అన్వేషించండి

AP Floods Amount: ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ

AP Floods | ఏపీలో వరద బాధితులకు సెప్టెంబర్ 25న వరద సాయం అందించనున్నారు. అయితే ఇటీవల ప్రకటించిన దాని కంటే పరిహారం ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జీవో జారీ చేశారు.

Flood Victims In Andhra Pradesh | అమరావతి: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన మొత్తం కంటే వరద బాధితులకు ఆర్థిక సాయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు (సెప్టెంబర్ 23న) ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో వరద బాధితులకు సెప్టెంబర్ 25న పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు.

179 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు ప్రకటించిన సాయాన్ని పెంచారు. ఎస్ఆర్ఎఫ్ రూ.11 వేలు నిర్దేశించగా.. ఏపీ ప్రభుత్వం ఆ సాయం మొత్తాన్ని రూ. 25 వేలకు పెంచింది. ఎస్ఆర్ఎఫ్ నిర్దేశించిన మొత్తం కంటే వరద బాధితులకు అదనంగా ఆర్థిక సాయం చేసేందుకుగానూ స్కేల్ ఆఫ్ ఫైనాన్సు మార్చుతూ రాష్ట్ర ఉత్తర్వులు ఇచ్చింది. ఆగస్టు నెలాఖరులో, సెప్టెంబర్ ప్రారంభంలో వచ్చిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వరద బాధితులకు సెప్టెంబర్ 17న సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా వరద ముంపు బాధితులకు ఆర్ధిక సాయం పెంచుతున్నట్లుగా రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.  

నష్టపరిహారంపై ఇటీవల ప్రభుత్వం ప్రకటన

రాష్ట్రంలో వరదలతో ప్రభావితం అయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం, ఇళ్లలోకి నీరు వచ్చిన ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేవారికి రూ.10 వేలు ఇస్తామని చంద్రబాబు ఇటీవల ప్రకటించడం తెలిసిందే. చిరు వ్యాపారులకు రూ.25 వేల చొప్పున, ఆటో వంటి మూడు చక్రాలు ఉండే వాహనాలకు రూ.10 వేలు, టూవీలర్స్‌ దెబ్బతిన్న వారికి రూ.3 వేలు ఇస్తామన్నారు.

వరదల్లో నష్టపోయిన ఒక్కో కోడికిగానూ రూ.100, కోళ్ల ఫారం షెడ్డు డ్యామేజీ అయిన వారికి రూ.5 వేలు పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. గొర్రెలకు రూ.7,500, ఎద్దులకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, ఎడ్ల బండి కోల్పోయిన వారికి కొత్తవి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. చేనేత కార్మికులకు రూ.15 వేలు, నష్టపోయిన సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు (MSME)ల్లో రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్‌ పరిధి వాటికి రూ.1లక్ష, అంతకుమించి టర్నోవర్‌ ఉన్న వాటికి రూ.1.5 లక్షలు పరిహారం ఇస్తామన్నారు. 

వ్యవసాయ రంగానికి సంబంధించి పరిహారం వివరాలు

వ్యవసాయానికి సంబంధించి ఒక హెక్టారు (2.47 ఎకరాలు) పత్తికి రూ.25 వేలు, వేరు శనగ అయితే రూ.15 వేలు, వరి ఎకరాకు రూ.10 వేలు, చెరకు రూ.25 వేలు పరిహారం ఇవ్వనున్నారు. పసుపు, అరటికి రూ.35 వేలు, మొక్క జొన్న, రాగులు, కొర్ర, సామలకు హెక్టారుకు రూ.15 వేలు, హెక్టార్‌ ఫిషింగ్‌ ఫామ్‌ డీసిల్టేషన్, రెస్టిరేషన్‌కు రూ.15 వేలు అందించనుంది ప్రభుత్వం. మత్స్యకారుల ఫిషింగ్‌ బోట్‌, వల పూర్తిగా దెబ్బతింటే రూ.20 వేలు, పాక్షికంగా దెబ్బ తింటే రూ.9 వేలు ఇస్తామన్నారు. సెరీ కల్చర్‌కు రూ.6 వేలు ఇస్తారు.

Also Read: Vijayawada floods: వరదలు నేర్పిన గుణపాఠం - పునరావృతం కాకుండా సన్నద్ధత ఎలా!, నిపుణులు ఏం చెబుతున్నారంటే?

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Attack: కళ్లముందే ఉగ్రదాడి చూసి వణికిపోతున్న బాధితులు..మేమున్నాం అని ధైర్యం చెబుతున్న భారత సైన్యం!
కళ్లముందే ఉగ్రదాడి చూసి వణికిపోతున్న బాధితులు..మేమున్నాం అని ధైర్యం చెబుతున్న భారత సైన్యం!
AP Tragedy: ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు మంత్రుల నివాళి, వైజాగ్ చేరుకున్న చంద్రమౌళి మృతదేహం
ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు మంత్రుల నివాళి, వైజాగ్ చేరుకున్న చంద్రమౌళి మృతదేహం
Pak Reaction on Pahalgam Attack: మేం ఏం చేయలేదు, పహల్గాం ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వమే కారణం: పాకిస్తాన్
మేం ఏం చేయలేదు, పహల్గాం ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వమే కారణం: పాకిస్తాన్
Harika Narayan: లెజెండరీ కీరవాణి గురించి ఆ మాటలేంటి? ఆపేస్తే బెటర్... వీడియో రిలీజ్ చేసిన హారికా నారాయణ్
లెజెండరీ కీరవాణి గురించి ఆ మాటలేంటి? ఆపేస్తే బెటర్... వీడియో రిలీజ్ చేసిన హారికా నారాయణ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Attack: కళ్లముందే ఉగ్రదాడి చూసి వణికిపోతున్న బాధితులు..మేమున్నాం అని ధైర్యం చెబుతున్న భారత సైన్యం!
కళ్లముందే ఉగ్రదాడి చూసి వణికిపోతున్న బాధితులు..మేమున్నాం అని ధైర్యం చెబుతున్న భారత సైన్యం!
AP Tragedy: ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు మంత్రుల నివాళి, వైజాగ్ చేరుకున్న చంద్రమౌళి మృతదేహం
ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు మంత్రుల నివాళి, వైజాగ్ చేరుకున్న చంద్రమౌళి మృతదేహం
Pak Reaction on Pahalgam Attack: మేం ఏం చేయలేదు, పహల్గాం ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వమే కారణం: పాకిస్తాన్
మేం ఏం చేయలేదు, పహల్గాం ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వమే కారణం: పాకిస్తాన్
Harika Narayan: లెజెండరీ కీరవాణి గురించి ఆ మాటలేంటి? ఆపేస్తే బెటర్... వీడియో రిలీజ్ చేసిన హారికా నారాయణ్
లెజెండరీ కీరవాణి గురించి ఆ మాటలేంటి? ఆపేస్తే బెటర్... వీడియో రిలీజ్ చేసిన హారికా నారాయణ్
Shine Tom Chacko: షైన్ టామ్ చాకోకు FEFKA ఫైనల్ వార్నింగ్... కావాలని చేయలేదంటూ విన్సీకి సారీ చెప్పిన యాక్టర్!
షైన్ టామ్ చాకోకు FEFKA ఫైనల్ వార్నింగ్... కావాలని చేయలేదంటూ విన్సీకి సారీ చెప్పిన యాక్టర్!
JD Vance visits Taj Mahal: తాజ్ మహల్ వద్ద సందడి చేసిన జేడీ వాన్స్ కుటుంబం, భార్య, పిల్లలతో సరదాగా కాలక్షేపం
తాజ్ మహల్ వద్ద సందడి చేసిన జేడీ వాన్స్ కుటుంబం, భార్య, పిల్లలతో సరదాగా కాలక్షేపం
NTR Statue: అమరావతిలో ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహం.. గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో
అమరావతిలో ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహం.. గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో
Skoda Car: ఈ SUVకి ఇంత డిమాండ్‌ ఏంటి బాసూ?, ఏకంగా 5 నెలల వెయిటింగ్ పిరియడ్‌
ఈ SUVకి ఇంత డిమాండ్‌ ఏంటి బాసూ?, ఏకంగా 5 నెలల వెయిటింగ్ పిరియడ్‌
Embed widget