అన్వేషించండి

Vijayawada CP Kanthi Rana: షర్మిల ‘భయపడుతున్నారా సార్’ కామెంట్స్, విజయవాడ సీపీ ఏమన్నారంటే!

Police stops YS Sharmila vehicles: విజయవాడకు వస్తున్న షర్మిల వాహనాలను పోలీసులు అడ్డుకోలేదని, అసలు విషయాన్ని సీపీ కాంతి రానా వెల్లడించారు.

Vijayawada News: విజయవాడ: ఏపీ పీసీసీ చీఫ్‌(PCC Chief)గా నేడు వైఎస్ షర్మిలా రెడ్డి()YS Sharmila బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తున్న సమయంలో ఆమె కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్ వాహనాలతో ఏపీ కాంగ్రెస్ ఆఫీసుకు వెళ్తుంటే ఎనికే పాడు వద్ద షర్మిల వాహనాలను పోలీసులు మళ్లించారు. కొన్ని వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. అ సమయంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతోందని.. తన కాన్వాయ్ ను పోలీసులు అందుకే అడ్డుకున్నారని అన్నారు. ’భయపడుతున్నారా సార్’ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
విజయవాడ సీపీ కాంతి రానా రియాక్షన్ ఇలా..
విజయవాడలో షర్మిల కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారన్న ప్రచారంపై సీపీ కాంతి రాణా(Kanthi Rana) స్పందించారు. కొన్ని మీడియాలలో దీనిపై తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగానే సిటీలోకి ఒకేసారి పెద్ద సంఖ్యలో కార్లని పోలీసులు అనుమతించలేదని తెలిపారు. అయితే కాంగ్రెస్ తో కలిసి కొన్ని న్యూస్ ఏజెన్సీలు, కొన్ని సోషల్ మీడియా గ్రూపులు కలిసి ఏపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. 

మొదట గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి షర్మిల వాహనాలు బయలేదేరాయన్నారు. ఆమె వాహనంతో పాటు వెంట మరికొన్ని వాహనాలు వెళ్లిపోయాయని తెలిపారు. ఆ తరువాత మరో 50 నుంచి 100 వాహనాలు వెళ్తుంటే రెగ్యూలర్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఆ వాహనాలను ఆపినట్లు చెప్పారు. వాస్తవానికి అంత భారీ సంఖ్యలో వాహనాలను ఒక్కసారిగా అనుమతించరని, వెనుక వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేసినట్లు విజయవాడ సీపీ కాంతి రాణా వివరించారు. 

కేంద్రానికి తొత్తులుగా టీడీపీ, వైసీపీ!
బీజేపీ అధికారంలో 10 ఏళ్లు ఉండి... ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. అందులో ఏపీకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి వచ్చాయని ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు కాదు కదా... ఉన్న ఉద్యోగాలు ఊడి పోయే పరిస్థితి వచ్చిందన్నారు. అప్పు లేని రైతు దేశంలో ఎక్కడా లేడు అని, దేశంలో బీజేపీ సర్కార్ రైతులను మోసం చేసిందని ఆరోపించారు. ఒక్క రైతు అకౌంట్ లో అయినా డబ్బులు పడ్డాయా ? అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేస్తుంటే... టీడీపీ, వైసీపీ ఎందుకు తొత్తులుగా మారారు? రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీ లు బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నారని విమర్శించారు. కేంద్రానికి ఈ రెండు పార్టీలు తొత్తులు అయితే, టీడీపీ, వైసీపీకి మనం ఓట్లు ఎందుకు వేయాలని షర్మిల ప్రశ్నించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget