అన్వేషించండి

బెజవాడ మూడు స్థానాల్లో అభ్యర్థులు ఈ ముగ్గురే - ధ్రువీకరించేసిన సజ్జల

బెజవాడలోని మూడు నియోజకవర్గాలకు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ లకే తిరిగి సీట్లను ఇస్తామని వారిని గెలిపించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.

ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నగరం అత్యంత కీలకమయిన నగరం.. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఇప్పుడు రెండు స్దానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. మూడో నియోజకవర్గం అయిన తూర్పు నియోజకవర్గంలో తెలుగు దేశం శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్ ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న వారికి సీట్లు ఇస్తామని వారిని గెలిపించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటనతో విజయవాడ లోని మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  జెండా ఎగరాలని పార్టి శ్రేణులకు పిలుపునిచ్చారు.

మూడు సీట్లు కీలకం
విజయవాడ నగరంలోని మూడు సీట్లను దక్కించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నుండి గెలిచి, మంత్రిగా కూడా పని చేశారు. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు, శాసన సభ్యుడిగా గెలుపొందగా, ఆయనకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా జగన్ బాధ్యతలను అప్పగించారు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇంచార్జ్ గా దేవినేని అవినాష్ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ  అభ్యర్ది గద్దె రామ్మోహన్ శాసన సభ్యుడిగా గెలుపొందారు.

గెలుపు చాలా ఈజీ అంటున్న వైసీపీ...
ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోని మూడు నియోజకవర్గాల్లో గెలుపు చాలా ఈజీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  భావిస్తోంది. గతంలో ఉన్న పరిస్దితులుకు భిన్నంగా ఇప్పడు విజయవాడ చాలా ప్రశాంత వాతావరణం ఉంది. రాజకీయ అల్లర్లు లేవు, దీంతో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించటం చాలా సునాయాసమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పాటుగా ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించటం కూడ ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. మరో నియోజకవర్గంలో పట్టు సాధిస్తే మూడు నియోజకవర్గాల్లో కూడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ నాయకుల్లో జోష్ నెలకొంది.

ప్రతిపక్షాల బలం ఎంత...
ఇదే సమయంలో మూడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీల బలం ఎంత అనే విషయం పై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగు దేశం, జనసేన ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా విజయవాడ సెంట్రల్  నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండేందుకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ గడిచిన ఎన్నికల్లో కేవలం 32 ఓట్లతో మాత్రమే తెలుగు దేశం ఓటమి పాలయ్యింది. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ తరపున ఉన్న గద్దె రామ్మోహన్ కు మంచిపేరు ఉంది. స్దానికంగా తెలుగు దేశం పార్టీకి కూడ బలం ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్ష పార్టిని ఢీ కొట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి కోణాల్లో పని చేయాలని పార్టీ నాయకులు అంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Elections 2025: ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం, భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం, భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
Nara Lokesh in Delhi: ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
Telangana Assembly:  ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan South Indian Temples Tour | పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించటం లేదంటే.! | ABP DesamErrum Manzil Palace | నిర్లక్ష్యానికి బలైపోతున్న చారిత్రక కట్టడం | ABP DesamArya Vysya Corporation Chairman Doondi Rakesh Interview | ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్ ఇంటర్వ్యూ | ABP DesamTirupati Deputy Mayor Election MLC Kidnap | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో హై టెన్షన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Elections 2025: ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం, భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం, భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
Nara Lokesh in Delhi: ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
Telangana Assembly:  ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
Pawan Kalyan Latest News Today In Telugu: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Revanth Reddy Challenge: చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
Jr NTR: అభిమానులకు ఎన్టీఆర్ రిక్వెస్ట్... త్వరలో నేనే కలుస్తా, నన్ను కలవడానికి పాదయాత్రలు వద్దు!
అభిమానులకు ఎన్టీఆర్ రిక్వెస్ట్... త్వరలో నేనే కలుస్తా, నన్ను కలవడానికి పాదయాత్రలు వద్దు!
Revanth Reddy in Assembly: లోటుపాట్లు లేకుండా సమగ్ర సర్వే - కులగణన నివేదిక ఖచ్చితమైనదన్న రేవంత్ !
లోటుపాట్లు లేకుండా సమగ్ర సర్వే - కులగణన నివేదిక ఖచ్చితమైనదన్న రేవంత్ !
Embed widget