By: ABP Desam | Updated at : 08 May 2022 04:55 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎల్ఐసీ ఐపీవో
LIC IPO GMP To Subscription Status: ఆదివారం, సెలవు రోజు, మార్కెట్లు బంద్! అయినా ఎల్ఐసీ ఐపీవో (LIC IPO)కు స్పందన తగ్గట్లేదు. దేశంలోనే అతిపెద్ద ఇష్యూపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపుగా అన్ని విభాగాల్లోనూ సబ్స్క్రిప్షన్ పూర్తైంది. ఇప్పటి వరకు 1.66 రెట్లు స్పందన లభించిందని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వం 16.2 కోట్ల షేర్లను మాత్రమే ఆఫర్ చేస్తుండగా 26.83 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. ఈ మొత్తం ఇష్యూ ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్ల వరకు సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
LIC IPO GMP అప్డేట్
ప్రస్తుతం ఎల్ఐసీ గ్రే మార్కెట్ ప్రీమియం (LIC IPO GMP) ఒక్కో షేరుకు రూ.50గా ఉంది. నిజానికి గత రెండు రోజుల్లో జీఎంపీ ధర 50 శాతం తగ్గిపోయింది. మార్కెట్లలో హెవీ సెల్ఆఫ్ ఉండటమే ఇందుకు కారణం. తాజా అంచనాల ప్రకారం ఎల్ఐసీ షేరు రూ.1009 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే అప్పర్ బ్యాండ్ ధర రూ.949 కన్నా 6 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
1.66 రెట్లు స్పందన
ఐపీవో ఆరంభమైన ఐదో రోజుకు ఎల్ఐసీని 1.66 రెట్లు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. పాలసీ హోల్డర్ల కోటాకు 4.67 రెట్లు, ఉద్యోగుల కోటాకు 3.57 రెట్లు స్పందన వచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోటాకూ పూర్తి స్థాయిలో సబ్స్క్రిప్షన్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటాలో మాత్రం ఇంకా 30 శాతం సబ్స్క్రైబ్ కాలేదని తెలిసింది.
ఎల్ఐసీ వివరాలు
LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. మే 4న మొదలయ్యే ఇష్యూ 9న ముగుస్తుంది. భారత్ స్టాక్మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.
సబ్స్క్రిప్షన్ తేదీ: ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలవుతుంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రైస్ బ్యాండ్ : ఎల్ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు రూ.60, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఆఫర్ వివరాలు: అప్పర్ బ్యాండ్ ధరకు ఎల్ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఇది మొత్తంగా ఆఫర్ ఫర్ సేల్ ఐపీవో. 221,374,920 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం ఆఫర్లో 50 శాతం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతం నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు.
ఎన్ని లాట్లు ఇస్తారు: ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్కు బిడ్ దాఖలు చేయొచ్చు. ఒక లాట్లో 15 షేర్లు ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 14 లాట్లు అంటే 210 షేర్లకు బిడ్ వేయొచ్చు. మొత్తం రూ.1,99,290 అవుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసీ ఉద్యోగులు, ఎల్ఐసీ పాలసీదారులు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
IPOs: 75 ఐపీవోలు, రూ.62,000 కోట్లు - ప్రైమరీ మార్కెట్ సూపర్హిట్
Year Ender 2023: సంచలనం సృష్టించిన టాప్-10 IPOలు, పెట్టుబడిదార్లకు కనక వర్షం
Tata Technologies IPO: టాటా టెక్ IPO ధరల వివరాలు వచ్చేశాయ్,మినిమమ్ ఇంత ఇన్వెస్ట్ చేయాలని కండీషన్
IPO: టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఐపీవో - ఎక్స్పర్ట్లు బిడ్ వేయమంటున్నారా, వద్దంటున్నారా?
IPOs: ఈ నెలలో నాలుగు పబ్లిక్ ఆఫర్స్ రె'ఢీ' - బరిలో దిగుతున్న టాటా, టీవీఎస్ గ్రూపులు
Chandrababu : జగన్కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?