అన్వేషించండి

TTD EO: తిరుమల లడ్డూ కల్తీ- టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌ బదిలీ, నెక్ట్స్ ఏంటీ?

TTD EO Anil kumar Singhal transfer | తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేశారు.

Tirumala Laddu Adulteration | తిరుమల: తిరుమల లడ్డూ కల్తీ అంశలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (TTD EO)  అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అనిల్ కుమార్ సింఘాల్‌ను సాధారణ పరిపాలన శాఖ (GAD)లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులలో ఆదేశించారు.

అనిల్ కుమార్ సింఘాల్ 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలోనూ ఆయన టీటీడీ ఈవోగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 2017 మే 6 నుండి 2020 అక్టోబర్ 4 వరకు మొదటి విడతలో టీడీపీ, వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర సర్వీసులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆయనను రెండోసారి టీటీడీ ఈవోగా నియమించడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో అనిల్ సింఘాల్ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో టీటీడీ పాలనలో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. గతంలో ఆయన టీటీడీ ఈవోగా చేయడం, ఆ సమయంలో లడ్డూ కల్తీ ఆరోపణలతో అనిల్ సింఘాల్‌ను బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్ చేయాలని సూచించారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీపై ప్రత్యేక విచారణ బృందం (SIT) ఇటీవల తన తుది నివేదికను (ఛార్జ్ షీట్) సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి నిప్పు రాజుకుంది.

సిట్ నివేదికలోని ముఖ్యాంశాలు

సిట్ తన ఛార్జ్ షీట్‌లో తిరుమలకు నెయ్యి సరఫరాలో భారీ అవకతవకలు జరిగినట్లు పేర్కొంది. సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేయడం ద్వారా రూ. 250 కోట్ల కుంభకోణం జరిగిందని వెల్లడించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన భోలే బాబా డెయిరీతో పాటు ఇతర కంపెనీలు నకిలీ సీల్స్, తప్పుడు ల్యాబ్ రిపోర్టులతో టీటీడీని మోసం చేసినట్లు గుర్తించింది. అయితే, తాజా నివేదికలో జంతువుల కొవ్వు (Animal Fat) ఆనవాళ్లు లేవని పేర్కొంది. కానీ పామాయిల్, కెమికల్ ఎస్టర్స్ వంటి ఇతర పదార్థాలతో నెయ్యిని కల్తీ చేసినట్లు పేర్కొన్నట్లు వార్తలు రావడంతో చర్చ మొదలైంది.

టీడీపీ vs వైసీపీ మాటల యుద్ధం

టీడీపీ ఆరోపణలు

 గత వైసీపీ ప్రభుత్వం కావాలనే నిబంధనలు సడలించి, తమకు అనుకూలమైన డెయిరీలకు కాంట్రాక్టులు ఇచ్చిందని టీడీపీ విమర్శిస్తోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్న ఎన్డీడీబీ (NDDB) నివేదికను గుర్తు చేస్తూ, సిట్ నివేదిక కల్తీని ధృవీకరించిందని, ఇది ముమ్మాటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

వైసీపీ  స్ట్రాంగ్ రియాక్షన్

 సిట్ నివేదికలో జంతు కొవ్వు లేదని తేలడంతో వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. సీఎం చంద్రబాబు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దేవుడిని వాడుకున్నారని, అబద్ధపు ప్రచారంతో భక్తులను అయోమయానికి గురిచేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. క్లీన్ చిట్ లభించిందని వైసీపీ నేతలు వాదిస్తుంటే, కల్తీ జరిగిందని సిట్ స్పష్టంగా చెప్పిందని టీడీపీ సహా కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో, అసలు దోషులు ఎవరో తేల్చి కఠిన శిక్ష వేయాలని భక్తులు కోరుకుంటున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Arava Sridhar: పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
Advertisement

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget