అన్వేషించండి

YS Jagan: అనకాపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన - సెజ్ ప్రమాద బాధితులకు పరామర్శ

Andhrapradesh News: అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాద బాధితులను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

YS Jagan Anakapalli Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) శుక్రవారం అనకాపల్లిలో పర్యటించారు. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి.. అనకాపల్లిలోని (Anakapalli) ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులను ఆయన పరామర్శించారు. ఆస్పత్రిలో వారికి అందుతున్న వైద్య సేవలపై జగన్ ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.25 లక్షల చొప్పున అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. 

'ప్రభుత్వ నిర్లక్ష్యం'

అచ్యుతాపురం ఘటన బాధాకరమని.. ప్రమాదం జరిగింది పట్టపగలైనా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ అన్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర వివరాలు లేవన్నారని.. ఎంతమంది చనిపోయారో తెలియదని చెప్పారని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా రాని పరిస్థితి నెలకొందని.. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారని అన్నారు. తమ ప్రభుత్వ హయంలో ఎల్జీ పాలీమర్స్ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించామని 24 గంటల్లోపే పరిహారం అందించామని గుర్తు చేశారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరగాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు సకాలంలో పరిహారం ఇవ్వకుంటే తానే వచ్చి స్వయంగా ధర్నా చేస్తానని.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. పరిశ్రమలపై పర్యవేక్షణ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని అన్నారు.

మరో ప్రమాదం

మరోవైపు, అచ్యుతాపురం ప్రమాద ఘటన మరువక ముందే అనకాపల్లి జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్ సంస్థలో గురువారం రాత్రి రసాయనాలు కలుపుతుండగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు వెంటనే క్షతగాత్రులను విశాఖలోని ఇండస్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ బి - బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. 6 కిలో లీటర్ల రియాక్టర్‌లో కెమికల్ నింపి ఛార్జింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మ్యాన్ హోల్ నుంచి రసాయనం ఉప్పొంగి పై కప్పునకు తగిలి కార్మికులపై పడింది. 

ఈ ప్రమాదంలో ఝార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్, కోహర్, రోస, విజయనగరానికి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణకు గాయాలయ్యాయి. బాధితులను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వెంటనే అక్కడకు వెళ్లాలని హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో హోంమంత్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు.

Also Read: Anakapalli News: పరవాడ ఫార్మా సెజ్‌లో ప్రమాదం- నలుగురికి తీవ్ర గాయాలు- ఒకరి పరిస్థితి విషమం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP Foundation Day: ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Foundation Day: ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Kriti Sanon : నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
MI vs KKR ముఖాముఖీ పోరులో పైచేయి ఎవరిది? వాంఖడేలో మ్యాచ్ అయినా ముంబైలో టెన్షన్
MI vs KKR ముఖాముఖీ పోరులో పైచేయి ఎవరిది? వాంఖడేలో మ్యాచ్ అయినా ముంబైలో టెన్షన్
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Dhurandhar 2 Collections : బాహుబలి 2ని దాటేసిన ధురంధర్ 2 - ఆ రికార్డు పదిలం... 10 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
బాహుబలి 2ని దాటేసిన ధురంధర్ 2 - ఆ రికార్డు పదిలం... 10 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget