అన్వేషించండి

Mandali Buddha Prasad: హామీలు అమలు చేయమంటే ఎమ్మెల్యే దాడి చేస్తారా? - బుద్ధప్రసాద్‌ ఫైర్

Mandali Buddha Prasad: టీడీపీ, జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అనుచరులతో కలిసి దాడి చేయడం దారుణమని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ మండిపడ్డారు.

Mandali Buddha Prasad: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన టీడీపీ, జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అనుచరులతో కలిసి దాడి చేయడం దారుణమని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ మండిపడ్డారు. వివరణ ఇవ్వాల్సిన ఎమ్మెల్యే.. తాను ప్రజాప్రతినిధిని అనే విషయం మరచి, తన క్రిమినల్‌ మైండ్‌ని ఉపయోగించి దాడికి పాల్పడ్డారని విమర్శించారు. పక్కా పథకం మేరకు దాడి జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని వెళ్లిపొమ్మని చెప్పి వ్యూహాత్మకంగా దాడికి పాల్పడ్డారని బుద్దప్రసాద్ ఆరోపించారు. 

ఎక్కడికైనా తాను ఒంటరిగా వస్తానని చెప్పే సింహాద్రి రమేష్‌బాబు.. శుక్రవారం కూడా ఒంటరిగా తన కార్యాలయం నుంచి బయటకు వెళ్లి ధర్నా చేస్తున్న వారికి సమాధానం చెప్పలేకపోయారా? అని నిలదీశారు. సింహాద్రి రమేష్‌బాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శించారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకులకు ఉందన్నారు. సింహాద్రి రమేష్ ఇలా దాడులు చేయడం కొత్త ఏం కాదని అన్నారు. గతంలో బ్యాంకు లోన్‌ కట్టమని అడిగినందుకు మేనేజర్‌ని బ్యాంకు నుంచి బయటకు లాగి కొట్టిన విషయం అందరికీ తెలుసునన్నారు. అలాగు నాగాయలంకలో నాబార్డ్‌ ఛైర్మన్‌ ఎదుట స్థానిక ఎంపీ ప్రధాన అనుచరుడిని కొట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

నిరసన తెలిపే హక్కు దేశంలో ప్ర తిపౌరుడికి ఉందని బుద్ధ ప్రసాద్ అన్నారు. టీడీపీ హయాంలో వైసీపీ నేతలు ఎన్ని నిరసనలు చేపట్టారో తెలియదా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాలను భయపెట్టేలా వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రవర్తిస్తున్నారని, పోలీసులు వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. అవనిగడ్డలో బంద్‌ జరగనివ్వకుండా వీధుల్లో పోలీసు కవాతు నిర్వహించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సబబు కాదని మండిపడ్డారు. వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసిన షాపులను బలవంతంగా తెరిపించడం పోలీసులకు తగదని హితవుపలికారు. నేరస్థులపై దృష్టిపెట్టాల్సిన పోలీసులు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రతిపక్షాలపై దృష్టి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార పార్టీ నేతల సేవలో పోలీసులు తరిస్తున్నారని బుద్ధ ప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తున్నా చక్కదిద్ధడంలో పోలీసులు విఫమయ్యారని అన్నారు. అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడు కోట శ్రీహరిరావు హత్య జరిగి దాదాపు రెండేళ్లు కావస్తున్నా నేరస్థులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రజలను వేధించిన పాలకులు ఎక్కువ రోజులు పాలించినట్లు చరిత్రలో లేదన్నారు. 

ఏం జరిగిందంటే?
కృష్ణా జిల్లా అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇంటిని టీడీపీ, జనసేన నాయకులు ముట్టడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఆందోళనకు దిగారు. తన ఇంటిని ముట్టడించడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా కర్ర తీసుకుని  జనసేన టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు జనసేన, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది.  ఎమ్మెల్యే రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారావు జనసేన కార్యాలయం వరకు కర్రలతో వెళ్లి మరీ దాడి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన, టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget