అన్వేషించండి

Vizag MP : భూ దందా నిజం కాదు - విశాఖ ఎంపీ లీగల్ నోటీసులు !

ప్రముఖ మీడియాపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. తనపై భూదందా ఆరోపణలు ఆధారాల్లేకుండా చేశారన్నారు.


Vizag MP : విశాఖలో వైఎస్ఆర్‌సీపీ నేతలు భూదందాలకు దిగుతున్నారని పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూర్మన్న పాలెంలో ఓ డెలవప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారని అందులో స్థల యజమానులకు ఒక్కటంటే ఒక్క శాతం మాత్రమే ఇచ్చి తాను 99 శాతం తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వైఎస్ఆర్‌సీపీకే చెందిన మరో ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. అదే విషయాన్ని మీడియా చెప్పింది. అయితే ఇదంతా అవాస్తవమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంవీవీ సత్యనారాయణ లీగర్ నోటీసులు పంపుతున్నట్లుగా ప్రకటించారు. 
  
కూర్మన్నపాలంలో   ఎ.10.57సెం ల భూమి వ్యాపార లావాదేవీలు 2012లో మొదలై  భూ యజమానులతో అగ్రిమెంట్‌ 2018 జనవరి 8న జరిగిందని  ఎంవీవీ సత్యనారాయణ చెబుతున్నారు.   అప్పటికి నేను పార్లమెంటు సభ్యుడను కాదు. కనీసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడను కూడా కాదు. ఎందుకంటే నేను పార్టీలో చేరిందే 2018 మేలో. ఒక వ్యాపారిగా సదరు భూమికి చెందిన ప్రయివేటు వ్యక్తులందరితోనూ ఒప్పందాలు చేసుకుని, వివాదాన్ని పరిష్కరించుకుని నిర్మాణం మొదలుపెట్టామన్నారు.   ఈ భవనానికి జీవీఎంసీ 2019 మార్చిలో అనుమతులిచ్చిందన్నారు. 

 కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాలకు సంబంధించి 1982 నుంచి దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. గొట్టిపల్లి శోభారాణి కుటుంబీకులు, 160 మంది డాక్‌ లేబర్‌ బోర్డు (డీఎల్‌బీ) ఉద్యోగులతో పాటు కొప్పిశెట్టి శ్రీనివాస్‌ల మధ్య 1982 నుంచీ వివాదం ఉంది. వివాదాన్ని పరిష్కరించేలా చూడాలని బిల్డర్‌గా ఉన్న నన్ను 2012లో డీఎల్‌బీ ఉద్యోగులు ఆశ్రయించారని ఎంపీ తెలిపారు.  ఆ 160 మంది ఉద్యోగులకూ ఒక్కొక్కరికీ ఒక్కో ఫ్లాట్‌ చొప్పున మొత్తం 160 ఫ్లాట్లను ఇస్తానని  ఎంపీ హామీ ఇచ్చారు. అందుకు వారు తమ వాటాను ఆయనకు 2012లోనే అగ్రిమెంట్‌ చేశారు.   కొప్పిశెట్టి శ్రీనివాస్‌తో   2017లో ఒప్పందం చేసుకున్నారు. వారికి  వారికి 30వేల చదరపు అడుగులను ఇచ్చేలా 2017లో ఎంఓయు కుదిరిందని ఎంపీ తెలిపారు. 

ఇక మిగిలిన గొట్టిపల్లి  శోభారాణి, ఆమె కుటుంబీకులకు 14,400 చదరపు అడుగులిచ్చేలా వారితో  2018 జనవరిలో ఒప్పందం చేసుకున్నామని.. . ఇవన్నీ ప్రయివేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందాలు. వీటికి ప్రభుత్వంతో ఒక్క శాతం కూడా సంబంధం లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఈ ఒప్పందాలతో పాటు వివిధ పక్షాలకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు చెల్లింపులు కూడా చేశారు.  ఇవన్నీ పూర్తయ్యాక 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతులను నిర్మించుకునేందుకు 2019 మార్చి 11న జీవీఎంసీ ప్లాన్‌ను ఆమోదించిందని తెలిపారు. ఇందులో ఎక్కడా కుంభకోణాలు , అక్రమాలు జరగలదేని అందుకే.. పరువు నష్టం దావా వేస్తున్నామని ఎంపీ తెలిపారు. 

వైఎస్ఆర్‌సీపీ ఎంపీల మధ్య విశాఖలో ఏర్పడిన వివాదం వల్ల బయటకొస్తున్న విషయాలను చెబుతున్న మీడియాపైనా వారు పరువు నష్టం కేసులు వేస్తూండటం చర్చనీయాంశంగా మారింది.  అయితే అందరూ ఆరోపిస్తున్న విషయాలకు..  .కేవలం మీడియాకు మాత్రమే ఎంపీ నోటీసులు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget