అన్వేషించండి

TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో నోటీసులు అందాయని ప్రకటించిన వైసీపీ ఎంపీ

TRS MLAs Poaching Case: తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో తనకు సిట్ నోటీసులు అందాయని ఏపీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వెల్లడించారు. 

TRS MLAs Poaching Case: మోయినాబాద్ ఫాం హౌస్ వ్యవహారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనకు తెలంగాణ సిట్ నోటీసులు అందాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. దిల్లీలోని తన నివాసంలో సిట్ నోటీసులు అందజేశారని వివరించారు ఈ కేసుకు సంబంధించి ఈనెల 29వ తేదీన బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా ఎంపీ రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే రామచంద్ర భారతి, నందుతో రఘురామకు పరిచయం ఉన్నట్లుగా సిట్‌ ఆధారాలు గుర్తించింది. 

హాజరుకాకపోతే సీఆర్పీ కింద అరెస్ట్ చేస్తాం..

ఇప్పటికే ఈ కేసులో రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ నిందితులుగా ఉండగా... జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు డా. జగ్గుస్వామి, బీడీజేఏస్ నేత తుషార్, కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్ ను నిందితల జాబితాలో సిట్ కొత్తగా చేర్చింది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గుస్వామి సోదరుడితోపాటు సిబ్బందికి నోటీసులిచ్చింది. జగ్గుస్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్‌కు నోటీసులు జారీ చేసింది. జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం 41-ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సిట్.. ఈసారి కూడా హాజరుకాకపోతే 41-ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించింది.

ఇప్పటికే నందకుమార్ భార్యతోపాటు మరో లాయర్ ప్రతాప్‌కూ సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్‌ తనకు 41ఏ నోటీసు జారీ చేసిందని, అరెస్టు చేయకుండా సిట్‌కు ఆదేశాలు ఇవ్వాలని ప్రతాప్‌ హైకోర్టును ఆశ్రయించారు. సిట్‌ దర్యాప్తునకు ప్రతాప్‌ సహకరించాలని ప్రతాప్‌ను అరెస్టు చేయరాదని సిట్‌ను హైకోర్టు ఆదేశిచింది. ఈ కేసులో సీవీ ఆనంద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ పేరును  నిందితుల జాబితాలో చేర్చింది.  జగ్గుస్వామి, తుషార్‌ వెళ్లపల్లి,  న్యాయవాది బీ శ్రీనివాస్‌ను కూడా నిందితులుగా సిట్‌ చేర్చింది. ఈ మేరకు సిట్‌ కేసులను విచారించే ఏసీబీ కోర్టుకు నివేదిస్తూ మెమో దాఖలు చేసింది. 

జైల్లో ఉన్న నిందితుల్ని మరోసారి కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ 

రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ ఇప్పటికే అరెస్టయ్యారు. వీరు  గత 25 రోజులుగా జైల్లో ఉన్నారు.ముగ్గురు నిందితులు మాట్లాడిన ఆడియో, వీడియోల్లో పలుమార్లు బీఎల్‌ సంతోష్‌, జగ్గుస్వామి, తుషార్‌ పేర్లు ప్రస్తావించినట్లు ఆధారాలు ఉన్నాయని సిట్‌ హైకోర్టు విచారణ సందర్భంగా చెప్పింది. అయితే ఈ ముగ్గుర్ని మరోసారి కస్టడీలోకి తీసుకోవాలనుకున్న సిట్ ప్రయత్నాలు ఫలించలేదు.  ముగ్గురు నిందితులను సిట్‌ కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు నిరాకరించింది. మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి ఇచ్చినందున సిట్‌ అభ్యర్థనను ఆమోదించలేకపోతున్నట్టు ఏసీబీ కోర్టు జడ్జి రాజగోపాల్‌ తెలిపారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget