అన్వేషించండి

Tirumala Updates: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల‌ రద్దీ, శ్రీవారి దర్శనానికి ఎంత టైమ్ పడుతోందంటే !

Tirumala News: తిరుమలను సోమవారం 10-10-2022 రోజున 83,223 మంది స్వామి వారి దర్శించుకున్నారు. భక్తులు 4.73 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ కొనసాగుతుంది. ప్రతి మంగళవారం స్వామి వారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం 10-10-2022 రోజున 83,223 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 36,658 మంది తలనీలాలు సమర్పించగా, 4.73 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయి బయట క్యూలైన్స్ లో శిలాతోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. 
తోమాల, అర్చన సేవలు.. నవనీత హారతి
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం (మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. 
అష్టదళపాద పద్మారాధన
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండో గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవ విశేషం. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. 
ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Whatsapp Accounts Hacked: తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
New Labour Laws Gratuity: ఉద్యోగుల గ్రాట్యుటీపై గుడ్‌న్యూస్.. ఓవర్ టైమ్ కు రెట్టింపు డబ్బు.. కొత్త లేబర్ చట్టంలో మార్పులివే
ఉద్యోగుల గ్రాట్యుటీపై గుడ్‌న్యూస్.. ఓవర్ టైమ్ కు రెట్టింపు డబ్బు.. కొత్త లేబర్ చట్టంలో మార్పులివే
Pawan kalyan: కొబ్బరి రైతులకు గుడ్ న్యూస్! రాజోలులో పవన్ కళ్యాణ్ పర్యటన: శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు?
కొబ్బరి రైతులకు గుడ్ న్యూస్! రాజోలులో పవన్ కళ్యాణ్ పర్యటన: శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు?
DCC Presidents In Telangana: తెలంగాణలో 33 జల్లాలకు డిసిసి అధ్యక్షుల నియామకం, 3 కార్పోరేషన్లకు సైతం
తెలంగాణలో 33 జల్లాలకు డిసిసి అధ్యక్షుల నియామకం, 3 కార్పోరేషన్లకు సైతం
Advertisement

వీడియోలు

India vs South Africa 2nd Test Match Highlights | మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్
England vs Australia Ashes 2025 | ఆస్ట్రేలియా ఘన విజయం
Travis Head Records in Ashes 2025 | ట్రావిస్ హెడ్ రికార్డుల మోత
Shreyas Iyer Injury IPL 2026 | టీ20 ప్రపంచకప్‌ కు అయ్యర్ దూరం ?
Why South Africa Bow down to PM Modi | వైరల్ గా మారిన ప్రధాని మోదీ ఆహ్వాన వేడుక | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Whatsapp Accounts Hacked: తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
New Labour Laws Gratuity: ఉద్యోగుల గ్రాట్యుటీపై గుడ్‌న్యూస్.. ఓవర్ టైమ్ కు రెట్టింపు డబ్బు.. కొత్త లేబర్ చట్టంలో మార్పులివే
ఉద్యోగుల గ్రాట్యుటీపై గుడ్‌న్యూస్.. ఓవర్ టైమ్ కు రెట్టింపు డబ్బు.. కొత్త లేబర్ చట్టంలో మార్పులివే
Pawan kalyan: కొబ్బరి రైతులకు గుడ్ న్యూస్! రాజోలులో పవన్ కళ్యాణ్ పర్యటన: శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు?
కొబ్బరి రైతులకు గుడ్ న్యూస్! రాజోలులో పవన్ కళ్యాణ్ పర్యటన: శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు?
DCC Presidents In Telangana: తెలంగాణలో 33 జల్లాలకు డిసిసి అధ్యక్షుల నియామకం, 3 కార్పోరేషన్లకు సైతం
తెలంగాణలో 33 జల్లాలకు డిసిసి అధ్యక్షుల నియామకం, 3 కార్పోరేషన్లకు సైతం
Ind vs SA Odi Series: టీమిండియాకు డబుల్ షాక్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు గిల్ సహా మరో స్టార్ బ్యాటర్ దూరం !
టీమిండియాకు డబుల్ షాక్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు గిల్ సహా మరో స్టార్ బ్యాటర్ దూరం !
AR Rahman: మతం పేరుతో చంపడమే సమస్య... ఇస్లాంలోకి ఎందుకు వెళ్లారో చెప్పిన ఏఆర్ రెహమాన్
మతం పేరుతో చంపడమే సమస్య... ఇస్లాంలోకి ఎందుకు వెళ్లారో చెప్పిన ఏఆర్ రెహమాన్
AP Rains Latest News: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఏపీలో ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు.. రైతులకు జాగ్రత్తలు
అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఏపీలో ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు.. రైతులకు జాగ్రత్తలు
Nargis Fakhri: హీరోయిన్‌కు కోట్లు ఖరీదు చేసే కారు గిఫ్ట్‌... పుట్టినరోజున సర్‌ప్రైజ్ ఇచ్చింది ఎవరంటే?
హీరోయిన్‌కు కోట్లు ఖరీదు చేసే కారు గిఫ్ట్‌... పుట్టినరోజున సర్‌ప్రైజ్ ఇచ్చింది ఎవరంటే?
Embed widget