అన్వేషించండి

Mukesh Ambani: 'ఫ్యామిలీ డే'లో ముకేష్‌ అంబానీ తన వారసులకు ఇచ్చిన టార్గెట్స్‌ ఏంటో తెలుసా?

'రిలయన్స్ ఫ్యామిలీ డే'ని ఏటా నిర్వహించి, కంపెనీకి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.

Mukesh Ambani: మెస్సీని ఆదర్శంగా తీసుకుందాం, మర్రిచెట్టులా విస్తరిద్దాం అంటూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ తన తర్వాతి తరానికి దిశానిర్దేశం చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ‍‌(Reliance Industries) వ్యవస్థాపకుడు, ముకేష్‌ తండ్రి ధీరూభాయ్ అంబానీ (Dhirubhai Ambani) జయంతి సందర్భంగా నిర్వహించిన 'రిలయన్స్ ఫ్యామిలీ డే'లో ‍‌(Reliance Family Day 2022) ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ముగ్గురు వారసులకు లక్ష్యాలను నిర్దేశించారు. 'రిలయన్స్ ఫ్యామిలీ డే'ని ఏటా నిర్వహించి, కంపెనీకి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. 

2021లో నిర్వహించిన ఫ్యామిలీ డే కార్యక్రమంలో.. రిలయన్స్‌ గ్రూప్‌లోని 3 వ్యాపార విభాగాలను తన ముగ్గురు పిల్లలకు (ఆకాశ్‌, ఈశా, అనంత్‌) ముకేశ్‌ అప్పజెప్పారు. టెలికాం, డిజిటల్‌ వ్యాపారాల బాధ్యతలను ఆకాశ్‌ అంబానీ ‍‌(Akash Ambani) భుజాల మీద పెట్టారు. రిటైల్‌ వ్యాపారాన్ని పెంచే అవకాశాన్ని ఈషా అంబానీకి ‍‌(Isha Ambani) ఇచ్చారు. న్యూ ఎనర్జీ బిజినెస్‌ను అనంత్‌ అంబానీకి ‍‌(‍‌Ananth Ambani) అప్పగించారు.

రిలయన్స్ ఫ్యామిలీ డేలో ముకేష్‌ అంబానీ ప్రసంగం ఆయన మాటల్లోనే..

సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతూనే ఉంటాయి. రిలయన్స్ మరింత విస్తృతంగా ఎదుగుతుంది. మర్రిచెట్టులా, దాని కొమ్మలు చాలా దూరం వ్యాపించి, దాని మూలాలు లోతుగా వెళ్లి భారతీయుల జీవితాలను సృజిస్తూనే ఉంటుంది. వారిని సుసంపన్నం చేస్తుంది, వారికి శక్తిని ఇస్తుంది, వారిని పెంచి పోషించి, సంరక్షణ అందిస్తుంది. 

2022 సంవత్సరం చివరి నాటికి, రిలయన్స్ తన స్వర్ణ దశాబ్దంలో సగం దూరాన్ని కవర్ చేసింది. ఇప్పటి నుంచి 5 సంవత్సరాల తరువాత, రిలయన్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా, రిలయన్స్‌ సాధించాల్సిన లక్ష్యాల గురించి ఉన్నతాధికారులు, ఉద్యోగులకు చెప్పాలనుకుంటున్నాను. 

ఆకాష్ అంబానీకి ఇచ్చిన లక్ష్యం
ఆకాష్ అధ్యక్షతన, భారతదేశం అంతటా ప్రపంచంలోనే అత్యుత్తమ 5G నెట్‌వర్క్‌ను జియో (Jio) ప్రారంభిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా సేవలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 5G సేవలు 2023 లో పూర్తిగా అమలులోకి వస్తాయి.  భారతదేశ భవిష్యత్‌ అవకాశాలను అందుకోవడానికి కోసం జియో ప్లాట్‌ఫామ్స్‌ సిద్ధంగా ఉండాలి. దేశీయ & అంతర్జాతీయ మార్కెట్లకు ప్రత్యేకమైన డిజిటల్ ఉత్పత్తులు, పరిష్కారాలను అందించడమే ఈ అవకాశాలు. ప్రతి గ్రామానికి 5G కనెక్టివిటీ అందించాలి. ఫలితంగా, నగరాలు - గ్రామాల మధ్య అంతరాన్ని పూర్తిగా తొలగించే చారిత్రాత్మక అవకాశం భారతదేశానికి అందుతుంది. తద్వారా, దేశ అభివృద్ధిలో జియో భాగం కావాలి.

ఈషా అంబానీకి ఇచ్చిన లక్ష్యం
ఇషా నాయకత్వంలో రిటైల్ వ్యాపారం అన్ని రకాల ఉత్పత్తుల్లో, భారతదేశంలో చాలా విస్తృతంగా, లోతుగా చొచ్చుకుపోతోంది. మరికొన్ని లక్ష్యాలను సాధించే సత్తా రిటైల్‌ బృందానికి ఉందని నమ్ముతున్నాను. జియో లాగే రిటైల్‌ వ్యాపార అభివృద్ధి వల్ల కూడా దేశ వృద్ధిపై ప్రభావం కనిపించాలి. కొత్త ఉద్యోగాలు రావాలి. రైతులకు మరింత ఆదాయం అందాలి. 

అనంత్‌ అంబానీకి ఇచ్చిన లక్ష్యం
రిలయన్స్ తాజా స్టార్టప్ వ్యాపారం పునరుత్పాదక ఇంధనం. కంపెనీని లేదా దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం దీనికి ఉంది. జామ్‌నగర్‌లోని మా గిగా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేశాము. దేశంలోనే అతి పెద్ద, అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పూర్తి పర్యావరణహిత కంపెనీగా మారాలి. న్యూ ఎనర్జీ గ్రూప్‌ లక్ష్యం ఇదే. ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని, భద్రత సాధించాలంటే దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించాలి. గుర్తుంచుకోండి, మీరు ముస్తాద్, సాంకేతికత రంగంలో ముందుండడం ద్వారా మాత్రమే ఈ లక్ష్యాన్ని చేరుకోగలరు.

ధీరూభాయ్‌ - మెస్సీ - వివేకానందుడు
ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌ని అర్జెంటీనా ఎలా గెలుచుకుంది? ఇది నాయకత్వం జట్టు కృషి కలయిక. మెస్సీ (Messi) సొంతంగా కప్‌ గెలవలేదు. అదేవిధంగా మెస్సీ స్ఫూర్తిదాయకమైన నాయకత్వం లేకుండా అర్జెంటీనా విజయం సాధించలేదు. ధీరూభాయ్‌ అంబానీ కూడా ఇదే తరహాలో రిలయన్స్‌ను నిర్మించారు. ఆయనతో పాటు స్వామి వివేకానంద ఆలోచనలూ నాలో స్ఫూర్తిని నింపాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pipeline Gas: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Bhogi 2025 : భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
Ys Jagan: 'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pipeline Gas: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Bhogi 2025 : భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
Ys Jagan: 'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
Daaku Mahaaraj Review - డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
Karimnagar News: మంత్రుల సమక్షంలోనే వివాదం - కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం రసాభాస, పాడి కౌశిక్ రెడ్డిని బయటకు లాక్కెళ్లిన పోలీసులు
మంత్రుల సమక్షంలోనే వివాదం - కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం రసాభాస, పాడి కౌశిక్ రెడ్డిని బయటకు లాక్కెళ్లిన పోలీసులు
IPL-2025 UPdate: ఐపీఎల్ డేట్ వచ్చేసిందోచ్ - 2 నెలల పాటు ధనాధన్ ఆట, నిర్వహణ తేదీలు ప్రకటించిన బీసీసీఐ
ఐపీఎల్ డేట్ వచ్చేసిందోచ్ - 2 నెలల పాటు ధనాధన్ ఆట, నిర్వహణ తేదీలు ప్రకటించిన బీసీసీఐ
Atreyapuram Boat Racing: సంక్రాంతికి ఫుల్ జోష్ - కోనసీమలో కేరళ తరహా పడవ పోటీలు, ఆత్రేయపురానికి బోట్ రేసింగ్ శోభ
సంక్రాంతికి ఫుల్ జోష్ - కోనసీమలో కేరళ తరహా పడవ పోటీలు, ఆత్రేయపురానికి బోట్ రేసింగ్ శోభ
Embed widget