అన్వేషించండి

Tirumala : త్వరలో అందుబాటులోకి శ్రీవారి మెట్టు మార్గం, ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనాలు పునఃప్రారంభం : తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

Tirumala : తిరుమలకు భక్తులు ఎలాంటి సంకోచం లేకుండా రావొచ్చని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తు్న్నామన్నారు. ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనాలు తిరిగి ప్రారంభించామన్నారు.

Tirumala : కోవిడ్ వ్యాప్తి తగ్గడం, వేసవి సెలవులు మొదలు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని అందుకు తగిన విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి సామాన్య భక్తులు ఎలాంటి సంకోచం లేకుండా తిరుమలకు రావొచ్చని అన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 7 నుంచి 8 గంటల సమయం పడుతోందని, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, షెడ్లలో వేచి ఉండే భక్తులకు నిరంత‌రాయంగా పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో వివిధ విభాగాల్లో సిబ్బందిని కుదించి ఇతర విభాగాలకు పంపామని, ప్రస్తుతం సిబ్బందిని తిరిగి ఆయా విభాగాలకు రప్పించి భక్తులకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత వారంలో నాలుగు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశామని వివరించారు. 

అన్నప్రసాద కౌంటర్లు పెంపు

ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనాలు తిరిగి ప్రారంభించామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయంలో క్యూలైన్ క్రమబద్ధీకరిస్తూ తోపులాట లేకుండా స్వామి వారి దర్శనం కల్పిస్తున్నట్టు చెప్పారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు క్యూలైన్లు, ఫుడ్ కౌంటర్లలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాంభగీచా బస్టాండు, సీఆర్వో, ఏఎన్సీ తదితర ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్ల ఏర్పాటుతో భక్తులు అన్నప్రసాద కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఆయా ప్రాంతాల్లోనే అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారని తెలిపారు. పీఎసీ-2, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 క్యాంటీన్లో అన్నప్రసాదాల తయారీకి, వడ్డించేందుకు కలిపి 185 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్ల క్రమబద్దీకరణతో పాటు భక్తుల లగేజీని కౌంటర్ల ద్వారా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారని వివరించారు. ఇందుకోసం దాదాపు 100 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ఇటీవల వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్టు మార్గాన్ని త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకోస్తామని తెలిపారు. ఈ మార్గం అందుబాటులోకి వచ్చాక దివ్యదర్శనం టోకెన్లు కేటాయిస్తామన్నారు. 

గదులు 20 నిమిషాల్లో శుభ్రం చేసి భక్తులకు కేటాయింపు

ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణ కట్టల్లో క్షురకులు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారని ధర్మారెడ్డి తెలియజేశారు. కోవిడ్ సమయంలో 400 మంది క్షురకులు సేవలు అందిస్తుండగా, ప్రస్తుతం 1200 మంది సిబ్బంది భక్తులకు తలనీలాలు తీస్తున్నారని తెలిపారు. కల్యాణకట్టలో శుభ్రం చేసేందుకు 40 మంది అదనపు సిబ్బందిని సమకూర్చుకున్నామని, రిసెప్షన్ విభాగంలో గదులు ఖాళీ అయిన 20 నిమిషాల్లో శుభ్రం చేసి భక్తులకు కేటాయిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఏప్రిల్ 11 నుండి 17వ తేదీ వ‌ర‌కు 5,29,926 మంది భక్తులు దర్శించుకున్నట్లు చెప్పారు. 24,36,744 లడ్డూలు, 25,921 వడలు విక్రయించామని తెలిపారు. 2,39,287 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 10,55,572 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు తెలిపారు. తిరుమలలో వివిధ విభాగాల్లో 1700 మంది, తిరుపతిలో 300, పరకామణి సేవ 200 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి వెల్లడించారు.

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Embed widget