అన్వేషించండి

AP No Special Status : ఏపీ ప్రత్యేక ముగిసిన అధ్యాయం - కేంద్రంతో మరోసారి చెప్పించిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు!

ఏపీ ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అని కేంద్రం మరోసారి ప్రకటించింది. వైసీపీ ఎంపీల ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చింది.

 

AP No Special Status :  ఆంధ్రప్రదేశ్ కి   ప్రత్యేక హోదా  లేనట్లేనని.. అది ముగిసిన అధ్యాయమని.. పార్లమెంటు   సాక్షిగా కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. మంగళవారం 
లోక్‌సభలో వైసీపి ఎంపీ లు లావు, బాలశౌరీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం   సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందన్నారు. దీంతో ప్రత్యేక, ఇతర రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయిందన్నారు. హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ  ని ప్రకటించామని, ప్యాకేజీ కింద రూ.15.81 కోట్ల నిధులు విడుదల చేశామని నిత్యానందరాయ్ తెలిపారు.

పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా వైసీపీ ఎంపీలు ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. అది ముగిసిన అధ్యాయం అని కేంద్రం చెబుతూనే ఉంటుంది. 
మైక్య రాష్ట్రాన్ని విభజించినపుడు యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే అప్పట్లో జరిగిన అభివృద్ధి మొత్తం తెలంగాణా ప్రాంతంలోనే కేంద్రీకృతమైంది. పరిశ్రమలు లేక, ప్రభుత్వ రంగ సంస్థలు లేక, రాజధాని కూడా లేని రాష్ట్రంగా అవతరించటం తోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు.   ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ ఈ అంశాన్ని హైలెట్ చేసింది.  ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని 2014 ఎన్నికల్లో   ఇస్తామంది.  ఎన్నికలు ముగిశాక ఆర్థిక సంఘం సిఫార్సుల పేరుతో ఇవ్వలేదు. 
  
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదా డిమాండ్ మరోసారి తెరపైకి వస్తోంది. పాతిక మంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే కేంద్రంపై ఎలాంటి పోరాటం చేయలేదు.   ఏపీకి ప్రత్యేక హోదా లేనే లేదని  కేంద్రం చెబుతోంది.  దీంతో రాష్ట్రం కూడా సైలెంట్ అయిపోయింది.   చంద్రబాబు గతంలో ప్యాకేజీ తీసుకోవడంతో హోదా రాకుండా పోయిందని మాత్రమే వైసీపీ సర్కార్, నేతలు విమర్శిస్తున్నారు   ఈ తరుణంలో వైసీపీ నేతల్ని ప్రత్యేక హోదాపై నిలదీయాలని టీడీపీ నేత నారా లోకేష్ తన పాదయాత్రలో కోరుతున్నారు. పాతిక మంది ఎంపీల్ని ఇస్తే హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు 31 మంది ఎంపీలు (లోక్ సభ, రాజ్యసభ కలిపి) ఉన్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని  టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే  తాము ప్రత్యేకహోదాను లైవ్ లో ఉంచుతున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. 

ప్రత్యేకహోదా వస్తే ఏపీలోని ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని సీఎం జగన్ చెప్పేవారు. అయితే ఆయన సీఎం అయిన తర్వాత మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందంటున్నారు కానీ.. ప్రత్యేకహోదా సాధిస్తే ప్రతీ జిల్లా హైదరాబాద్ అవడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్న కోణంలో ఆలోచించలేదు. దీన్నే విపక్షాలు అస్త్రంగా చేసుకుంటున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nellore Mayor Politics: వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
Wanaparthy Kavitha: నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది -  కవిత వార్నింగ్
నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది - కవిత వార్నింగ్
The Raja Saab : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
Nalgonda Politics: నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
Advertisement

వీడియోలు

Who is Senuran Muthusamy | ఎవరి సెనూరన్ ముత్తుసామి ? | ABP Desam
Blind T20 Women World Cup | చారిత్రాత్మక విజయం సాధించిన అంధుల మహిళ క్రికెట్ టీమ్ | ABP Desam
India vs South Africa Second Test Match Highlights | భారీ స్కోరుకు సఫారీల ఆలౌట్ | ABP Desam
India vs South Africa ODI | టీమిండియా ODI స్క్వాడ్ పై ట్రోల్స్ | ABP Desam
Bollywood legend Dharmendra Passed Away | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అస్తమయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nellore Mayor Politics: వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
Wanaparthy Kavitha: నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది -  కవిత వార్నింగ్
నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది - కవిత వార్నింగ్
The Raja Saab : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
Nalgonda Politics: నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
Dharmendra Net Worth: బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఫ్యామిలీకి వచ్చేది ఎంతంటే?
బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఫ్యామిలీకి వచ్చేది ఎంతంటే?
CJI SuryaKant: నూతన CJIగా ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్.. ఆయన ఇచ్చిన 10 ముఖ్యమైన తీర్పులు ఇవే
నూతన CJIగా ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్.. ఆయన ఇచ్చిన 10 ముఖ్యమైన తీర్పులు ఇవే
Balakrishna : బాలయ్యతో హీరోయిన్ స్పెషల్ సాంగ్? - సిల్వర్ స్క్రీన్‌పై ఈ కాంబో ఎక్స్‌పెక్ట్ చేసుండరు!
బాలయ్యతో హీరోయిన్ స్పెషల్ సాంగ్? - సిల్వర్ స్క్రీన్‌పై ఈ కాంబో ఎక్స్‌పెక్ట్ చేసుండరు!
Maruti S Presso Price: మారుతి ఆల్టో కన్నా చౌక కారు, 3.5 లక్షలతో కొత్త బ్రాండెడ్ 5 సీటర్ కారు !
మారుతి ఆల్టో కన్నా చౌక కారు, 3.5 లక్షలతో కొత్త బ్రాండెడ్ 5 సీటర్ కారు !
Embed widget