అన్వేషించండి

ప్రధాని కావాలన్న ఆశతో ప్రజల్ని కేసీఆర్ వంచిస్తున్నారు: విష్ణు వర్దన్ రెడ్డి

Vishnu Vardhan Reddy: కేసీఆర్ పై బీజేపీ ఏపీ జనరల్ సెక్రటరీ విష్ణు వర్ధన్ రెడ్డి కేసీఆర్ పై విమర్శలు చేశారు. ప్రధాన మంత్రి కావాలన్న ఆశలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని ఆక్షేపించారు. 

Vishnu Vardhan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రెటరీ విష్ణు వర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి కావాలన్న కోరికతో ప్రజలు వంచిస్తున్నారని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఏపీని కరెంటు సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టులపై నిందలు వేస్తూ, తెలంగాణపై తనకున్న శ్రద్ధను చూపారన్నారు. ఇప్పుడు తన జాతీయ ప్రయోజనాల కోసం ఏపీపై చేస్తున్న పోరాటాన్ని విరమించుకుంటారా అని విష్ణు వర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. 

అప్పట్లో కేసీఆర్ ఏమన్నారంటే..

ఏపీ నుంచి తెలంగాణకు రూ.17,828 బకాయిలు:కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో రూ. 17,828 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఈ మధ్య కేసీఆర్ తెలిపారు. తాను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఏపీకి రూ. 6 వేల కోట్లు చెల్లించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని.. కానీ ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పందించడం లేదని అన్నారు. ఏపీకి తెలంగాణ రూ. 3 వేల కోట్లు అసలు 18 శాతం వడ్డీని కలిపి రూ. 6 వేల కోట్లను నెల రోజుల్లో చెల్లించాలని కేంద్రం ఆదేశించిందని కేసీఆర్ తెలిపారు. తమకు రావాల్సిన బకాయిల నుంచి రూ. 6 వేల కోట్లు తీసుకుని మిగిలిన డబ్బులను తమకు ఏపీ నుంచి ఇప్పించాలని కేసీఆర్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ పట్నం ప్రాజెక్టులో తెలంగాణకు వాటా ఉందని కేసీఆర్ తెలిపారు. 

బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని కేసీఆర్ లిఖించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ్యులు అందరూ ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించారు. 

కర్నాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్‌ నేత హెడీ కుమారస్వామి, ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్‌తో పాటు ఎంపీలు భేటీకి హాజరు అయ్యారు. ప్రస్తుతం జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో సభ్యులకు కేసీఆర్‌ వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానానికి ఆమోదం తెలుపుతూ 283 మంది సభ్యులు ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత సంతకాలు చేశారు.  

ప్రధాని కావాలన్న ఆశతోనే జాతీయ రాజకీయాల్లోకి!

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన సందర్భంగా బీజేపీ ఏపీ జనరల్ సెక్రటరీ విష్ణు వర్ధన్ రెడ్డి కేసీఆర్ పై విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను వదిలి ప్రధాన మంత్రి కావాలన్న ఆశలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని ఆక్షేపించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Embed widget