By: ABP Desam | Updated at : 08 May 2022 04:55 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎల్ఐసీ ఐపీవో
LIC IPO GMP To Subscription Status: ఆదివారం, సెలవు రోజు, మార్కెట్లు బంద్! అయినా ఎల్ఐసీ ఐపీవో (LIC IPO)కు స్పందన తగ్గట్లేదు. దేశంలోనే అతిపెద్ద ఇష్యూపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపుగా అన్ని విభాగాల్లోనూ సబ్స్క్రిప్షన్ పూర్తైంది. ఇప్పటి వరకు 1.66 రెట్లు స్పందన లభించిందని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వం 16.2 కోట్ల షేర్లను మాత్రమే ఆఫర్ చేస్తుండగా 26.83 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. ఈ మొత్తం ఇష్యూ ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్ల వరకు సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
LIC IPO GMP అప్డేట్
ప్రస్తుతం ఎల్ఐసీ గ్రే మార్కెట్ ప్రీమియం (LIC IPO GMP) ఒక్కో షేరుకు రూ.50గా ఉంది. నిజానికి గత రెండు రోజుల్లో జీఎంపీ ధర 50 శాతం తగ్గిపోయింది. మార్కెట్లలో హెవీ సెల్ఆఫ్ ఉండటమే ఇందుకు కారణం. తాజా అంచనాల ప్రకారం ఎల్ఐసీ షేరు రూ.1009 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే అప్పర్ బ్యాండ్ ధర రూ.949 కన్నా 6 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
1.66 రెట్లు స్పందన
ఐపీవో ఆరంభమైన ఐదో రోజుకు ఎల్ఐసీని 1.66 రెట్లు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. పాలసీ హోల్డర్ల కోటాకు 4.67 రెట్లు, ఉద్యోగుల కోటాకు 3.57 రెట్లు స్పందన వచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోటాకూ పూర్తి స్థాయిలో సబ్స్క్రిప్షన్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటాలో మాత్రం ఇంకా 30 శాతం సబ్స్క్రైబ్ కాలేదని తెలిసింది.
ఎల్ఐసీ వివరాలు
LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. మే 4న మొదలయ్యే ఇష్యూ 9న ముగుస్తుంది. భారత్ స్టాక్మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.
సబ్స్క్రిప్షన్ తేదీ: ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలవుతుంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రైస్ బ్యాండ్ : ఎల్ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు రూ.60, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఆఫర్ వివరాలు: అప్పర్ బ్యాండ్ ధరకు ఎల్ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఇది మొత్తంగా ఆఫర్ ఫర్ సేల్ ఐపీవో. 221,374,920 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం ఆఫర్లో 50 శాతం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతం నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు.
ఎన్ని లాట్లు ఇస్తారు: ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్కు బిడ్ దాఖలు చేయొచ్చు. ఒక లాట్లో 15 షేర్లు ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 14 లాట్లు అంటే 210 షేర్లకు బిడ్ వేయొచ్చు. మొత్తం రూ.1,99,290 అవుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసీ ఉద్యోగులు, ఎల్ఐసీ పాలసీదారులు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈవారం IPOకు వస్తున్న 11 కంపెనీలు, నిధుల సమీకరణే లక్ష్యంగా పోటీ
Mega IPO: ఫస్ట్ లిస్టింగ్లో దూసుకెళ్లిన హెచ్డీబీ ఫైనాన్షియల్ షేర్ - కొనసాగుతుందా? ఇతర వాటిలా పడిపోతుందా?
Nuvvunte Na Jathaga Serial july 1st: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆనంద్ సీక్రెట్ లీక్.. దేవా ప్రేమ పసిగట్టేసిన మిథున.. బేబీ దగ్గరకు ప్రేమ జంట!
Most Awaited IPO: ఈ IPO కోసం 9 ఏళ్లుగా ఎదురుచూపులు - అతి త్వరలో సెబీ అనుమతి!
Upcoming IPO: మార్కెట్లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి
YSRCP Viral Video : 'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!
Hyderabad TDR Policy 2026: మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్! టీడీఆర్లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్, బిల్డర్లకు కొత్త రూల్స్!
Netflix Upcoming Movies Telugu: నెట్ఫ్లిక్స్ జాతర... పవన్ 'ఉస్తాద్' to వెంకీ 'ఏకే 47', చరణ్ 'పెద్ది' వరకు... 2026లో వచ్చే కొత్త సినిమాలు ఇవే
Iran vs America : ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!