అన్వేషించండి

AP Floods Amount: ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ

AP Floods | ఏపీలో వరద బాధితులకు సెప్టెంబర్ 25న వరద సాయం అందించనున్నారు. అయితే ఇటీవల ప్రకటించిన దాని కంటే పరిహారం ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జీవో జారీ చేశారు.

Flood Victims In Andhra Pradesh | అమరావతి: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన మొత్తం కంటే వరద బాధితులకు ఆర్థిక సాయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు (సెప్టెంబర్ 23న) ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో వరద బాధితులకు సెప్టెంబర్ 25న పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు.

179 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు ప్రకటించిన సాయాన్ని పెంచారు. ఎస్ఆర్ఎఫ్ రూ.11 వేలు నిర్దేశించగా.. ఏపీ ప్రభుత్వం ఆ సాయం మొత్తాన్ని రూ. 25 వేలకు పెంచింది. ఎస్ఆర్ఎఫ్ నిర్దేశించిన మొత్తం కంటే వరద బాధితులకు అదనంగా ఆర్థిక సాయం చేసేందుకుగానూ స్కేల్ ఆఫ్ ఫైనాన్సు మార్చుతూ రాష్ట్ర ఉత్తర్వులు ఇచ్చింది. ఆగస్టు నెలాఖరులో, సెప్టెంబర్ ప్రారంభంలో వచ్చిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వరద బాధితులకు సెప్టెంబర్ 17న సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా వరద ముంపు బాధితులకు ఆర్ధిక సాయం పెంచుతున్నట్లుగా రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.  

నష్టపరిహారంపై ఇటీవల ప్రభుత్వం ప్రకటన

రాష్ట్రంలో వరదలతో ప్రభావితం అయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం, ఇళ్లలోకి నీరు వచ్చిన ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేవారికి రూ.10 వేలు ఇస్తామని చంద్రబాబు ఇటీవల ప్రకటించడం తెలిసిందే. చిరు వ్యాపారులకు రూ.25 వేల చొప్పున, ఆటో వంటి మూడు చక్రాలు ఉండే వాహనాలకు రూ.10 వేలు, టూవీలర్స్‌ దెబ్బతిన్న వారికి రూ.3 వేలు ఇస్తామన్నారు.

వరదల్లో నష్టపోయిన ఒక్కో కోడికిగానూ రూ.100, కోళ్ల ఫారం షెడ్డు డ్యామేజీ అయిన వారికి రూ.5 వేలు పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. గొర్రెలకు రూ.7,500, ఎద్దులకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, ఎడ్ల బండి కోల్పోయిన వారికి కొత్తవి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. చేనేత కార్మికులకు రూ.15 వేలు, నష్టపోయిన సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు (MSME)ల్లో రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్‌ పరిధి వాటికి రూ.1లక్ష, అంతకుమించి టర్నోవర్‌ ఉన్న వాటికి రూ.1.5 లక్షలు పరిహారం ఇస్తామన్నారు. 

వ్యవసాయ రంగానికి సంబంధించి పరిహారం వివరాలు

వ్యవసాయానికి సంబంధించి ఒక హెక్టారు (2.47 ఎకరాలు) పత్తికి రూ.25 వేలు, వేరు శనగ అయితే రూ.15 వేలు, వరి ఎకరాకు రూ.10 వేలు, చెరకు రూ.25 వేలు పరిహారం ఇవ్వనున్నారు. పసుపు, అరటికి రూ.35 వేలు, మొక్క జొన్న, రాగులు, కొర్ర, సామలకు హెక్టారుకు రూ.15 వేలు, హెక్టార్‌ ఫిషింగ్‌ ఫామ్‌ డీసిల్టేషన్, రెస్టిరేషన్‌కు రూ.15 వేలు అందించనుంది ప్రభుత్వం. మత్స్యకారుల ఫిషింగ్‌ బోట్‌, వల పూర్తిగా దెబ్బతింటే రూ.20 వేలు, పాక్షికంగా దెబ్బ తింటే రూ.9 వేలు ఇస్తామన్నారు. సెరీ కల్చర్‌కు రూ.6 వేలు ఇస్తారు.

Also Read: Vijayawada floods: వరదలు నేర్పిన గుణపాఠం - పునరావృతం కాకుండా సన్నద్ధత ఎలా!, నిపుణులు ఏం చెబుతున్నారంటే?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Junior Doctors Stipend: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget