో సిమ్‌ కార్డులు తీసుకుంటున్నారు. వాటిని అక్రమాలకు, అసాంఘిక కార్యక్రమాలకు, దేశ విద్రోహ చర్యలకు ఉపయోగిస్తున్నారు. పైగా, ఒక వ్యక్తికి తెలీకుండా అతని పేరిట సిమ్‌ కార్డులు పొందుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో, అమాయకులు పోలీసు కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పేపర్‌లెస్‌ ఈ-కేవైసీకి మారితే, అక్రమార్కుల ట్రిక్స్‌ పని చేయవు, ఇష్టం వచ్చినట్లు కొత్త సిమ్‌లు తీసుకోవడానికి వీలవదు.          

2024 జనవరి 01 నుంచి, ఏ వ్యక్తయినా కొత్త సిమ్‌/మొబైల్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే, డిజిటల్‌ కేవైసీని పూర్తి చేయాలి. ఇది కాకుండా, పాత నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. ఒక వ్యక్తి ఒకేసారి ఎక్కువ సిమ్ కార్డులను కొనుగోలు చేయాలంటే, కమర్షియల్‌ కనెక్షన్ ద్వారా మాత్రమే పొందడానికి వీలవుతుంది. కొత్త సిమ్‌ కార్డ్ తీసుకునే సమయంలో, సిమ్‌ కార్డ్‌ కొనుగోలుదారుతో పాటు విక్రేత కూడా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పేపర్‌లెస్‌ ఈ-కేవైసీ విధానం వస్తే, టెలికాం కంపెనీలకు పేపర్‌ ఖర్చు తగ్గుతుంది, వాటిని వెరిఫై చేసే సమయం మిగులుతుంది. టెలికాం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియా కంపెనీలు స్వాగతించాయి.

మరో ఆసక్తికర కథనం: జియోట్యాగింగ్ లేకుండా పన్ను మినహాయింపు రాదు, ఈ టెక్నాలజీని ఎలా వాడాలో తెలుసుకోండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget