అన్వేషించండి

5G Plans Price: యూజర్లకు అలర్ట్‌! అతి త్వరలో టెలికాం టారిఫ్‌ల పెంపు!!

5G Plans Price: మొబైల్‌ యూజర్లకు అలర్ట్‌! అతి త్వరలోనే టారిఫ్‌లు పెరిగే అవకాశం ఉందని టెలికాం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

5G Plans Price: మొబైల్‌ యూజర్లకు అలర్ట్‌! అతి త్వరలోనే టారిఫ్‌లు పెరిగే అవకాశం ఉందని టెలికాం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూ.1.5 లక్షల విలువైన 5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలు పూర్తవ్వడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

'5జీ స్పెక్ట్రమ్‌ను దక్కించుకొనేందుకు టెలికాం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. అందుకే 5జీ సేవలకు ఎక్కువ ధర వసూలు చేస్తాయి. కొత్త తరం 5జీకి కస్టమర్లను ఎక్కువ ఆకర్షితులను చేసేందుకు 4జీ టారిఫ్‌లనూ పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే 2019 డిసెంబర్‌, 2021 నవంబర్‌లో టెలికాం కంపెనీలు రెండు సార్లు భారీగా టారిఫ్‌లను పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక ఏడాది రెండో అర్ధభాగంలో 4జీ టారిఫ్‌లను పెంచుతారని అంచనా' అని క్రిసిల్‌ రేటింగ్స్ సీనియర్‌ డైరెక్టర్‌ మనీశ్‌ గుప్తా అన్నారు.

టెలికాం కంపెనీలు 51,236 MHz స్పెక్ట్రమ్‌ను రూ.1.5 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌ జియో రూ.88,078 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకున్నాయి.

సర్వీస్‌ ప్రొవైడర్లు మొత్తం సబ్‌స్క్రైబర్లపై టారిఫ్‌ను కనీసం 4 శాతం పెంచుతాయని నొమురా గ్లోబల్‌ మార్కెట్స్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. అంటే రోజుకు 1.5జీబీ కన్నా ఎక్కువ డేటా ఉండే 4జీ ప్లాన్లపై పెంపు తప్పదని పేర్కొంది. 2021లో స్పెక్ట్రమ్‌ కొనుగోలుపై ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ యూసేజీ ఛార్జీలను రద్దు చేసింది. దీనివల్ల కంపెనీలు వార్షికంగా రూ.7,500 కోట్ల మేర ఆదా చేసుకున్నాయని నొమురా వెల్లడించింది.

'చారిత్రకంగా చూస్తే భారత టెలికాం కంపెనీలు 4జీ ప్లాన్లపై ప్రీమియం వసూలు చేయడం ఆపేశాయి. 2జీ/3జీ కన్నా ఎక్కువ డేటా వేగం అందిస్తున్నా ప్రీమియం తీసుకోలేదు. అయితే 4జీతో పోలిస్తే 5జీకి టెలికాం కంపెనీలు ఎక్కువ ప్రీమియం వసూలు చేసే అవకాశం ఉంది. అందుకే వీటిపై సమీప భవిష్యత్తులో పర్యవేక్షణ ఉండనుంది. ఏఆర్‌పీయూ తర్వాతి ఏడాది నుంచి ప్రీమియం వసూలు చేయొచ్చు' అని నొమురా తెలిపింది.

'5జీ స్పెక్ట్రమ్‌ వేలం విజయవంతంగా ముగిసింది. రూ.1,50,173 కోట్లు ప్రభుత్వానికి సమకూరాయి. 72,098 MHz స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి పెట్టాం. అందులో 51,236 MHz అమ్ముడైంది' అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోమవారం అన్నారు.

రిలయన్స్‌ జియో 24,740 MHz స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసి అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచింది. 19,867 MHzతో భారతీ ఎయిర్‌టెల్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. వొడాఫోన్ ఐడియా 2668 MHz స్పెక్ట్రమ్‌ను దక్కించుకోగా అదానీ డేటా నెట్‌వర్క్‌ 26 GHz బ్యాండులో 400 MHz 5 జీ వాయు తరంగాలను దక్కించుకున్నాయి.

రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 GHz రేడియో తరంగాలను బిడ్డింగ్‌ వేశారు. స్వల్ప (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మధ్య (3300 MHz), అధిక (26 GHz) తరంగ బ్యాండ్లకు వేలం నిర్వహించారు.

టాప్ హెడ్ లైన్స్

Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
LIC Unclaimed Funds: ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget