అన్వేషించండి

Visakha Steel Plant Issue : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ సెక్టార్ లోకి వెళ్తే నష్టపోయేది ప్రజలే - ఉండవల్లి

Visakha Steel Plant Issue : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మళ్లీ జరగాలని ఉండవల్లి, జేడీ లక్ష్మీనారాయణ, ఆర్.నారాయణ మూర్తి అన్నారు.

Visakha Steel Plant Issue : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో  రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో మహాసదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సినీ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి, జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సమావేశంలో జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఎన్ఎండీసీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కలపాలని సూచించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరట ఉన్న భూములను స్టీల్ ప్లాంట్ కు కేటాయించాలన్నారు. స్టీల్ ప్లాంట్  పై పిల్ వేస్తే, కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు ముడి వేస్తుందన్నారు. ఇంతకన్నా దారుణం ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తుందన్నారు. సంపద కొంతమంది చేతుల్లోకి వెళ్లేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు. కోర్టులో ప్రతిసారి సమయం అడుగుతూ కేసును వాయిదా వేస్తున్నారన్నారు. ఇందులో గెలిస్తే క్రెడిట్ అంతా విశాఖ ప్రజలకు చెందుతుందన్నారు. 

 పార్టీలన్నీ పోరాడాలి 

"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కొనసాగాలి. అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రధాని మోదీ మీకు దండం పెడుతున్నాం.  స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కుపై ప్రజా ఉద్యమం కొనసాగాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఎజెండా పక్కన పెట్టి విశాఖ ఉక్కు కోసం పోరాడాలి. వెంకయ్య నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నా తెలుగు బిడ్డగా పోరాటానికి కలిసి రండి. ఆంధ్రులు ఆరంభసరులే కాదు ప్రారంభ వీరులను విషయాన్ని కూడా కేంద్రం గుర్తుపెట్టుకోవాలి."- ఆర్.నారాయణ మూర్తి

మళ్లీ బ్రిటీష్ పాలన విధానం 

ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యాయన్నారు. ప్రభుత్వ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్లిపోవడం వల్ల నష్టపోయేది ప్రజలు మాత్రమే అన్నారు. సోషలిస్ట్  నుంచి క్యాపిటల్ లిస్ట్ కి వెళ్లాలంటే రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. విశాఖ ఉక్కు  పరిరక్షణ కోసం భారీ సభ నిర్వహించాలని ఒక డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అందరూ సమిష్టిగా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని సూచించారు. బీజేపీది క్యాపిటలిస్ట్ విధానం అన్నారు. దేశాన్ని అమ్మేస్తున్న వాళ్లని, వారి విధానంపై చర్చించాలని సవాల్ చేశారు. పబ్లిక్ సెక్టార్ లో ఉండవలసింది దేశం కోసం తప్పితే వేరొకరి కోసం కాదన్నారు. బ్రిటిష్ కాలం నాటి పరిపాలన మళ్లీ తీసుకొచ్చే విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయన్నారు. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌గా పిలిచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాదాపు 26 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని పేరు మీదే విశాఖ నగరానికి ఉక్కు నగరం అనే పేరు స్థిరపడింది. ప్రారంభంలో ఏడాదికి 3. 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో మొదలైన స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 7. 3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యక్షంగా 17,500 మంది ఉద్యోగులూ, పరోక్షంగా మరో లక్షమంది ఈ స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి పని చేస్తున్నారు. అయితే ఈ సంస్థ నష్టాల్లో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఉపసంహరించు కోవడంతో ఏడాది క్రితం ఆందోళనలు మొదలయ్యాయి. స్టీల్ ఉత్పత్తుల్లో అనేక రికార్డులు సాధించిన  స్టీల్ ప్లాంట్ 2015 నుంచి వరుసగా నష్టాలను చవిచూస్తోంది.  విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడమీ దీనికి ప్రధాన కారణమని కార్మిక సంఘాలు అంటున్నాయి. జిందాల్ లాంటి ప్రైవేటు సంస్థలకు గనులను కేటాయించిన ప్రభుత్వం... విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం అలంటి పనులు చేయడంలేదంటున్నారు. సొంత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. అందుకే గత కొన్నేళ్లుగా సంస్థ నష్ఠాలను నమోదు చేస్తుందంటున్నారు. వాటిని  సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది.

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget