అన్వేషించండి

Vijayawada News : ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై వైసీపీ నేతలు దాడి, ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తారా? - ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

Vijayawada News : విజయవాడ రాణిగారితోటలో దాడికి గురైన మహిళను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరామర్శించారు. వైసీపీ నేతలే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Vijayawada News : కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర దాడికి గురైన మహిళను గద్దె రామ్మోహన్ పరామర్శించారు.  విజయవాడ రాణిగారితోటలో గత కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన మహిళ దేవినేని అవినాశ్ కు సమస్యలు చెబితే వారిపై వైఎస్సార్సీపీ నాయకులు దాడులు చేస్తారా? అంటూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. ఇంటిలో నిద్రిస్తున్న మహిళపై వైఎస్సార్సీపీ నేతలు దాడులు చేయడం ఎంత వరకు సబబు మండిపడ్డారు. ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ లేదా పార్టీ నాయకులు అయినా ప్రజల్లో పర్యటిస్తున్నప్పుడు స్థానికులు వారి సమస్యలు చెబుతారని, కొన్ని సందర్భాల్లో నిలదీస్తారని, ప్రజలు చెప్పిన సమస్యలను విని వాటిని పరిష్కరించాలే కానీ ఈ విధంగా సమస్యలు చెప్పిన వారిపై దాడులు చేసి వారిని భయభ్రాంతులను చేయడం సరికాదని గద్దె రామ్మోహన్ అన్నారు. దాడులు, దౌర్జన్యాలు చేసే వారినే మంచి నాయకుడిగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్ గుర్తించి ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గెలుపునకు పనిచేస్తే తమను ఎందుకు పట్టించుకోవడంలేదని అడిగినందుకే దాడులు చేశారని, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ ప్రోత్సాహంతోనే దాడి జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు.  

బాధితులు వైసీపీ వాళ్లే 

 వైసీపీ మహిళలు దాడి ఘటనలో పోలీస్ స్టేషన్ లో ఉన్న  బాధితులను వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి పరామర్శించారు. బాధితులు వైసీపీకి చెందినవాళ్లే  అని యలమంచలి రవి అన్నారు. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు వైసీపీ నేతలే కార్యకర్తలను కొట్టారని ఆరోపించారు. చాలా విషయాలు మాట్లాడుదామనుకున్నా అని, సొంత పార్టీ అవడం వల్ల మాట్లాడలేకపోతున్నా అన్నారు. సొంత పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తేనే కొడతారా? అని ప్రశ్నించారు. కొట్టినవాళ్లలో ఆ డివిజన్ మహిళల కన్నా వేరే ప్రాంతం వాళ్లు ఉన్నారనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రశ్నించారు కాబట్టే కొట్టారని, వాళ్లంతా వైసీపీలో పని చేసిన వారే అన్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ అంశాలన్నీ  తీసుకెళతా అన్నారు. 

కేసు వెనక్కి తీసుకోమని బెదిరింపులు 

కృష్ణలంక పోలీస్టేషన్ లో బాధితులను పరామర్శించారు జనసేన నేత పోతిన వెంకట మహేష్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజయవాడ రసవత్తరంగా రాజకీయం జరుగుతుందన్నారు. గడపగడపకూ వెళ్లి వైసీపీ నేతలు ప్రజలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో  వెల్లంపల్లిని గతంలో చూశామని, తూర్పు నియోజకవర్గంలో  ఇప్పుడు ఇలాంటి దాడి చేశారన్నారు. పెన్షన్ అడిగితే ఇళ్ల మీద పడి కొడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్ రౌడీయిజాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఇంత బహిరంగంగా దాడి చేస్తుంటే పోలీసు కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఇటీవలే అవినాశ్ కి మద్దతు ఇవ్వాలన్నారని, ఇలా దాడులు చేస్తే ప్రజలు మీకు ఎలా మద్దతు ఇస్తారన్నారు. గాయాలతో బాధితులు పోలీస్టేషన్ లో ఉంటే వాలంటీర్ తో ఫోన్ చేయించి  బెదిరించారని ఆరోపించారు. కేసు వెనక్కి తీసుకోకపోతే ఫాతిమా, రమీజాల ఇల్లు రద్దు చేస్తామని బెదిరించారన్నారు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి  ప్రజా పాలన అని నిలదీశారు. ప్రజలు తప్పకుండా జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని పోతిన మహేశ్ అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Janasena Rajya Sabha Nominee Lingamaneni Ramesh: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ - అధికారిక ప్రకటన
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ - అధికారిక ప్రకటన

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget