అన్వేషించండి

Mandali Buddha Prasad: హామీలు అమలు చేయమంటే ఎమ్మెల్యే దాడి చేస్తారా? - బుద్ధప్రసాద్‌ ఫైర్

Mandali Buddha Prasad: టీడీపీ, జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అనుచరులతో కలిసి దాడి చేయడం దారుణమని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ మండిపడ్డారు.

Mandali Buddha Prasad: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన టీడీపీ, జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అనుచరులతో కలిసి దాడి చేయడం దారుణమని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ మండిపడ్డారు. వివరణ ఇవ్వాల్సిన ఎమ్మెల్యే.. తాను ప్రజాప్రతినిధిని అనే విషయం మరచి, తన క్రిమినల్‌ మైండ్‌ని ఉపయోగించి దాడికి పాల్పడ్డారని విమర్శించారు. పక్కా పథకం మేరకు దాడి జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని వెళ్లిపొమ్మని చెప్పి వ్యూహాత్మకంగా దాడికి పాల్పడ్డారని బుద్దప్రసాద్ ఆరోపించారు. 

ఎక్కడికైనా తాను ఒంటరిగా వస్తానని చెప్పే సింహాద్రి రమేష్‌బాబు.. శుక్రవారం కూడా ఒంటరిగా తన కార్యాలయం నుంచి బయటకు వెళ్లి ధర్నా చేస్తున్న వారికి సమాధానం చెప్పలేకపోయారా? అని నిలదీశారు. సింహాద్రి రమేష్‌బాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శించారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకులకు ఉందన్నారు. సింహాద్రి రమేష్ ఇలా దాడులు చేయడం కొత్త ఏం కాదని అన్నారు. గతంలో బ్యాంకు లోన్‌ కట్టమని అడిగినందుకు మేనేజర్‌ని బ్యాంకు నుంచి బయటకు లాగి కొట్టిన విషయం అందరికీ తెలుసునన్నారు. అలాగు నాగాయలంకలో నాబార్డ్‌ ఛైర్మన్‌ ఎదుట స్థానిక ఎంపీ ప్రధాన అనుచరుడిని కొట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

నిరసన తెలిపే హక్కు దేశంలో ప్ర తిపౌరుడికి ఉందని బుద్ధ ప్రసాద్ అన్నారు. టీడీపీ హయాంలో వైసీపీ నేతలు ఎన్ని నిరసనలు చేపట్టారో తెలియదా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాలను భయపెట్టేలా వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రవర్తిస్తున్నారని, పోలీసులు వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. అవనిగడ్డలో బంద్‌ జరగనివ్వకుండా వీధుల్లో పోలీసు కవాతు నిర్వహించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సబబు కాదని మండిపడ్డారు. వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసిన షాపులను బలవంతంగా తెరిపించడం పోలీసులకు తగదని హితవుపలికారు. నేరస్థులపై దృష్టిపెట్టాల్సిన పోలీసులు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రతిపక్షాలపై దృష్టి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార పార్టీ నేతల సేవలో పోలీసులు తరిస్తున్నారని బుద్ధ ప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తున్నా చక్కదిద్ధడంలో పోలీసులు విఫమయ్యారని అన్నారు. అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడు కోట శ్రీహరిరావు హత్య జరిగి దాదాపు రెండేళ్లు కావస్తున్నా నేరస్థులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రజలను వేధించిన పాలకులు ఎక్కువ రోజులు పాలించినట్లు చరిత్రలో లేదన్నారు. 

ఏం జరిగిందంటే?
కృష్ణా జిల్లా అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇంటిని టీడీపీ, జనసేన నాయకులు ముట్టడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఆందోళనకు దిగారు. తన ఇంటిని ముట్టడించడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా కర్ర తీసుకుని  జనసేన టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు జనసేన, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది.  ఎమ్మెల్యే రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారావు జనసేన కార్యాలయం వరకు కర్రలతో వెళ్లి మరీ దాడి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన, టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
Embed widget