అన్వేషించండి

Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ

Adani Group News: సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు పొందేందుకు $250 మిలియన్ల లంచం ఇవ్వజూపిన కేసులో గౌతమ్ అదానీ సహా ఏడుగురు అధికారుల పాత్రపై US కోర్టులో అభియోగాలు దాఖలయ్యాయి.

Adani Group Cancels 600 Million Dollars Bond Offering: భారతదేశంలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు పొందేందుకు $250 మిలియన్ల లంచం ఇవ్వజూపడం, తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణ ప్రయత్నాలు వంటి ఆరోపణలతో ఈ రోజు (గురువారం, 21 నవంబర్‌ 2024) అదానీ గ్రూప్‌ షేర్లు విలవిల్లాడాయి. గ్రూప్‌ స్టాక్స్‌ 10 శాతం నుంచి 20 శాతం వరకు పతనమయ్యాయి. అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ సహా ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌లు $250 మిలియన్ల లంచం పథకాన్ని రూపొందించారని యుఎస్ ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలతో గ్రూప్‌ షేర్లలో ఈ పతనం కొనసాగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో, తమ $600 మిలియన్ల బాండ్ ఆఫర్‌ను రద్దు చేసినట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ (Adani Green Energy Ltd) ప్రకటించింది.

యుఎస్ ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, అదానీ గ్రీన్ ఎనర్జీ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. "మా బోర్డు సభ్యులైన గౌతమ్ అదానీ మరియు సాగర్ అదానీకి వ్యతిరేకంగా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వరుసగా యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో క్రిమినల్ నేరారోపణలు చేశాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మా బోర్డు సభ్యుడు వినీత్ జైన్‌ను కూడా ఆ నేరారోపణలో చేర్చింది. ఈ పరిణామాల దృష్ట్యా, మా అనుబంధ సంస్థలు ప్రతిపాదిత డాలర్‌-డినామినేటెడ్ బాండ్ ఆఫర్‌లను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాయి".

రూ.2,100 కోట్ల లంచం ఆరోపణలు
బ్రూక్లిన్ కోర్టులో దాఖలు చేసిన అభియోగాల ప్రకారం, భారతదేశంలో సౌరశక్తి కాంట్రాక్టులను పొందేందుకు 250 మిలియన్ డాలర్ల (రూ. 2,100 కోట్లు) లంచం ఇవ్వజూపిన పథకంలో సూత్రధారిగా గౌతమ్ అదానీ, సాగర్ ఆర్ అదానీ, వినీత్ ఎస్ జైన్‌తో పాటు మరో నలుగురు (మొత్తం ఏడుగురు) అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నిందితులు US పెట్టుబడిదారులకు తప్పుడు ప్రకటనలు జారీ చేశారని, ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించారని ఆ అభియోగపత్రంలో ఉంది.

Also Read: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం

సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం బిలియన్ల కొద్దీ నిధులు సమకూర్చిన US బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి అదానీ గ్రూప్ ఈ సమాచారాన్ని దాచిపెట్టిందని US ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఎనర్జీ కాంట్రాక్టులను దక్కించుకోవడం ద్వారా $2 బిలియన్ల లాభాలను ఆర్జించాలని ఈ గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

2023లో USకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) విడుదల చేసిన రిపోర్ట్‌లోనూ లంచం ఆరోపణలు ఉన్నాయి. అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చాలా గట్టి ఆరోపణలు చేసింది. ఆ రిపోర్ట్‌ బయటకు వచ్చాక, అదానీ గ్రూప్ మార్కెట్‌ విలువ సుమారు $150 బిలియన్లు తగ్గింది.

ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్‌లోని అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ సహా కీలక కంపెనీల షేర్లు అతి భారీగా 20 శాతం వరకు నష్టపోయాయి.

మరో ఆసక్తికర కథనం:  అమెరికా కేసు ఎఫెక్ట్‌- అదానీ గ్రూప్ షేర్లు క్రాష్ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget