అన్వేషించండి

Pawan On YCP: ప్రతి రైతు కుటుంబానికి రూ. 50వేల పెట్టుబడి సాయం ఏమైందీ? ఎంతమందికిచ్చిందీ ప్రభుత్వం: పవన్‌

రైతుల ఆత్మహత్యలపై పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలు సక్రమంగా పని చేస్తే ఈ సమస్య రాదన్నారు. ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు.

అన్నం పెట్టే రైతన్నను కూడా కులాల వారీగా విభజించి ఘనత వైసీపీ(YSRCP) ప్రభుత్వానికి చెందుతుందన్నారు జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan). కౌలు రైతు ఆత్మహత్యలపై బహిరంగ లేఖ రాసిన ఆయన... బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతును రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు పవన్. రాష్ట్రంలో నిత్యం ఏదో ప్రాంతంలో అన్నదాతల బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు అత్యంత విషాదకరమన్నారు. పల్నాడు జిల్లా మేళ్లవాగుకి చెందిన మేడబోయిన రామకృష్ణ, నంద్యాల జిల్లా హరీవనం గ్రామస్థుడు వెంకటేశ్వరరెడ్డి, కర్నూలు జిల్లా హోసూరుకి చెందిన ఉప్పర తిక్కయ్య అప్పులు భారంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

ప్రధానంగా కౌలు వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి చట్టబద్దంగా రావాల్సిన పరిహారాన్ని తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు పవన్. ఈ బాధ్యతను నెరవేర్చాల్సిన వ్యవస్థలు, సంబంధిత అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించకూడదని సూచించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం త్రి మెన్ కమిటీ సత్యరమే స్పందించాలన్నారు. రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకుండా వ్యవస్థ పనిచేయాలని అభిప్రాయపడ్డారు. 

ప్రతి రైతు కుటుంబానికి రూ. 50వేలు చొప్పున పంట పెట్టుబడి ఇస్తామని వైసీపీ నాయకత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు పవన్. ఆ మేరకు ప్రచారం చేశారన్నారు. ఇప్పటి వరకు ఎన్ని రైతు కుటుంబాలకు రూ. 50 వేలు చొప్పున పంట పెట్టబడి ఇచ్చారో చెప్పాలని డిమాంImageడ్ చేశారు. అసలు ఆ హామీ ఏమైందని నిలదీశారు. 

రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట డబ్బులు సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వ విఫలమవుతోంది మండిపడ్డారు పవన్.  పంట అమ్ముకున్న తర్వాత సొమ్ములు చేతికి రాకపోవడం, తదుపరి పంటకు పెట్టబడి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కౌలు రైతులకు బ్యాంకులు, సహాకార సంఘాల నుంచి రుణాలు అందడం లేదని దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నారు. వారి వద్ద తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని వివరించారు. 

వైసీపీ ప్రభుత్వం ఇలాంటి సందర్భంలో బాధ్యత తీసుకోరు.. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించడం, పండిన పంట తీసుకొని కూడా డబ్బులు ఇవ్వడం లేదన్నారు జనసేనాని. ఏ దశలోనూ రైతులకు వైసీపీ అండగా నిలబడటం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం అన్నం పెట్టిన రైతలకు కూడా కులాలవారీగా విభజించిందని కామెంట్ చేశారు. 

కౌలు రైతు కుటుంబాలను ఆదుకునే దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తోందని తెలిపారు పవన్. గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల్లో ప్రతి ఒక్కరికీ రూ. 7 లక్షల పరిహారం అందేలా పోరాడుతుందన్నారు. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పక్షాన భరోసా కల్పిస్తామన్నారు పవన్ కల్యాణ్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Embed widget