అన్వేషించండి

Shivarathri 2022: శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే కరుణిస్తే స్వామి దర్శనం, ఎమ్మెల్యే కుమార్తె అనుగ్రహిస్తే దేవీ దర్శనం!

దేవుణ్ని దర్శించుకోవాలంటే ముందు ఎమ్మెల్యే అనుగ్రహం కావాలి. లేకుంటే ఆయన కుమార్తె పర్మిషన్ కావాలి. ఈ రెండింటిలో ఏది ఉన్నా క్షణాల్లో దర్శనం అయిపోద్ది.

దేశంలో ప్రముఖ ఆలయాల్లో శ్రీకాళహస్తి ఆలయం‌ కూడా ప్రముఖమైనది. దక్షిణ కాశీగా పేరున్న ఈ దేవలయానికి నిత్యం వేల‌మంది భక్తులు తరలి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు.  

ఎప్పుడూ లేనంతగా రద్దీ

మహాశివరాత్రి పర్వదినాన ఈ భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఇవాళ కూడా అలానే భారీగా భక్తులు తరలి వచ్చారు. మహా శివరాత్రి నాడు శివయ్య సేవలో తరిస్తే కుటుంబానికి శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో మహిమ కలిగిన పంచభూతాల్లో ఒక్కటైనా వాయు లింగం ఇక్కడ ఉందని భక్తులు  విశ్వాసం. భక్త కన్నప్ప స్వయంగా ఆరాధించిన శివలింగం కూడా కావడంతో చాలా ప్రసిద్ధి చెందింది. 

తిరుపతి నుంచి నేరుగా శ్రీశైలం

ఏడుకొండలపై కొలువైయున్న శ్రీనివాసుడి దర్శనం అనంతరం కచ్చితంగా భక్తులు శివయ్య సేవలో తరిస్తూ ఉంటారు. దీంతో నిత్యం వేల సంఖ్యలో భక్తులు శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుని స్వామి, అమ్మవార్ల కాటక్షాన్ని పొందుతుంటారు.  

జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు దర్శనం నవగ్రహాల వక్ర చూపు నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం కూడా భక్తులకు ఉంది. అందుకే మహాశివరాత్రి కచ్చితంగా శ్రీకాళహస్తి చేరుకొని భక్తుల ప్రత్యేక పూజలు చేస్తుంటారు. 

నేడు కిక్కిరిసిన క్యూలైన్లు

ఇలా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉంది. శివరాత్రి సందర్భంగా అలాంటి ఏర్పాట్లు కనిపించ లేదు. ఎక్కడికక్కడ క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. గంటల తరబడి నిలుచో లేక తీవ్రంగా ఇబ్బందులకు గురి అయ్యారు భక్తులు. క్యూలైన్ వద్ద తాగు నీరు నిలువ నీడ లేదు.  

వీఐపీ సేవలో అధికారులు, ఎమ్మెల్యే ఫ్యామిలీ

విఐపిల సేవలో అధికారులు, స్ధానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తరించారు. దీంతో సామాన్య భక్తులకు చుక్కలు కనిపించాయి. చంటిపిల్లలు, వృద్దులు క్యూలైన్స్‌లో గంటల తరబడి నిల్చోలేక పోయారు అవస్థలు పడ్డారు. 

అలా అయికే క్షణాల్లో దర్శనం

ఉన్నతాధికారుల సిఫార్సులు, స్ధానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, అనుచరుల సిఫార్సుతో వచ్చిన వారికి క్షాణాల్లో దర్శనం భాగ్యం కలిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. సామాన్య భక్తుల దర్శనాలను ఆపేసి వీఐపీ సేవలో అధికారులు ఉన్నారని విమర్శలు వినిపించాయి.  

స్వామి, అమ్మవార్ల దర్శనం కావాలంటే ముందుగా శ్రీకాళహస్తి స్ధానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కుమార్తె పవిత్రరెడ్డిని దర్శించుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు భక్తులు. 

చాలా రోజుల తర్వాత తరలి వచ్చిన భక్తులు

ముఖ్యమైన రోజుల్లో సామాన్య వద్ద నుంచి వివిఐపిల వరకూ శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శిస్తుంటారు. వారి వారి స్తోమతకు తగ్గట్టుగా పరపతి ఉపయోగించుకుని దర్శనాలు చేసుకుంటారు. అయితే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి పర్వదినం అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగింది. రెండేళ్ల నుంచి కరోనా ప్రభావంతో దర్శనాలకు ఎక్కువ మంది రాలేదు. ఇప్పుడు కరోనా తగ్గడంతో భారీగా భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. దీంతో శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో నిండి పోయింది. 

అధికారులు సైలెంట్‌, ఎమ్మెల్యే ఫ్యామిలీ ఆధీనంలోకి ఆలయం! 

సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన ఆలయ  ఈవో, అధికారులపై బాధ్యత విస్మరించాలనే ఆరోపణలు చేశారు భక్తులు.  స్ధానిక ఎమ్మెల్యే రాకతో ఆలయ అధికారులు ఏమీ పట్టనట్లుగా సామాన్య భక్తులకు దూరంగా ఉండి పోయారు. స్ధానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కుమార్తె పవిత్రారెడ్డి అంతా తమదే అన్నట్టుగా దర్శనాలు కల్పించారు. స్వామి వారి వద్ద బాధ్యతలు మధుసూదన్ రెడ్డి చూసుకుంటే.. అమ్మవారి వద్ద కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి చూసుకున్నారు. 

ప్రశ్నిస్తే శివతాండవమే

శివయ్యను, అమ్మవారిని అతి దగ్గరగా చూసుకునే భాగ్యం ఎవరకి కల్పించాలో వీళ్లే చూసుకుంటున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. దీంతో ఎవరూ ఎమ్మెల్యేను ప్రశ్నించలేక నిమ్మకుండి పోయారు. 

అమ్మవారి సన్నిధిలోనూ కుమార్తె పెత్తనం కొనసాగడంతో సామాన్య భక్తులు స్వామి, అమ్మవార్లను కన్నులార చూడలేక పోయారు. సామాన్య భక్తులు ఇబ్బందులు ఏమాత్రం గ్రహించకుండా అధికారులు, ఎమ్మెల్యే విఐపిల సేవలో తరించడంపై భక్తులు తీవ్రంగా మండిపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

DK Shivakumar: కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Embed widget