అన్వేషించండి

అవినాష్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో విజయవాడ తూర్పు వైసీపీలో వార్‌- యలమంచిలి రవి ఏం చేయబోతున్నారు?

దేవినేని వర్సెస్‌ యలమంచిలి. ఇది ఇప్పటి పొలిటికల్ వార్ కాదు.. దశాబ్ధాలుగా నడుస్తున్న ఫైట్. కానీ ఆ రెండు ఫ్యామిలీకి చెందిన వారసులు ఒకే పార్టీలో ఉన్నారు. అందులో ఒకరికి టికెట్ వచ్చింది.

బెజవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరును సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేశారు. నియోజకవర్గ సమీక్ష సమావేశంలో దేవినేని అవినాస్‌ను గెలిపించుకునే బాధ్యత మీత చేతుల్లో పెడుతున్నానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలతో వైసీపీలో చర్చ మొదలైంది.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ శాసన సభ్యుడిగా పని చేస్తున్నారు. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలు వైసీపీనే గెల్చుకుంది. మరో నియోజకవర్గం తూర్పులో మాత్రం టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన గద్దె రామ్మెహన్ విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో ఆ ఒక్క నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్సీపీనే దక్కించుకోవాలని సీఎం జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

వైసీపీ తూర్పులో మొదలైన అంతర్గ విభేదాలు

విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీలో అప్పుడే విభేదాలు మెదలయ్యాయి. సీఎంతో సమావేశానికి నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న దేవినేని అవినాష్‌తో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, విజయావాడ నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బొప్పన భువకుమార్, అదే నియోజకవర్గానికి చెందిన కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషుతోపాటుగా మరి కొందరు నాయకులు హజరయ్యారు. నియోజకవర్గంలో అత్యంత కీలకంగా ఉన్నమాజీ శాసన సభ్యుడు యలమంచిలి రవి సమావేశానికి హాజరు కాలేదు. ఆయనకు సమావేశానికి సంబంధిచిన సమాచారం కానీ ఆహ్వానం కూడా అందలేదని యలమంచిలి వర్గం చెబుతుంది. నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్‌కు యలమంచిలి రవి కుటుంబానికి మధ్య ఉన్న విభేదాలతోనే యలమంచిలి రవిని దూరం పెట్టారని ప్రచారం జరుగుతుంది. దేవినేని, యలమంచిలి కుటుంబాలు ఒకే సామాజిక వర్గం అయినప్పటికి రాజకీయాం ఆది నుంచి విభేదాలు ఉన్నాయి.

దేవినేని వర్సెస్ యలమంచిలి 

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గతంలో యలమంచిలి నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆయన చనిపోవటంతో ఆయన కుమారుడు యలమంచిలి రవి ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయవాడ తూర్పులో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నెహ్రూపై టీడీపీ నుంచి ప్రత్యర్థిగా ఉన్న దేవినేని రాజశేఖర్ విజయం సాధించారు. యలమంచిలి, దేవినేని కుటుంబాల మధ్య రాజకీయంగా మొదటి నుంచి పోటీ సాగుతోంది. యలమంచిలి రవిపై విజయం సాధించాలని దేవినేని నెహ్రూ చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కాలక్రమంలో ఇద్దరు నాయకులు చనిపోయారు. ఇప్పుడు యలమంచిలి, దేవినేని కుటుంబాలకు చెందిన వారసులు ఇరువురు వైసీపీలనే ఉన్నారు. అయితే యలమంచిలి రవి సైలెంట్ పాలిటిక్స్‌లో కొనసాగుతుండగా దేవినేని వారసుడిగా వచ్చిన దేవినేని అవినాష్ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ గా పని చేస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్న సీఎం విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో కూడా సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే అవినాష్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు యలమంచిలి రవి ఏం చేయబోతున్నారనే చర్చ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో నడుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget