By: ABP Desam | Updated at : 21 Jan 2023 04:22 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి గుడివాడ అమర్ నాథ్
Minister Gudivada Amarnath : విశాఖ కేంద్రంగా పాలనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందని ప్రకటించారు. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలో రెండో రోజు కొనసాగుతున్న ఇన్ఫినిటి వైజాగ్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ... విశాఖలో త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ 9వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. త్వరలో అదాని డేటా సెంటర్ను విశాఖలో ప్రారంభిస్తామని వెల్లడించారు. విశాఖను ఐటీ హబ్ చేయడమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యమన్నారు.
మూడు రాజధానులపై మరోసారి బిల్లు
ఏపీలో మూడు రాజధానులపై చర్చ కొనసాగుతూనే ఉంది. విశాఖ కేంద్రంగా పాలనపై మంత్రులు క్లూస్ ఇస్తూనే ఉన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే రాజధాని ఏర్పాటుపై సమయం దొరికినప్పుడల్లా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఏప్రిల్ నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలన చేస్తారని గతంలో చెప్పిన మంత్రి అమర్నాథ్, తాజాగా మార్చి నుంచే పాలన ప్రారంభం అంటూ మరో క్లూ ఇచ్చారు. అయితే మూడు రాజధానులపై బిల్లు ఉపసంహరించుకున్న ప్రభుత్వం... బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. మూడు రాజధానులపై ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదేలే అంటుంది వైసీపీ ప్రభుత్వం.
మార్చిలో విశాఖ వేదికగా కీలక సదస్సులు
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ విశాఖ నుంచి పాలనకు రూట్ క్లియర్ చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు తరచూ లీక్ లు ఇస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే... నేటి నుంచి సరిగ్గా రెండు నెలల్లో పరిపాలన రాజధాని కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభం అవుతాయని తాజాగా ప్రకటించారు. దీంతో మరోసారి రాజధాని ముహూర్తంపై ఆసక్తి నెలకొంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు బిల్లును తిరిగి పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం కూడా లేకపోలేదు. మార్చిలో విశాఖ వేదికగా కీలక సదస్సులు జరగనున్నాయి. ఈ సదస్సుల కన్నా ముందే సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు.
ఏప్రిల్ నుంచి పాలన అంటూ గతంలో వ్యాఖ్యలు
విశాఖ రాజధానిగా పాలనపై ఇప్పటికే మంత్రులు స్పష్టత ఇచ్చారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏప్రిల్ నుంచి సీఎం జగన్ విశాఖ నుంచి పాలన చేస్తారని గతంలోనే తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వ భవనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రిషికొండపై నిర్మిస్తున్న భవనాలు సిద్ధం అయ్యాక ప్రభుత్వ శాఖల షిఫ్టింగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు కొందరు. ఇటీవల విశాఖలో వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఆ పార్టీ నేతలు శంకుస్థాపన చేశారు. మంత్రుల కామెంట్స్, ప్రభుత్వ పర చర్యలు చూస్తుంటే మరో రెండు, మూడు నెలల్లో విశాఖ రాజధానిగా పాలన ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మూడు రాజధానుల బిల్లు మాటెలా ఉన్నా సీఎం జగన్ మాత్రం విశాఖలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చెయ్యడం ఖాయమని వైసిపీ మంత్రులు పదేపదే చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్టే పరిణామాలు అన్నీ వేగంగా జరిగిపోతున్నాయి . ఫిబ్రవరి తరువాత ఏ క్షణమైనా సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయాన్ని వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్నట్టు పార్టీ సంకేతాలు ఇస్తుంది.
Gudivada Politics : గుడివాడలో పోటీ చేస్తా - కొడాలి నానిని ఇంటికి పంపిస్తా !
VJA Durga Temple Politics : దేవాదాయ శాఖలో వెల్లంపల్లి జోక్యం చేసుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీలో మరో వివాదం
Breaking News Live Telugu Updates: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా?: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
AP Cabintet : ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు - వాటన్నింటికీ గ్రీన్ సిగ్నల్
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!
PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ