అన్వేషించండి

5G Plans Price: యూజర్లకు అలర్ట్‌! అతి త్వరలో టెలికాం టారిఫ్‌ల పెంపు!!

5G Plans Price: మొబైల్‌ యూజర్లకు అలర్ట్‌! అతి త్వరలోనే టారిఫ్‌లు పెరిగే అవకాశం ఉందని టెలికాం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

5G Plans Price: మొబైల్‌ యూజర్లకు అలర్ట్‌! అతి త్వరలోనే టారిఫ్‌లు పెరిగే అవకాశం ఉందని టెలికాం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూ.1.5 లక్షల విలువైన 5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలు పూర్తవ్వడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

'5జీ స్పెక్ట్రమ్‌ను దక్కించుకొనేందుకు టెలికాం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. అందుకే 5జీ సేవలకు ఎక్కువ ధర వసూలు చేస్తాయి. కొత్త తరం 5జీకి కస్టమర్లను ఎక్కువ ఆకర్షితులను చేసేందుకు 4జీ టారిఫ్‌లనూ పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే 2019 డిసెంబర్‌, 2021 నవంబర్‌లో టెలికాం కంపెనీలు రెండు సార్లు భారీగా టారిఫ్‌లను పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక ఏడాది రెండో అర్ధభాగంలో 4జీ టారిఫ్‌లను పెంచుతారని అంచనా' అని క్రిసిల్‌ రేటింగ్స్ సీనియర్‌ డైరెక్టర్‌ మనీశ్‌ గుప్తా అన్నారు.

టెలికాం కంపెనీలు 51,236 MHz స్పెక్ట్రమ్‌ను రూ.1.5 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌ జియో రూ.88,078 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకున్నాయి.

సర్వీస్‌ ప్రొవైడర్లు మొత్తం సబ్‌స్క్రైబర్లపై టారిఫ్‌ను కనీసం 4 శాతం పెంచుతాయని నొమురా గ్లోబల్‌ మార్కెట్స్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. అంటే రోజుకు 1.5జీబీ కన్నా ఎక్కువ డేటా ఉండే 4జీ ప్లాన్లపై పెంపు తప్పదని పేర్కొంది. 2021లో స్పెక్ట్రమ్‌ కొనుగోలుపై ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ యూసేజీ ఛార్జీలను రద్దు చేసింది. దీనివల్ల కంపెనీలు వార్షికంగా రూ.7,500 కోట్ల మేర ఆదా చేసుకున్నాయని నొమురా వెల్లడించింది.

'చారిత్రకంగా చూస్తే భారత టెలికాం కంపెనీలు 4జీ ప్లాన్లపై ప్రీమియం వసూలు చేయడం ఆపేశాయి. 2జీ/3జీ కన్నా ఎక్కువ డేటా వేగం అందిస్తున్నా ప్రీమియం తీసుకోలేదు. అయితే 4జీతో పోలిస్తే 5జీకి టెలికాం కంపెనీలు ఎక్కువ ప్రీమియం వసూలు చేసే అవకాశం ఉంది. అందుకే వీటిపై సమీప భవిష్యత్తులో పర్యవేక్షణ ఉండనుంది. ఏఆర్‌పీయూ తర్వాతి ఏడాది నుంచి ప్రీమియం వసూలు చేయొచ్చు' అని నొమురా తెలిపింది.

'5జీ స్పెక్ట్రమ్‌ వేలం విజయవంతంగా ముగిసింది. రూ.1,50,173 కోట్లు ప్రభుత్వానికి సమకూరాయి. 72,098 MHz స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి పెట్టాం. అందులో 51,236 MHz అమ్ముడైంది' అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోమవారం అన్నారు.

రిలయన్స్‌ జియో 24,740 MHz స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసి అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచింది. 19,867 MHzతో భారతీ ఎయిర్‌టెల్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. వొడాఫోన్ ఐడియా 2668 MHz స్పెక్ట్రమ్‌ను దక్కించుకోగా అదానీ డేటా నెట్‌వర్క్‌ 26 GHz బ్యాండులో 400 MHz 5 జీ వాయు తరంగాలను దక్కించుకున్నాయి.

రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 GHz రేడియో తరంగాలను బిడ్డింగ్‌ వేశారు. స్వల్ప (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మధ్య (3300 MHz), అధిక (26 GHz) తరంగ బ్యాండ్లకు వేలం నిర్వహించారు.

టాప్ హెడ్ లైన్స్

Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Embed widget