అన్వేషించండి

Sajjala Vs Teachers : ఇంకా ఉంది.. ఏపీలో ఇక ప్రభుత్వం వర్సెస్ ఉపాధ్యాయ సంఘాలు !

ఏపీ ఉపాధ్యాయులు మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. అయితే వారి వెనకు రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదం సద్దుమణగలేదు.  ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తూ సొంతంగా పోరుబాట పట్టాయి. ఈ రోజు నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరయ్యారు.  ఉపాధ్యాయ సంఘాల నిరసనలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగులు పరస్పర సహకారంతో సమస్య పరిష్కారం అయిందని .. ఉద్యోగుల్లో కొంతమంది ప్రతిపక్షాలతో కలిసి మళ్లీ ఆందోళన బాట పడతామని అంటున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా వామపక్ష ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తామంటున్నారు అని సజ్జల అన్నారు. 

వామపక్ష ఉద్యోగ సంఘాలు పీఆర్సీ పెంచాలి అంటే సాధ్యం అవుతుందా? అని సజ్జల ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న వామపక్ష ఉద్యోగ సంఘాలు కేరళలో హెచ్‌ఆర్‌ఏ ఎంత అని ప్రశ్నించారు.  వామపక్ష పార్టీలు ఈ ప్రభుత్వంపై దాడి చేసి ఎవరికి మేలు చేయాలని అనుకుంటున్నారు అని సజ్జల ప్రశ్నించారు.  లేని సమస్యని మళ్లీ సృష్టించాలని భావిస్తున్నారని అన్నారు. ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే మంత్రుల కమిటీని వచ్చి కలవొచ్చని సూచించారు. ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలన్నింటితో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.  ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీని రూపొందించి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని విజయవాడలో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరించారు. 

ఉద్యోగ సంఘాల నాయకులు  ఉపాధ్యాయ సంఘాల పై విమర్శలు చేయడం సరికాదన్నారు. తాము మినిట్స్‌పై సంతకం చేయలేదని.. తమను అసలు మాట్లాడనివ్వలేదన్నారు. మహమ్మారి కరొనా  ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులు వివిధ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నామని స్పష్టం చేశారు.   ఏపీ జేఏసీలో నాలుగు సంఘాల నాయకులు ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్లకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తక్షణమే పాత హెచ్‌ఆర్‌ఏ ప్రకటించాలని, పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ 27శాతం ప్రకటించాలని, స్టీరింగ్‌ కమిటీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేసిన వారిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే కావడంతో వారు మళ్లీ రోడ్డెక్కితే పరిస్థితి మొదటి కొస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఉపాధ్యాయ నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. స్కూళ్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. పలు జిల్లాల్లో టీచర్లకు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా న్యాయమైన పీఆర్సీ ఇచ్చే వరకూ తాము పోరాడతామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget