అన్వేషించండి

Krishna River: అభిమాన పార్టీ ఓడిందని సంసారానికి భర్త దూరం! నిలదీస్తే ఒకటే ఏడుపు - కృష్ణా నదిలో భార్య నిరసన

Krishna River: శోభనం సమయంలో 3 రాత్రులు భర్త తన దగ్గరికి రాకుండా ఉన్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆ విషయం తన అత్తామామలకు చెప్తే తమ పరువు పోతుందని బెదిరిస్తున్నాడని చెబుతోంది.

Krishna River Protest: తన భర్త సంసారానికి పనికిరాడని తెలిసి తనకు పెళ్లి చేశారని ఆరోపిస్తూ ఓ బాధితురాలు ఏకంగా క్రిష్ణా నదిలో నిరసనకు దిగింది. ఆమెకు కుటుంబ సభ్యులు కూడా మద్దతు పలికారు. చందర్లపాడు మండలం ఏటూరు కృష్ణా నదిలో భార్య నిరసనకు దిగింది. గత నాలుగు సంవత్సరాల క్రితం చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన ఓ మహిళ నందిగామ మండలం చందాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే శోభనం సమయంలో ఆ మూడు రాత్రులు తన వద్దకు రాకుండా ఉన్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆ విషయం తన అత్తామామలకు చెప్తే తమ పరువు పోతుందని, బయటకు చెప్పదని బెదిరింపులకు గురి చేశాడని బాధితురాలు వాపోయింది.

తనకు విడాకులు కావాలని డిమాండ్ చేయడంతో గ్రామ పెద్దల సమక్షంలో తనకు రూ.15 లక్షలు ఇస్తానని తన అత్త మామలు ఒప్పుకున్నారని అన్నారు. చివరికు డబ్బు ఇవ్వకపోగా తమపై కోర్టుకు వెళ్ళి తమను ఇబ్బందులు గురి చేసి, తమపై పరువు నష్టం వేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం జరిగే వరకూ కృష్ణా నదిలో నీళ్ళు తాగి నిరసన చేపడతామని కుటుంబ సభ్యులు, బాధితురాలు వాపోయారు.

‘‘నా భర్త నాతో సంసారం చేయడం లేదు. ఇప్పటికి పెళ్లి జరిగి 4 సంవత్సరాలు జరిగింది. ఇదంతా నా భర్త చెల్లెలితో చెప్తే, ఈ విషయం బయటికి చెప్పొద్దని, చెప్తే తమ పరువు పోతుందని అన్నది. నేను గట్టిగా నిలదీస్తే నా భర్త ఆడవారిలా ఏడుస్తున్నాడు. నా దగ్గరికి రాకుండా.. ఎప్పుడూ దూరంగా ఉంటున్నాడు. పడుకునే సమయంలో అటు పక్కకు తిరిగి పడుకుంటున్నాడు. ఈ విషయం మా తల్లిదండ్రులతో చెప్తే వారు వచ్చి మాట్లాడారు. ఇక నుంచి బాగానే ఉంటారని చెప్పి వారిని పంపేశారు. ఇక ఆ తర్వాత నుంచి బ్లాంక్ పేపర్ల మీద నాతో ఏవో సంతకాలు తీసుకొని బయటికి ఈ విషయం చెప్తే సహించేది లేదని బెదిరించారు. ఇంకా అదనపు కట్నం కావాలని కూడా వేధించేవారు. నేను ఇంత కాలం భరించి నా తల్లిదండ్రులకు చెప్తే ఇలా నిరసన చేస్తున్నాం.’’ అని బాధితురాలు వాపోయారు.

క్రిష్ణా నదిలో నిరసన చేసేందుకు గల కారణాన్ని చెబుతూ.. వారి ఇంటి ముందు నిరసన చేస్తే పోలీసులకు చెప్పించి అడ్డుకుంటారని, అక్కడ ఎలాగూ న్యాయం జరగదు కాబట్టి, క్రిష్ణా నదిలో నిరసన తెలియజేస్తున్నట్లుగా వాపోయారు. 

బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ.. పెళ్లి జరిగిన వెంటనే శోభనం జరిగిన రాత్రి తర్వాత ఆమె బొట్టు, పూలు చిందరవందర చేసుకోమని అతను కోరాడని చెప్పారు. ఆ తర్వాత తన నానమ్మ చనిపోయిందని, తనకు నచ్చిన రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బాధగా ఉందంటూ రకరకాల కారణాలు చెప్పి భార్యతో కలవకుండా ఉన్నాడని వివరించారు. 2 సంవత్సరాల క్రితమే విడాకుల కోసం యత్నించినా, తాము ఇచ్చిన కట్నం వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని వివరించారు. తన కొడుకు విషయం బయట చెబితే తమ పరువుపోతుంది కాబట్టి, బెదిరిస్తున్నారని ఆదేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని అందుకే నిరసన చేస్తున్నట్లుగా బాధితులు వాపోయారు.

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget