అన్వేషించండి

Jagan Odarpu Yatra 2.0: మాజీ సీఎం జగన్ ఓదార్పు యాత్ర 2.0 - రాజకీయ దాడుల్లో గాయపడిన కార్యకర్తలకు పరామర్శ

Ysrcp News: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ దాడుల్లో గాయపడ్డ వారితో పాటు, ఓటమి వేదనతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్నారు.

YS Jagan Odarpu Yatra: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) మళ్లీ ఓదార్పు యాత్ర (Odarpu Yatra 2.0) చేపట్టనున్నారు. గురువారం తాడేపల్లిలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ దాడుల్లో గాయపడ్డవారిని ఆయన పరామర్శించనున్నారు. ఈ సమావేశంలో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే, వైసీపీ ఓటమితో కుంగిపోయి మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది డిసెంబర్ నుంచి లేదా వచ్చే ఏడాది జనవరి నుంచి ఆయన ఓదార్పు యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

'మళ్లీ అధికారంలోకి వస్తాం'

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకూ మనం చేసిన మంచిని ప్రజలు మరిచిపోరని వైఎస్ జగన్ పార్టీ నేతలతో అన్నారు. 'ఇదే ప్రజలు 2029 నాటికి చంద్రబాబు మోసాలు, ప్రలోభాలు గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటారు. ఈసారి ఎన్నికల్లో 40 శాతం ఓట్లు షేర్ అంటే 2019తో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు తగ్గాయి. ఈ 10 శాతం ప్రజలు కూడా చంద్రబాబు మోసాలు, ప్రలోభాలను గుర్తిస్తారు. ప్రతీ కుటుంబానికి మనం చేసిన మంచి ఏంటో ప్రజలకు తెలుసు. విశ్వసనీయతకు మనం చిరునామా. మనం చేసిన మంచే మనకు శ్రీరామరక్ష. ఈ రోజుకీ జగన్ అబద్దాలు చెప్పడు. మోసాలు చేయడు అని ప్రజలకు తెలుసు. ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో వైసీపీకి, జగన్‌కు ఎవ్వరూ సాటిరారు. ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజల తరఫున పోరాటాలు చేస్తాం. ఏకంగా స్పీకర్ పదవి తీసుకోబోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇలాంటి కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది.' అని జగన్ పేర్కొన్నారు.

'కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి'

ఎన్నికల్లో ఓడిపోయామన్న భావనను మనసులోంచి తీసేయాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. 'న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదు. ప్రతీ ఇంట్లోనూ మనం చేసిన మంచి ఉంది. మళ్లీ రికార్డు మెజార్టీతో గెలుస్తాం. మన కార్యకర్తలకు మనం తోడుగా ఉండాలి. ఎప్పుడూ చూడని విధంగా మన కార్యకర్తలపై, పార్టీ సానుభూతిపరులపై దాడులు చేస్తున్నారు. కొన్నిచోట్ల అవమానాలు, ఆస్తుల నష్టం కలిగిస్తున్నారు. వీళ్లందరికీ భరోసా ఇవ్వాలి. రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను కలుసుకుంటాను. పార్టీ జెండాలు మోసి కష్టాలు పడ్డ వారికి తోడుగా ఉంటాను. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ స్థానిక నేతలు అంతా అందరికీ భరోసా ఇవ్వాలి. మనలో నిరాశకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకూడదు. ప్రతి అభిమాని, కార్యకర్తకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనది.' అని జగన్ పిలుపునిచ్చారు.

'శకుని పాచికలా మాదిరిగా'

'మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసినా ఎన్నికల ఫలితాలు ఇలా రావడం ఆశ్చర్యం కలిగించింది. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకువచ్చింది. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కానీ ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడలేం. ఇప్పుడు కేవలం ఇంటర్వెల్ మాత్రమే. శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులు ఓడిపోతారు. ధర్మం, విశ్వసనీయత, నిజాయతీ తప్పకుండా గెలుస్తాయి. ప్రతి ఒక్కరూ ఒక అర్జునుని మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారు.' అని జగన్ పేర్కొన్నారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget