అన్వేషించండి

Vijayawada Rains: మోకాలు లోతు నీళ్లలోకి దిగిన మహిళా మంత్రి- ఇంటింటికీ వెళ్లి ఆహారం, పాలు, వాటర్ బాటిళ్ల పంపిణీ

Andhra Pradesh News | ఏపీ మంత్రి సవిత విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. 54, 55, 56 డివిజన్లలో మోకాలు లోతు నీళ్లలోకి దిగి ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నారు.

AP minister Savitha visits floods affected area in Vijayawada | అమరావతి: ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని పరిశీలించి.. బాధితులకు సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళా మంత్రి సవిత మోకాలు లోతు నీళ్లలోకి దిగి విజయవాడలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వర్షాల కారణంగా ఆహారం, నీళ్లు లభించక ఇబ్బంది పడుతున్నారని గ్రహించారు. విజయవాడ నగరంలో 54, 55, 56 డివిజన్లలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత పర్యటించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో మరిన్ని సేవలు అందించే లక్ష్యంతో మంత్రులకు నగరంలోని పలు డివిజన్లను సీఎం చంద్రబాబు కేటాయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి సవితకు విజయవాడలో మూడు డివిజన్లను అప్పగించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి సవితమ్మ తనకు అప్పగించిన డివిజన్లలో పర్యటించి.. మోకాలు లోతు వరద నీటిలో తిరుగుతూ ప్రజలను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని, ఎవ్వరూ దిగులు చెందవద్దని చెబుతూ వారికి ఆహారం, నీళ్లు, పాలు అందజేస్తున్నారు. 

Vijayawada Rains: మోకాలు లోతు నీళ్లలోకి దిగిన మహిళా మంత్రి- ఇంటింటికీ వెళ్లి ఆహారం, పాలు, వాటర్ బాటిళ్ల పంపిణీ

మోకాలులోతు నీటిలో ఇంటింటికీ వెళ్లి పరామర్శ...
మంత్రి సవిత తొలుత 54 డివిజన్ లో పర్యటించారు. ఆహారం పొట్లాలు, పాల కాటన్లు, వాటర్ బాటిళ్లు కేసుల ఎన్ని వచ్చాయని ఆ డివిజన్ ఆఫీసర్ సేదు మాధవన్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వం అందించే ఆహార పదార్థాలు అనుకున్న సమయానికి చేరాలని మంత్రి స్పష్టంచేశారు. అనంతరం టీడీపీ నేతలు ఫతుల్లా అహ్మద్ తో కలిసి టీఎస్పీ స్ట్రీట్, గాంధీ బొమ్మ సెంటర్, లక్ష్మయ్య స్ట్రీట్, ఈఫెన్ స్ట్రీట్ లో ఉన్న మోకాలు లోతు నీటిలోకి దిగి ఇంటింటికీ వెళ్లి బాధితులను కలిసి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున పాలు, ఆహారం, వాటర్ బాటిళ్లను స్వయంగా మంత్రి పంపిణీ చేశారు. సమీపంలో ఉన్న పునరావాస కేంద్రానికి తరలివెళ్లాలని వరద బాధితులకు సూచించారు. ఏమైనా కావాలంటే అడగాలని, భయపడాల్సిన అవసరం లేదన్నారు.

రోడ్లపై నీరు నిలబడకుండా కాలువల్లో పూడికలు తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని మంత్రి సవిత ఆదేశించారు. అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేయాలని డివిజన్ స్పెషాలాఫీసర్ సేదు మాధవన్ కు సూచించారు. అనంతరం 55 డివిజన్ లో మంత్రి పర్యటించి, అపార్టుమెంట్ల ఉన్నవారితో మైక్ సెట్ లో మాట్లాడారు. పాలు, ఆహారం, నీరు అందాయా..? అని వారిని అడిగారు. అనంతరం ఓల్డ్ ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలు, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ల పంపిణీకి ఏర్పాటు చేసిన మూడు ట్రాక్టర్లను మంత్రి ప్రారంభించారు. 55 డివిజన్ సీఎస్ఐ సెంటర్లో ముగ్గురు దివ్యాంగులను(అంధులు) గుర్తించిన మంత్రి సవిత వారిని పలకరించారు. వారిని సమీపంలో ఉన్న పునరావాస కేంద్రానికి ఆటోలో తరలించాలని మంత్రి ఆదేశించారు. 

బుడమేరు బాధితుల్లో భరోసా
బుడమేరు కాలువ వల్ల నీటముగిని 56 డివిజన్ లో ఉన్న పాత రాజరాజశ్వేరి పేట లో ముంపు ప్రాంతాల్లో పవర్ బోటు ద్వారా ఇంటింటికీ వెళ్లారు. నాలుగు గంటలకు పైగా అక్కడ ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లను మంత్రి సవిత స్వయంగా అందజేశారు. సీఎం చంద్రబాబు అన్ని చూసుకుంటారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. సమస్యలు ఉంటే తప్పనిసరిగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

Also Read: విజయవాడలో అపశ్రుతి, వరదలో కొట్టుకుపోయి లైన్‌మెన్‌ మృతి - మంత్రి గొట్టిపాటి విచారం

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget