అన్వేషించండి

Ysrcp: నిరాహార దీక్షలో కూర్చున్న వంగవీటి రంగాను చంపించామా? చంద్రబాబుపై శ్రీకాంత్ హాట్ కామెంట్స్

వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తుంటే టీడీపీ నేతలకు ఎందుకంత భయమని ప్రభుత్వ చీఫ్ విప్ గండి కోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

పేదలకు మంచి చేయాలని నిరంతరం ఆలోచన చేసే నేత సీఎం జగన్‌(CM Jagan) ఆలోచిస్తుంటే కృష్ణా నది కరకట్ట పక్కన, అక్రమంగా నిర్మించిన ఒక భవనంలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) ఇప్పుడు అదే భవనం నుంచి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) ఆరోపించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం, నిందించడం అదే వారి ఎజెండా అని విమర్శించారు. ఇవాళ వివేకానంద హత్య మీద అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేస్తుంటే, అది పూర్తి కాకముందే రోజుకొక కథనం, లీక్‌లు చేస్తూ ప్రభుత్వంపై నిందలు వేయడం, బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఆ దర్యాప్తుకు సహకరిస్తోందన్నారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ(TDP) రాష్ట్రంలోకి అసలు సీబీఐని అడుగు పెట్టనివ్వబోమని అన్నారు. కానీ ఇవాళ అదే సంస్థను పొగుడుతుందని విమర్శించారు. 

సీబీఐ(CBI) అధికారి రామ్‌సింగ్‌పై ఫిర్యాదు చేయించి, కేసు నమోదు చేయించారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడొకరు ఆరోపించారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ కేసుతో ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. గత నెల 27న గజ్జెల ఉదయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి సీబీఐ అధికారి రాంసింగ్‌పై ఫిర్యాదు చేశారు. అయినా కేసు ఫైల్‌ చేయకపోవడంతో ఈనెల 15న మరో ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు చర్య తీసుకోకపోతే, కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు రాంసింగ్‌పై కేసు నమోదు చేస్తే, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇది కోర్టు ఉల్లంఘన కాదా? కోర్టును అవమానించినట్లు కాదా? అని ప్రశ్నించారు. 

కేబినేట్ మంత్రి హఠాన్మరణం చెందితే, ఆయన మృతిపై అన్యాయంగా మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. 'వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని హత్య చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీ మాదిరిగా నిరాహార దీక్షలో కూర్చున్న వంగవీటి రంగాను చంపించామా? పింగళి దశరథరామ్‌ అనే ఒక విలేకరిని హత్య చేశారు. ఒక ప్రజా నాయకుడిని బతికుండగానే హింసించి చంపారు. మీరు చేసినవి క్రిమినల్‌ ఆలోచనలు. కానీ మీరు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. నిజానికి చనిపోయింది మా నాయకుడి చిన్నాన్న. ఆయన హత్య కేసులో నిందితులను గుర్తించాలని కోరుకుంటున్నాం. ఒక కన్ను ఇంకో కన్నుకు హాని చేయాలని చూడదని సీఎం చాలాసార్లు చెప్పారు. ఆయన మరణం వల్ల నష్టం జరిగింది మాకే. అయినా మీరు ఎందుకు మాపై బురద చల్లుతున్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నా ఆరోపణలకు మీరు సమాధానం చెప్పండి. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది.' అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 

'వివేకానందరెడ్డి మరణం గురించి ఆయన బావమరిది అవినాష్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పారు. ఆయన గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. అవన్నీ రికార్డులో ఉన్నాయి. అయినా మాపై ఎందుకు బురద చల్లుతున్నారు. మేము వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నాం. అంతేకానీ కేసును తప్పుదోవ పట్టించాలని అనుకోవడం లేదు. కానీ మీరు అనుమానాలకు తావిస్తూ ఏదేదో జరుగుతుందని రాస్తున్నారు. ఎందుకు ఆరోజు లేఖ సాయంత్రం వరకు బయటకు రాలేదు? ఆరోజు కేసును తప్పుదోవ పట్టించాలని చూసిందెవ్వరు?. దస్తగిరి స్టేట్‌మెంట్‌ అధికారికంగా బయటకు రాలేదు. కానీ దాన్ని మీరు ఎలా రాశారు. ఎలా మాట్లాడారు. ఈ కేసు గురించి మీకు ఎందుకంత భయం? మాపై ఎందుకు బురద చల్లుతున్నారు. మీకు అన్నీ దుర్మార్గమైన ఆలోచనలు వస్తున్నాయి. సీబీఐ అధికారి రాంసింగ్‌పై కేసు నమోదులో ప్రభుత్వ ప్రమేయం ఏముంటుంది? ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని మీరు కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది. బయట అలా మాట్లాడించి, లోపల ఏం చేస్తారో అన్న భయం మాకు కలుగుతుంది.' అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Janasena Rajya Sabha Nominee Lingamaneni Ramesh: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ - అధికారిక ప్రకటన
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ - అధికారిక ప్రకటన
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget