అన్వేషించండి

Andhra Pradesh Floods: కుట్రలు జరుగుతున్నాయేమో- చంద్రబాబు సంచలన కామెంట్స్

Chandra Babu: విజయవాడలో వరదసాయంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని పరిణామాలు చూస్తుంటే కుట్రలు జరుగుతున్నట్టు అనుమానంగా ఉందన్నారు.

Vijayawada Floods: వరద బాధితులకు సహాయం చేయడంలో అలసత్వం చేసిన అధికారులపై చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు... కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. వరద నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించినట్టు చెప్పారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా విజయవాడలోనే ఉందన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీళ్లు అందించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని.. పది జిల్లాల నుంచి వస్తుందన్నారు. ఏ ఒక్కరు కూడా ఆకలి దాహంతో ఇబ్బంది పడకూడదని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టు వివరించారు. 

కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరుతోపాటు వరద సాయం, వరదలు రావడంపై జరుగుతున్న ప్రచారం, ప్రభుత్వం స్కూల్స్‌లో ఫుడ్ పాయిజన్ ఇలా అన్నింటిపై కూడా ప్రభుత్వం మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నేరుగా చెప్పడం సంచలనంగా మారింది. 

ప్రజలు బాధల్లో ఉంటే ఆదుకోవాల్సిన వ్యక్తులు రాజకీయం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని కచ్చితంగా ఆఖరి బాధితుడిని ఆదుకునేందుకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రతి డివిజన్‌కు అధికారులను నియమించామని వారి ఫోన్ నెంబర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పాములు, తేళ్లు వస్తున్నట్టు ప్రజలు ఫోన్లు చేస్తున్నారని అలాంటి సమస్యలను అధికారులు వెంటనే అడ్రెస్ చేయాలని సీఎం సూచించారు. 

ప్రజలకు అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని చంద్రబాబు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో ఆహారం అందలేదని, నీళ్లు లేవని ఇలా రకరకాల సమస్యలు వస్తున్నాయని వాటిని వెంటనే అధికారులు అక్కడకు పంపించి సమస్య పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. టెక్నాలజీపై ఆధార పడటమే కాకుండా తానుకూడా స్వయంగా పరిశీలించి కొన్ని సమస్యలు తెలుసుకుంటున్నానని అన్నారు. 

ఇప్పటి వరకు అధికారులకు చెబుతూ వచ్చామని ఇకపై ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. ఇకపై ఎవర్నీ ఉపేక్షించేది లేదన్నారు. ఫిర్యాదులు వస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది మన ఫ్యామిలీకి వచ్చిన సమస్య అని అందరూ సహకరించాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చేతనైన సాయం చేయాలని సూచించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget