అన్వేషించండి

Ysrcp: నిరాహార దీక్షలో కూర్చున్న వంగవీటి రంగాను చంపించామా? చంద్రబాబుపై శ్రీకాంత్ హాట్ కామెంట్స్

వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తుంటే టీడీపీ నేతలకు ఎందుకంత భయమని ప్రభుత్వ చీఫ్ విప్ గండి కోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

పేదలకు మంచి చేయాలని నిరంతరం ఆలోచన చేసే నేత సీఎం జగన్‌(CM Jagan) ఆలోచిస్తుంటే కృష్ణా నది కరకట్ట పక్కన, అక్రమంగా నిర్మించిన ఒక భవనంలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) ఇప్పుడు అదే భవనం నుంచి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) ఆరోపించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం, నిందించడం అదే వారి ఎజెండా అని విమర్శించారు. ఇవాళ వివేకానంద హత్య మీద అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేస్తుంటే, అది పూర్తి కాకముందే రోజుకొక కథనం, లీక్‌లు చేస్తూ ప్రభుత్వంపై నిందలు వేయడం, బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఆ దర్యాప్తుకు సహకరిస్తోందన్నారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ(TDP) రాష్ట్రంలోకి అసలు సీబీఐని అడుగు పెట్టనివ్వబోమని అన్నారు. కానీ ఇవాళ అదే సంస్థను పొగుడుతుందని విమర్శించారు. 

సీబీఐ(CBI) అధికారి రామ్‌సింగ్‌పై ఫిర్యాదు చేయించి, కేసు నమోదు చేయించారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడొకరు ఆరోపించారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ కేసుతో ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. గత నెల 27న గజ్జెల ఉదయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి సీబీఐ అధికారి రాంసింగ్‌పై ఫిర్యాదు చేశారు. అయినా కేసు ఫైల్‌ చేయకపోవడంతో ఈనెల 15న మరో ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు చర్య తీసుకోకపోతే, కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు రాంసింగ్‌పై కేసు నమోదు చేస్తే, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇది కోర్టు ఉల్లంఘన కాదా? కోర్టును అవమానించినట్లు కాదా? అని ప్రశ్నించారు. 

కేబినేట్ మంత్రి హఠాన్మరణం చెందితే, ఆయన మృతిపై అన్యాయంగా మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. 'వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని హత్య చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీ మాదిరిగా నిరాహార దీక్షలో కూర్చున్న వంగవీటి రంగాను చంపించామా? పింగళి దశరథరామ్‌ అనే ఒక విలేకరిని హత్య చేశారు. ఒక ప్రజా నాయకుడిని బతికుండగానే హింసించి చంపారు. మీరు చేసినవి క్రిమినల్‌ ఆలోచనలు. కానీ మీరు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. నిజానికి చనిపోయింది మా నాయకుడి చిన్నాన్న. ఆయన హత్య కేసులో నిందితులను గుర్తించాలని కోరుకుంటున్నాం. ఒక కన్ను ఇంకో కన్నుకు హాని చేయాలని చూడదని సీఎం చాలాసార్లు చెప్పారు. ఆయన మరణం వల్ల నష్టం జరిగింది మాకే. అయినా మీరు ఎందుకు మాపై బురద చల్లుతున్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నా ఆరోపణలకు మీరు సమాధానం చెప్పండి. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది.' అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 

'వివేకానందరెడ్డి మరణం గురించి ఆయన బావమరిది అవినాష్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పారు. ఆయన గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. అవన్నీ రికార్డులో ఉన్నాయి. అయినా మాపై ఎందుకు బురద చల్లుతున్నారు. మేము వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నాం. అంతేకానీ కేసును తప్పుదోవ పట్టించాలని అనుకోవడం లేదు. కానీ మీరు అనుమానాలకు తావిస్తూ ఏదేదో జరుగుతుందని రాస్తున్నారు. ఎందుకు ఆరోజు లేఖ సాయంత్రం వరకు బయటకు రాలేదు? ఆరోజు కేసును తప్పుదోవ పట్టించాలని చూసిందెవ్వరు?. దస్తగిరి స్టేట్‌మెంట్‌ అధికారికంగా బయటకు రాలేదు. కానీ దాన్ని మీరు ఎలా రాశారు. ఎలా మాట్లాడారు. ఈ కేసు గురించి మీకు ఎందుకంత భయం? మాపై ఎందుకు బురద చల్లుతున్నారు. మీకు అన్నీ దుర్మార్గమైన ఆలోచనలు వస్తున్నాయి. సీబీఐ అధికారి రాంసింగ్‌పై కేసు నమోదులో ప్రభుత్వ ప్రమేయం ఏముంటుంది? ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని మీరు కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది. బయట అలా మాట్లాడించి, లోపల ఏం చేస్తారో అన్న భయం మాకు కలుగుతుంది.' అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget