అన్వేషించండి

Vedanta: డబ్బు కోసం వేదాంత పడుతున్న పాట్లు వర్ణనాతీతం, RBI అనుమతి కోసం విజ్ఞప్తి

విదేశీ అనుబంధ సంస్థల్లో ఒక దాని ద్వారా ఈ గ్రూప్‌ 1 బిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించబోతోంది.

Anil Agarwal-led Vedanta: మెటల్స్ & మైనింగ్ రంగ దిగ్గజం వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ (Vedanta Resources Ltd) ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్న సంగతి తెలిసిందే. భారీ మొత్తంలో రుణ వాయిదాలను ఈ సంస్థ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితిలో ఉంది. కానీ చేతిలో ఉన్న డబ్బు ఏ మూలకూ సరిపోదు. రుణ వాయిదాలను చెల్లించడానికి వివిధ మార్గాల్లో డబ్బు సేకరించే ప్రతిపాదనలను ఈ కంపెనీ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో, వేదాంత రిసోర్సెస్ ఇండియన్‌ యూనిట్ అయిన వేదాంత లిమిటెడ్ (Vedanta Ltd), రిజర్వ్ బ్యాంక్ నుంచి ఒక అనుమతిని కోరింది.

కంపెనీ ప్లాన్‌ ఇది
మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం... వేదాంత గ్రూప్‌లోని విదేశీ అనుబంధ సంస్థల్లో ఒక దాని ద్వారా ఈ గ్రూప్‌ 1 బిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించబోతోంది. ఆ రుణానికి హామీ ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి వేదాంత లిమిటెడ్ (VDL) అనుమతిని కోరింది. ఈ విధంగా సేకరించిన నిధులు డివిడెండ్ చెల్లింపుల రూపంలో వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్‌కు (VRL) పంపుతారని చెప్పుకుంటున్నారు.

మారిషస్‌ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న VDL పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ అయిన THL జింక్ వెంచర్స్ (THL Zinc Ventures) ద్వారా రుణాన్ని సమీకరించడం జరగవచ్చు. 1 బిలియన్ డాలర్ల రుణం కోసం JP మోర్గాన్, బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్, డ్యుయిష్ బ్యాంక్‌తో వేదాంత గ్రూప్ చర్చలు జరుపుతోందని సమాచారం. ప్రతిపాదిత రుణాన్ని ఇవ్వడానికి ఆయా బ్యాంక్‌లు సిద్ధపడినా, వడ్డీ రేటు వద్ద ప్రతిష్టంబన నెలకొంది, ఆ పాయింట్‌ నుంచి చర్చలు ముందుకు సాగడం లేదు.

మరో మూడు నెలల్లో చాలా డబ్బు అవసరం
వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ప్రస్తుతం తీవ్రమైన రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2023 జూన్ చివరి నాటికి ఈ కంపెనీ సుమారు 2 బిలియన్‌ డాలర్లను రుణ వాయిదాల రూపంలో చెల్లించాలి. ఈ ఏడాది మార్చి వరకు కట్టాల్సిన అన్ని రుణాలను చెల్లించినట్లు వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఇటీవల వెల్లడించింది. జూన్ త్రైమాసికం చివరి నాటికి అన్ని చెల్లింపులు పూర్తి చేస్తామని కూడా ఈ కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది.

కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ (Vedanta Chairman Anil Agarwal) కూడా, రుణ వాయిదాలను చెల్లిస్తామన్న విశ్వాసాన్ని ఇటీవలి ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. ఇది టీ కప్పులో తుపాను లాంటి సమస్య అంటూ కొట్టిపారేశారు. వేదాంతకు డబ్బు ఇవ్వాలని చాలామంది ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అయితే, ఏ బ్యాంకు లేదా ఫండ్ పేరునూ ఆయన ప్రస్తావించలేదు.

వాటా విక్రయించే ఆలోచన లేదట
రుణాన్ని తిరిగి చెల్లించడానికి వాటాలను విక్రయించే అవకాశాలను వేదాంత పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. భారతదేశంలోని లిస్టెడ్ కంపెనీ వేదాంత లిమిటెడ్‌లో 10 శాతం వాటాను వ్యూహాత్మకంగా విక్రయించడానికి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ పెట్టుబడిదార్లను సంప్రదిస్తోందని ఆ వార్తల సారాంశం. అయితే, వాటా విక్రయ వార్తలను వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఖండించింది. అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేసింది.

శుక్రవారం (24 మార్చి 2023), 0.59% నష్టంతో రూ. 269.75 వద్ద వేదాంత షేర్‌ ధర ముగిసింది. గత 6 నెలల కాలంలో ఈ స్టాక్‌ కేవలం 2% లాభపడింది. గత ఏడాది కాలంలో 34% పతనమైంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Redmi A4 5G: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే రెడ్‌మీ ఏ4 5జీ!
దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే రెడ్‌మీ ఏ4 5జీ!
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Redmi A4 5G: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే రెడ్‌మీ ఏ4 5జీ!
దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే రెడ్‌మీ ఏ4 5జీ!
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Haryana Rohingya Connection: రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ -  హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ - హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
Train Accident: మరో రైలు ప్రమాదం - పట్టాలు తప్పిన అగర్తలా లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్
మరో రైలు ప్రమాదం - పట్టాలు తప్పిన అగర్తలా లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్
AP IAS : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
Revanth Reddy : మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Embed widget