అన్వేషించండి

Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ

Adani Group News: సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు పొందేందుకు $250 మిలియన్ల లంచం ఇవ్వజూపిన కేసులో గౌతమ్ అదానీ సహా ఏడుగురు అధికారుల పాత్రపై US కోర్టులో అభియోగాలు దాఖలయ్యాయి.

Adani Group Cancels 600 Million Dollars Bond Offering: భారతదేశంలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు పొందేందుకు $250 మిలియన్ల లంచం ఇవ్వజూపడం, తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణ ప్రయత్నాలు వంటి ఆరోపణలతో ఈ రోజు (గురువారం, 21 నవంబర్‌ 2024) అదానీ గ్రూప్‌ షేర్లు విలవిల్లాడాయి. గ్రూప్‌ స్టాక్స్‌ 10 శాతం నుంచి 20 శాతం వరకు పతనమయ్యాయి. అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ సహా ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌లు $250 మిలియన్ల లంచం పథకాన్ని రూపొందించారని యుఎస్ ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలతో గ్రూప్‌ షేర్లలో ఈ పతనం కొనసాగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో, తమ $600 మిలియన్ల బాండ్ ఆఫర్‌ను రద్దు చేసినట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ (Adani Green Energy Ltd) ప్రకటించింది.

యుఎస్ ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, అదానీ గ్రీన్ ఎనర్జీ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. "మా బోర్డు సభ్యులైన గౌతమ్ అదానీ మరియు సాగర్ అదానీకి వ్యతిరేకంగా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వరుసగా యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో క్రిమినల్ నేరారోపణలు చేశాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మా బోర్డు సభ్యుడు వినీత్ జైన్‌ను కూడా ఆ నేరారోపణలో చేర్చింది. ఈ పరిణామాల దృష్ట్యా, మా అనుబంధ సంస్థలు ప్రతిపాదిత డాలర్‌-డినామినేటెడ్ బాండ్ ఆఫర్‌లను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాయి".

రూ.2,100 కోట్ల లంచం ఆరోపణలు
బ్రూక్లిన్ కోర్టులో దాఖలు చేసిన అభియోగాల ప్రకారం, భారతదేశంలో సౌరశక్తి కాంట్రాక్టులను పొందేందుకు 250 మిలియన్ డాలర్ల (రూ. 2,100 కోట్లు) లంచం ఇవ్వజూపిన పథకంలో సూత్రధారిగా గౌతమ్ అదానీ, సాగర్ ఆర్ అదానీ, వినీత్ ఎస్ జైన్‌తో పాటు మరో నలుగురు (మొత్తం ఏడుగురు) అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నిందితులు US పెట్టుబడిదారులకు తప్పుడు ప్రకటనలు జారీ చేశారని, ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించారని ఆ అభియోగపత్రంలో ఉంది.

Also Read: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం

సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం బిలియన్ల కొద్దీ నిధులు సమకూర్చిన US బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి అదానీ గ్రూప్ ఈ సమాచారాన్ని దాచిపెట్టిందని US ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఎనర్జీ కాంట్రాక్టులను దక్కించుకోవడం ద్వారా $2 బిలియన్ల లాభాలను ఆర్జించాలని ఈ గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

2023లో USకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) విడుదల చేసిన రిపోర్ట్‌లోనూ లంచం ఆరోపణలు ఉన్నాయి. అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చాలా గట్టి ఆరోపణలు చేసింది. ఆ రిపోర్ట్‌ బయటకు వచ్చాక, అదానీ గ్రూప్ మార్కెట్‌ విలువ సుమారు $150 బిలియన్లు తగ్గింది.

ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్‌లోని అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ సహా కీలక కంపెనీల షేర్లు అతి భారీగా 20 శాతం వరకు నష్టపోయాయి.

మరో ఆసక్తికర కథనం:  అమెరికా కేసు ఎఫెక్ట్‌- అదానీ గ్రూప్ షేర్లు క్రాష్ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
India Thrilling Victory: తిలక్ వర్మ తడాఖా..సూపర్బ్ ఫిఫ్టీతో తెలుగు ప్లేయర్ సత్తా.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ.. 
తిలక్ వర్మ తాండవం..సూపర్బ్ ఫిఫ్టీతో తెలుగు ప్లేయర్ సత్తా.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ
Padma Award 2025: 2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
Padma Awards: ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna Padma Bhushan | నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ | ABP DesamRing Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP DesamKCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP DesamSS Rajamouli Post on Mahesh Babu | ఒక్క పోస్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
India Thrilling Victory: తిలక్ వర్మ తడాఖా..సూపర్బ్ ఫిఫ్టీతో తెలుగు ప్లేయర్ సత్తా.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ.. 
తిలక్ వర్మ తాండవం..సూపర్బ్ ఫిఫ్టీతో తెలుగు ప్లేయర్ సత్తా.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ
Padma Award 2025: 2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
Padma Awards: ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
Ind Vs Eng 2nd T20 Updates: సమష్టిగా రాణించిన బౌలర్లు, సత్తా చాటిన అక్షర్, వరుణ్.. బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్
సమష్టిగా రాణించిన బౌలర్లు, సత్తా చాటిన అక్షర్, వరుణ్.. బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కేమీ తెలియదు - ఆయన పొలిటికల్ జోకర్ - డిప్యూటీ సీఎంను ఇంత మాట అనేశాడేంటి ?
పవన్ కల్యాణ్‌కేమీ తెలియదు - ఆయన పొలిటికల్ జోకర్ - డిప్యూటీ సీఎంను ఇంత మాట అనేశాడేంటి ?
Karimnagar News: మోదీ ఫొటో, పేరు లేకుంటే బియ్యం, ఇళ్లు ఎందుకివ్వాలి? కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
మోదీ ఫొటో, పేరు లేకుంటే బియ్యం, ఇళ్లు ఎందుకివ్వాలి? కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan on Amazon: ఏడాది తర్వాత గిఫ్ట్ కార్డుల ఎక్స్‌పైర్ - అమెజాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి
ఏడాది తర్వాత గిఫ్ట్ కార్డుల ఎక్స్‌పైర్ - అమెజాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి
Embed widget