అన్వేషించండి

Vizag Beach Cleaning: విశాఖలో ‘మెగా బీచ్ క్లీనింగ్’, చెత్త ఎత్తిన మంత్రులు - పాల్గొన్న 20 వేల మంది

అమెరికాకు చెందిన పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థ ఈ కార్యక్రమం చేపట్టింది. గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేలా శుక్రవారం బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.

సముద్ర తీరం ప్రాంతంలోని చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి స్వచ్ఛత నెలకొల్పే లక్ష్యంగా విశాఖపట్నంలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టారు. అమెరికాకు చెందిన పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థ ఈ కార్యక్రమం చేపట్టింది. గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేలా శుక్రవారం బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, గుడివాడ అమర్నాథ్‌, నగర మేయర్ గొలగిని వెంకట హరి కుమారి, కలెక్టర్, పోలీస్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. వీరు కూడా చెత్త సేకరించి బీచ్ ను శుభ్రం చేసే పనిలో భాగం అయ్యారు.

ఇందుకోసం శుక్రవారం (ఆగస్టు 26) ఉదయం ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి బీచ్ వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా విశాఖ తీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని ఎత్తేు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మెగా ఈవెంట్ లో దాదాపు 20 వేల మందికి పైగా వలంటీర్లు పాల్గొన్నారు. బీచ్ రోడ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎత్తేసేందుకు అక్కడే రూపొందించిన ఇసుక శిల్పం పర్యటకులను ఆకట్టుకుంటుంది. 

కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టడం ద్వారా విశాఖ నగరాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ప్లాస్టిక్ నిషేధించడం ద్వారా పర్యావరణం కాపాడుకోవచ్చని అన్నారు. పర్యావరణం బాగుంటేనే ప్రపంచం బాగుంటుందని, ప్లాస్టిక్ నిషేధం వల్ల సముద్ర జీవరాశులకు మేలు కలుగుతుందని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కావడం సంతోషకరమని అన్నారు.

రీసైక్లింగ్ ద్వారా ఆదాయం
ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. అందుకే అమెరికాకు చెందిన పార్లె సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా భారత నేవీ హెలికాప్టర్ల ద్వారా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్

ఏపీలో ప్లాసిక్‌ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టాలంటే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూడదని, కాస్త రేటు ఎక్కువైనా గుడ్డతో తయారుచేసినవే పెట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. నేడు విశాఖపట్నంలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపై సీఎం మాట్లాడుతూ.. నేడు ఒక్కరోజే ఉదయం 6 నుంచి 8 వరకూ 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తొలగించారని సీఎం జగన్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి అనేవి నాణేనికి రెండు వైపులు అని జగన్ అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదని జగన్ అన్నారు. ఈ సందర్భంగా సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్‌ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం జగన్‌ సమక్షంలో పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ఈ ఎంవోయూ కుదిరింది.

భూమిపై 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Children Assembly: నవంబర్ 26న బాలల అసెంబ్లీ - అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ - అసెంబ్లీలో కీలక బిల్లులు
నవంబర్ 26న బాలల అసెంబ్లీ - అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ - అసెంబ్లీలో కీలక బిల్లులు
TSRTC Gifts: ఆర్టీసీ బస్‌లో ఊరెళ్లండి బహుమతులు గెలుచుకోండి- తెలంగాణ ఆర్టీసీ దసరా ఆఫర్‌ 
ఆర్టీసీ బస్‌లో ఊరెళ్లండి బహుమతులు గెలుచుకోండి- తెలంగాణ ఆర్టీసీ దసరా ఆఫర్‌ 
Konaseema News: కోనసీమ వైసీపీలో పదవుల పంపకంపై అసంతృప్తి సెగలు- పార్టీలో అసమ్మతికి కారణమిదేనా?
కోనసీమ వైసీపీలో పదవుల పంపకంపై అసంతృప్తి సెగలు- పార్టీలో అసమ్మతికి కారణమిదేనా?
Divorce: తల్లిని, సోదరిని వదిలేయాలని భార్య హింస-  క్రూరత్వమేనని విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
తల్లిని, సోదరిని వదిలేయాలని భార్య హింస- క్రూరత్వమేనని విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
Advertisement

వీడియోలు

India vs Pakistan First Time in Asia Cup Final | ఆసియాకప్ లో మొదటిసారి ఫైనల్ లో ఆడబోతున్న ఇండియా పాక్
Pakistan Captain Warning to India Asia Cup 2025 Final | ఫైనల్ లో తలపడబోతున్న ఇండియా పాక్
Bangladesh vs Pakistan Preview Asia Cup 2025 | ఫైనల్ కు చేరిన పాకిస్తాన్
Chiranjeevi Counter to Balakrishna | అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ | ABP Desam
Bathukammakunta Encroachments | ఇప్పటికీ కబ్జా కోరల్లోనే బతుకమ్మకుంట చెరువు..కోర్టులో పరిధిలో వివాదం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Children Assembly: నవంబర్ 26న బాలల అసెంబ్లీ - అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ - అసెంబ్లీలో కీలక బిల్లులు
నవంబర్ 26న బాలల అసెంబ్లీ - అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ - అసెంబ్లీలో కీలక బిల్లులు
TSRTC Gifts: ఆర్టీసీ బస్‌లో ఊరెళ్లండి బహుమతులు గెలుచుకోండి- తెలంగాణ ఆర్టీసీ దసరా ఆఫర్‌ 
ఆర్టీసీ బస్‌లో ఊరెళ్లండి బహుమతులు గెలుచుకోండి- తెలంగాణ ఆర్టీసీ దసరా ఆఫర్‌ 
Konaseema News: కోనసీమ వైసీపీలో పదవుల పంపకంపై అసంతృప్తి సెగలు- పార్టీలో అసమ్మతికి కారణమిదేనా?
కోనసీమ వైసీపీలో పదవుల పంపకంపై అసంతృప్తి సెగలు- పార్టీలో అసమ్మతికి కారణమిదేనా?
Divorce: తల్లిని, సోదరిని వదిలేయాలని భార్య హింస-  క్రూరత్వమేనని విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
తల్లిని, సోదరిని వదిలేయాలని భార్య హింస- క్రూరత్వమేనని విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
Cash for Vote Case: ఓటుకు నోటు కేసులో బిగ్‌ ట్విస్ట్‌- మత్తయ్య తప్పించడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు 
ఓటుకు నోటు కేసులో బిగ్‌ ట్విస్ట్‌- మత్తయ్య తప్పించడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు 
Amaravathi : అమరావతిలో మొట్టమొదటి శాశ్వత బిల్డింగ్ రెడీ!ఓపెనింగ్ ఎప్పుడంటే?
అమరావతిలో మొట్టమొదటి శాశ్వత బిల్డింగ్ రెడీ!ఓపెనింగ్ ఎప్పుడంటే?
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బరిలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య- సునీత పేరు ఖరారు చేసిన కేసీఆర్
జూబ్లీహిల్స్ బరిలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య- సునీత పేరు ఖరారు చేసిన కేసీఆర్
Andhra University : ఆంధ్ర యూనివర్శిటీలో బీఎడ్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ మృతి - భగ్గుమన్న విద్యార్థులు- అసెంబ్లీలో స్పందించిన లోకేష్‌
ఆంధ్ర యూనివర్శిటీలో బీఎడ్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ మృతి - భగ్గుమన్న విద్యార్థులు- అసెంబ్లీలో స్పందించిన లోకేష్‌
Embed widget