అన్వేషించండి

Madanapalli News: మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక

Madanapalli News: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగిన ఫైల్స్ దగ్థం కేసులో తొలి అరెస్ట్ నమోదైంది. ఆరు నెలల తరువాత చోటు చేసుకున్న ఈ పరిణామం తో మరెందరు అరెస్టు అవుతారో చూడాలి

Madanapalli sub collectorate News: మదనపల్లి: చిన్నపాటి ప్రమాదం అనుకున్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కదలాల్సి వచ్చింది. అప్పటివరకు ప్రమాదం అనుకున్న వారే ఇది ప్రమాదం కాదు కుట్ర కోణం అనేది తెరమీదకు వచ్చింది. ఆరు నెలల పాటు సాగిన విచారణ లో తొలి అరెస్ట్ నమోదైంది. ఇంకా ఎంత మంది పై చర్యలు ఉంటాయో అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం..

అది మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం.. రాష్ట్ర మొత్తం కూటమి ప్రభుత్వం భారీ విజయం తో సంబరాలు చేసుకుని ఎప్పుడు ఎప్పుడు తమ నాయకులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఎదురుచూస్తున్న రోజు. అదే జూలై 21వ తేదీ 2024.. సరిగ్గా అదే రోజు వేకువజామున అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలోని ఫైల్స్ ఉండే గదిలో మంటలు చెలరేగి భూములకు సంబంధించిన పలు రికార్డులు అగ్గి కి ఆహుతి అయ్యాయి. ఇదంతా ప్రమాదం అనుకున్నారు. అదే కోణంలో చూశారరు.

డీజీపీని అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

ఏపీ అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఆయన అందులో ఏదో కుట్ర కోణం దాగి ఉందని గ్రహించి వెంటనే రాష్ట్ర డీజీపీని, సీఐడీ చీఫ్ ను హెలికాప్టర్ ద్వారా మదనపల్లెకి పంపారు. అంతే రాష్ట్రం మొత్తం అసెంబ్లీ టూ మదనపల్లె వైపు చూసింది. పోలీస్ శాఖ లోని పలు విభాగాలు వివిధ కోణాల్లో విచారణ చేసి ఇది ప్రమాదం కాదు... కుట్ర కోణం గా భావిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు.

6 నెలలు విచారణ

ప్రమాదం జరిగింది సోమవారం వేకువజామున. ఆదివారం కార్యాలయం సెలవు ఉంటుంది. అయిన కూడా అక్కడీపని చేసే సీనియర్ అసిస్టెంట గౌతమ్ తేజ ఆదివారం రాత్రి వరకు కార్యాలయంలో ఉన్నట్లు గుర్తించారు. ఘటన జరిగిన వారం ముందు నుంచి సీసీ కెమెరాలు కూడా పని చేయలేదు. దీంతో మొత్తం 9  కేసులు నమోదు చేసిన విచారణ ప్రారంభించారు.  ఆగస్టు 6న సీఐడీ అధికారులకు కేసు ను అప్పగించారు. సీఐడీ చేతికి ఫైల్స్ చేరినప్పటి నుంచి కేసు విచారణ వేగం పెంచుకుందాం. సుమారు ఆరు నెలల పాటు సాగిన విచారణ లో ఇందులో కీలకంగా ఉన్న వ్యక్తులను అనుమానితులు గా చేర్చారు.

వైసీపీ నాయకుల పాత్రపై అనుమానాలు

గత ప్రభుత్వ హయాంలో స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సాహంతో ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారుల సహకారంతో వేల ఎకరాలు వైసీపీ నాయకులు, వారి బంధువుల పేరుతో మార్చారని అధికార కూటమి పార్టీ ఆరోపణలు చేసింది. అదే నిజం అనేలా పుంగనూరు పరిధిలోని అటవీ శాఖ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల పేరు పైకి మార్పు చేసినట్లు ప్రకటించారు. ఇలాంటి అనేక ఎకరాల విలువైన భూములను ఆక్రమించి అది బయట పడుతుందనే ఈ మదనపల్లె ఫైల్స్ ప్రమాదం జరిగిందనేది పోలీసులు కేసు నమోదు చేసిన వాటిలోని వెనుక కథ.

ఈ కేసులో ప్రదానంగా ఉన్న వారిని ఇప్పుటికే పలు దఫాలు విచారణ చేశారు. కొందరి ఇళ్ళల్లో సోదాలు చేసి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అధికారులు, స్థానిక నాయకులు, మీడియా సంస్థలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో కీలక మైన వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ. ఈ కేసుకు సంబంధించి అతనిని బంగారుపాళ్యెంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి చిత్తూరు కోర్టు లో హాజరుపరిచారు. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నెక్ట్స్ ఎవరి పై చర్యలు ఉంటాయి.. ఎవరిని అరెస్టు చేయనున్నారు.. మరెంత మంది ఇందులో ఉన్నారనే విషయాలపై చర్చ నడుస్తోంది.

Also Read: Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Kadapa Crime News: యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget