అన్వేషించండి

YSRCP Common Capital Hyderabad : ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలి - వైసీపీ కొత్త డిమాండ్ !

Common Capital Hyderabad : ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఈ డిమాండ్ చేయగా మంత్రి పెద్దిరెడ్డి సమర్థించారు.

YCP leaders are demanding to continue Hyderabad as joint capital :  ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం  ఎన్నికలకు ముందు కొత్త మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు ఈ గడువు ఈ ఏడాది జూన్ తో ముగిసిపోతుంది. అయితే ఆ తర్వాత కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని డిమాండ్ చేయడానికి వైఎస్ఆర్‌సీపీ రెడీ అయింది. ఆ  పార్టీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్..  రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వైవీ సుబ్బారెడ్డి ఈ డిమాండ్ వినిపించారు. 

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలన్న వైవీై సుబ్బారెడ్డి 

వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామన్నాని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.   ఆంధ్రప్రదేశ్ లో ఇంకా రాజధాని నిర్మాణం పూర్తికాలేదన్నారు. పైగా ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని.. వాస్తవ పరిస్థితుల్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు. ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. జూన్‎తో రాజధాని గడువు ముగియనుండటంతో మరికొన్ని రోజులు పొడగించాలని కోరుతామన్నారు. వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని. ..పార్టీ విధానం ప్రకారమే మాట్లాడినట్లుగా ఆయన మాటల్ని బట్టి అర్థం చేసకోవచ్చు.  

ఉమ్మడి రాజధానిగా ఉంటే మంచిదేనన్న మంత్రి పెద్దిరెడ్డి 

ఇదే అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అనంతపురంలో స్పందించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగిస్తే మంచిదేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీలో నిర్ణయాలు తీసుకునే అత్యంత ముఖ్యమైన నేతల్లో ఇద్దరు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింపు ప్రస్తావన తీసుకు రావడం ఆసక్తికరంగా మారింది. 

పేరుకే ఉమ్మడి  రాజధాని - ఏపీ వ్యవహారాలు నిల్ !

నిజానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతిని చాలా మంది మర్చిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఏపీ ప్రభుత్వానికి సెక్రటేరియట్ లో ఉన్న భవనాలను తెలంగాణ సర్కార్ కు అప్పగించారు. దానికి ప్రతిఫలంగా ఎలాంటి భవనాలుతీసుకోలేదు.  లేక్ వ్యూ గెస్ట్ హౌస్  మాత్రమే ప్రస్తుతం ఏపీ అధీనంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏ ఒక్క కార్యాలయం కూడా తెలంగాణ నుంచి నడవడం లేదు. చివరికి ఉమ్మడి రాజధాని అయినప్పటికీ కరోనా సమయంలో  పేషంట్లు ఏపీ నుంచి హైదరాబాద్ వస్తూంటే..తెలంగాణ పోలీసులు ఆపారు. అప్పుడు కూడా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు.  వివిధ అంశాల్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తు చేయాల్సి వచ్చినప్పుడల్లా సీఎం జగన్ సర్కార్ మౌనంగానే ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి. 

ఉమ్మడి రాజధాని పేరుతో కొత్త రాజకీయం ?

విభజన చట్టం ప్రకారం పదేళ్లే ఉమ్మడి రాజధాని.. ఆ తర్వాత ఆ పేరు కూడా ఉండదు. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటే.. విభజన చట్టంలో మార్పులు చేయాలి. అది సాధ్యం కాదు. ఇంకా విషయం ఏమిటంటే.. తెలంగాణ పార్టీలు.. పాలకులు అసలు అంగీకరించరు. ఉమ్మడి రాజధాని అయినా కాకపోయినా  ప్రజల అవకాశాల్లో ఏ మాత్రం తేడా లేదని.. ఇప్పుడు మళ్లీ ఆ పేరుతో చిచ్చు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో వ్యతిరేక ప్రచారం చేసుకోవడం తప్ప ప్రయోజనం ఉండదన్న అంచనాలు ఉన్నాయి. అయితే రాజకీయ పార్టీలు తమకు ఏది మేలో అదే రాజకీయం చేస్తాయి. ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తోందని అనుకోవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Pawan Kalyan Producers Meeting: పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
Breaking News: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget