అన్వేషించండి

Tirupati News: రంగంపేట ఘటనలో ట్విస్ట్, నటుడు మోహన్ బాబుకు ఏ సంబంధం లేదన్న ఎంపీటీసీ, ఉప సర్పంచ్

Rangampeta MPTC gives clarity on Actor Mohan Babu: తమపై దాడి ఘటనలో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మోనీష్ రెడ్డి చెబుతున్నారు.

Rangampeta MPTC gives clarity on Actor Mohan Babu: తిరుపతి: చంద్రగిరి మండలం ఏ.రంగంపేట ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎంపీటీసీ, ఉప సర్పంచ్ యూటర్న్ తీసుకున్నారు. తమపై దాడి ఘటనలో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మోనీష్ రెడ్డి చెబుతున్నారు. పొరపాటున మోహన్ బాబు పేరు చెప్పాం, బౌన్సర్లను అనుమానించాల్సి వచ్చిందన్నారు. అయితే తమపై దాడికి పాల్పడిన వారు గతంలో మోహన్ బాబు యూనివర్సిటీలో పనిచేశారని తెలిపారు. తమ ప్రాంత అభివృద్ధికి మోహన్ బాబు పాటుపాడుతున్నారు. కానీ కొందరు ఎందుకు తమపై దాడి చేశారో పోలీసుల విచారణలో తేలాల్సి ఉందని ఎంపీటీసీ, ఉప సర్పంచ్ చెప్పారు.

తమపై దాడి చేసిన వారిని పట్టుకోగా, ఒకరి ఫోన్ లో చెక్ చేయగా విద్యానికేతన్ లో పనిచేసిన మాజీ ఉద్యోగి అని తేలింది. దాంతో పెద్దాయన మోహన్ బాబుకు సంబంధం ఉందని భావించాం. ఈ విషయంలో తప్పిదం జరిగింది. దాడి చేసిన వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో ఉన్నారని విచారణలో తేలుతుందన్నారు. సతీష్ అనే విద్యానికేతన్ మాజీ ఉద్యోగి తమపై దాడి చేశాడని ఆరోపించారు. మోహన్ బాబుతో గానీ, ఆయన తనయుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణుతో విభేదాలు లేవని.. వారి వద్ద పనిచేసిన మాజీ ఉద్యోగి దాడి చేయడంతో పొరపాటున నటుడి పేరు చెప్పి తప్పిదం చేసినట్లు వివరించారు.

మోహన్ బాబు అనుచరులు మా హత్యకు కుట్ర చేశారని ఆరోపణలు, అంతలోనే ట్విస్ట్!
నటుడు మోహన్ బాబు అనుచరులు తమ హత్యకు కుట్ర చేశారని చంద్రగిరి మండలం, రంగంపేట ఎంపీటీసీ సభ్యులు బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మౌనిష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి మారుతి నగర్ లో నివాసం ఉంటున్న ఎంపీటీసీ సభ్యుడు‌ బోస్ చంద్రారెడ్డిని హత మార్చేందుకు ఆరుగురు దుండగులు విఫలయత్నం చేశారని బాధితులు ఆరోపణ చేశారు. వారిలో హేమంత్ అనే యువకుడిని పట్టుకొని బోస్ చంద్రారెడ్డి అనుచరులు చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. కానీ మధ్యాహ్నానికి పరిస్థితి మారిపోయింది. మోహన్ బాబుకు ఏ సంబంధం లేదని, బాధ్యులు ఎవరన్నది విచారణలో పోలీసులు తేల్చుతారని చెప్పారు.

చంద్రగిరిలోని మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్, మంచు అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి.. నిందితులకు ఫోటోలు పంపించి రూ.3 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా పంపారని ఆరోపించారు. పోలీసుల ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీసులు రంగంపేట చేరుకుని నిందుతుడు హేమంత్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కర్రలు, కత్తి, పెట్రోల్ స్వాధీనం చేసుకున్నారు. సినీ నటుడు మోహన్ బాబు, పీఆర్వో సతీష్, సునీల్ చక్రవర్తి వల్ల మాకు ప్రాణహాని ఉందని బోస్ చంద్రారెడ్డి ఆరోపించారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని చంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

భూమి విషయంలోనే..
ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. నాగపట్నం సర్వే నెంబర్ 10.2లో 35 సెంట్ల భూమిపై మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వహకులు కన్నేశారు. ఆ భూమిపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరామని మాపై నిర్వహకులు కక్ష్య పెంచుకున్నారు. 8 కోట్ల విలువైన భూమిపై సహ చట్టం కింద వివరాలు సేకరిస్తున్నామని మాపై గతంలోనూ దాడికి యత్నించారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ భూమిలో ఏవో పనులు జరుగుతున్నాయి.. ఎవరికైనా కేటాయించారా అని నిన్న కూడా మేం సహ చట్టం కింద దరఖాస్తు చేశాం. దాంతో ఆ భూములు తమకు రాకుండా అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతో వారు మమ్మల్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని రంగంపేట ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి ఆరోపణలు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget