అన్వేషించండి

Gudivada Amarnath: జమిలి ఎన్నికలతో వైసీపీకి నష్టం లేదు, తుది నిర్ణయం జగన్ దే: మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath on Jamili Elections: జమిలి ఎన్నికలతో ఏపీకి పెద్దగా నష్టమేం లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నికలకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామన్నారు.

Gudivada Amarnath on Jamili Elections

దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల (One Nation One Election) పై చర్చ జరుగుతోంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలతో ఏపీకి పెద్దగా నష్టమేం లేదన్నారు. ఎన్నికలకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామన్నారు. పార్టీ తుది నిర్ణయం సీఎం జగన్ మోహన్ రెడ్డిదేనని స్పష్టం చేశారు.  

పార్టీ ఆదేశాల మేరకు ఎండాడలో వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం ప్రారంభించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ కార్యక్రమంలో కోలా గురువులు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంశీ, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, పసుపులేటి బాలరాజు, కేకే రాజు, ఎంపీ ఎంవీవీ, మేయర్ హరి వెంకట కుమారి పాల్గొన్నారు. 26 జిల్లాల్లో 26 పార్టీ కార్యాలయాలు నిర్మించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విశాఖ జిల్లాలో మొదట కార్యాలయాన్ని ప్రారంభించాం అన్నారు. త్వరలో మిగతా పనులు పూర్తి చేస్తామన్నారు. ఇకనుంచి జిల్లాకు సంబంధించి కార్యక్రమాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తామని తెలిపారు.

అవసరాన్ని బట్టి ఈ వైఎస్సార్సీపీ  కార్యాలయాన్ని సెంట్రల్ పార్టీ కార్యాలయంగా ఉపయోగించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఆరు, ఏడు నెలల్లో ఎన్నికలు రానున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా జమిలి ఎన్నికలు వచ్చినా వైసీపీకి ఏ అభ్యంతరం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడంతో తమకు ఏ నష్టం లేదన్నారు. అయితే జమిలి ఎన్నికలపై పార్టీలో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. జమిలితో రాష్ట్రంలో కేవలం మూడు నెలలు ముందుకు ఎన్నికలు వస్తాయని, అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించేది వైసీపీయేనని దీమా వ్యక్తం చేశారు.

ప్రజలు మరోసారి సీఎం జగన్ కు అధికారం ఇస్తారని ఆకాంక్షించారు. 2019లో వచ్చిన ఫలితాలు 2024 ఎన్నికల్లోనూ రిపీట్ చేస్తామన్నారు. గడప గడపకు ప్రభుత్వంతో ప్రజల్లోకి వెళ్తున్నామని, ప్రజలకు తాము చేసిన మేలు గురించి, ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తున్నాం. వారి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి వైసీపీ కార్యకర్త తమ పార్టీ విజయానికి కృషి చేయాలని, సీఎం జగన్ ను మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని పిలుపునిచ్చారు.

జమిలీ దిశగా కేంద్రం కసరత్తులు..
జమిలీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలీపై ఓ ప్యానెల్‌ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌ 18-22 వరకూ ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో జమిలి ఎన్నికలపై చర్చించేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతోంది. కోవింద్ నేతృత్వంలోని ఈ కమిటీలో రిటైర్డ్ జడ్జ్‌లు, మాజీ కేబినెట్ సెక్రటరీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో పాటు రిటైర్డ్ ఎలక్షన్ కమిషనర్, నిపుణులు ఉంటారు. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు (One Nation, One Election Bill) ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
New Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట- 18 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట- 18 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
New Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట- 18 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట- 18 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
Pawan Kalyan: 'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Singer Mangli: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
Bird Flu Latest News:ఆదివారానికి బర్డ్‌ఫ్లూ ఫీవర్‌- ఇంతకీ చికిన్ తినాలా? వద్దా?
ఆదివారానికి బర్డ్‌ఫ్లూ ఫీవర్‌- ఇంతకీ చికిన్ తినాలా? వద్దా?
Big Blow For RCB: ఆర్సీబీ నుంచి కీలక ప్లేయర్ ఔట్.. గతేడాది కప్పు కొట్టడంలో కీ రోల్ పొషించిన స్పిన్నర్
ఆర్సీబీ నుంచి కీలక ప్లేయర్ ఔట్.. గతేడాది కప్పు కొట్టడంలో కీ రోల్ పొషించిన వైనం
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.