అన్వేషించండి

Tirumala News: టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం, కుట్రతోనే చేశారా?

Tirumala news: తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన పరిపాలన భవనం లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా లేక నిజంగా ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

TTD News: ఏపీలో ఈ మధ్య విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరిగి ముఖ్యమైన ఫైల్స్ మాత్రమే కాలిపోయే స్కీమ్ నడుస్తుంది. గడిచిన మూడు నెలల కాలంలో ఏపీ లో జరుగుతున్న ప్రమాదాల పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో అగ్ని ప్రమాదం జరిగితే ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలు, అందులోని వస్తువులు ఇలా ఆస్తి నష్టమో లేదా కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టమో జరిగేది. కాని ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు మాత్రం కేవలం ఫైల్స్ మాత్రమే కాలిపోయి సాక్షం లేకుండా అయ్యేలా ప్రమాదాలు జరుగుతుండడం గమనార్హం. ఇలాంటి ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్ గా దృష్టి పెట్టింది.

మొన్న అమరావతి, నిన్న మదనపల్లి, దవళేశ్వరం కార్యాలయం.. నేడు తిరుపతి... అగ్ని ప్రమాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానం లో అనేక అవకతవకలు జరిగాయని, తిరుమలను కూడా వ్యాపార కేంద్రంగా మార్చారని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఎనలేని మెజారిటీతో గెలిపించారు. ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తిరుమల కు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని చెప్పారు. అందుకు తగిన రీతిలో  అప్పటి వరకు ఈవో లేకపోవడంతో కొత్త ఈవో నియామకం, అదనపు ఈవో గా ఉన్న ఏవీ ధర్మారెడ్డి ను పంపివేయడం... కొత్తగా తిరుమల అదనపు ఈవో నియామకం చేయడం... సీవీఎస్వో సహా అందరినీ మార్చడం చేశారు. ఇలా ప్రారంభమైన ప్రక్షాళన గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక ఇంజినీరింగ్ పనులు, రీవర్స్ టెండర్స్, శ్రీవాణి ట్రస్ట్ నిధులపై రాష్ట్ర స్థాయి విజిలెన్స్ విభాగం చేత విచారణ ప్రారంభించారు. టీటీడీ లాంటి పుణ్యక్షేత్రం లో విజిలెన్స్ విచారణ అంటేనే దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు
టీటీడీ లో గత ప్రభుత్వంలో జరిగిన అనేక ఇంజినీరింగ్ పనులకు సంబంధించి వివరాలు ఇవ్వని, సరైన పత్రాలు చూపించని టీటీడీ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన 55 మంది ఇంజనీర్లకు రాష్ట్ర విజిలెన్స్ విభాగం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దానిపై ఇంజినీరింగ్ యూనియన్ సభ్యులు స్థానిక నాయకులను, అధికారులను సైతం కలిసారు. వారు నుంచి సానుకూలంగా స్పందించినా ఈనెల 14న సమావేశం నిర్వహించి అవసరమైతే సమ్మె చేసేందుకు నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. అయితే సమావేశం వాయిదా పడింది. రెండు రోజుల వ్యవధిలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది.

దీపం పడి ఫైల్స్ కాలిపోయాయి..
టీటీడీ పరిపాలన భవనంలో శనివారం సాయంత్రం ఇంజినీరింగ్ విభాగం డిప్యూటీ ఇంజినీర్ భాస్కర్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు కీలక ఫైల్స్ దగ్థం అయ్యాయి. గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించి టీటీడీ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిని ఆర్పివేసారు. అయితే ఎలా ప్రమాదం జరిగిందని అధికారులను అడిగితే ప్రతిరోజు పూజించే దీపం పడి ప్రమాదం జరిగిందేమే అని అంటున్నారు. 

టీటీడీ పరిపాలన భవనం ఇటీవల కాలంలో రినోవేషనే చేశారు. అన్ని విభాగాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాంటి టీటీడీ పరిపాలన భవనంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు. మరీ దీపం పడి ఫైల్స్ మాత్రమే కాలిపోవడం ఏంటని ప్రశ్న వినిపిస్తుంది. సమాచారం అందుకున్న టీటీడీ ఉన్నతాధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆ గదిలో ఏఏ రికార్డులు ఉన్నాయి.. అవి ఈ ఫైలింగ్ లో ఉన్నాయా లేదా... అసలు ప్రమాదానికి కారణం ఏంటి... ఏదైన కుట్ర కోణం ఉందా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Arava Sridhar: పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Embed widget