అన్వేషించండి

Telangana High Court: జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు - తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ!

Jagan Asset Case: జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. వేగంగా విచారించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసింది.

Telangana hIgh court : 2024  అసెంబ్లీ ఎన్నికల్లోపు జగన్ అక్రమాస్తుల కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టులో హరిరామ జోగయ్య దాఖలు చేసిన  పిటిషన్ నువిచారణకు స్వీకరించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద స్వీకరించేందుకు గతంలో రిజిస్ట్రి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో  చీఫ్ జస్టిస్ ధర్మానసం ముందు ప్రస్తావించారు.

సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది.  పిల్ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో  ఏకీభవించిన హైకోర్టు...  ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకరించింది. ల పిల్ లో సవరణలను  పరిగణలోకి తీసుకున్న హైకోర్టు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చారు.  ప్రతివాదులు జగన్, సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలన్న హరిరామ జోగయ్య పిటిషన్ వేశారు. 

ఇలాంటి పిటిషన్ సుప్రీంకోర్టులో గత శుక్రవారం రఘురామకృష్ణరాజు దాఖలు చేశారు.  శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం విచారణ జరిపింది జగన్ అక్రమాస్తుల కేసు్లలో   విపరీతమైన జాప్యం ఎందుకు జరుగుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది.విపరీతమైన ఆలస్యం జరుగుతున్నందున సీఎం జగన్ ఆస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని ఎంపీ రఘురామ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విపరీతమైన జాప్యం జరుగుతోందని.. 3071 సార్లు జగన్ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించారు. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందని.. వందల కొద్ది డిశ్చార్జి పిటిషన్లు వేసినట్లు పేర్కొన్నారు.

వైఎస్ జగన్‌పై సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదని.. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్‌కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారని ప్రస్తావించారు. అందువల్ల ఈ కేసుల విచారణకు అంతు లేకుండా పోతోందని.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించట్లేదు అంటూ పిటిషన్‌లో కోర్టుకు వివరించారు. అందువల్ల వెంటనే దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని.. ఈకేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ పిటిషన్‌లో కోరారు. 

మరో వైపు జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నరారని .. బెదిరింపులకు పాల్పడుతూ అవినీతి చేస్తున్నరని ..  తమ అక్రమాస్తుల కేసుల్లో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఓ ఫిర్యాదును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపారు. వారి బెయిల్ రద్దు చేయాలని కోరారు. త్వరలో సీబీఐ కోర్టులో ఇదే విజ్ఞప్తితో పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్, అనంతరం యువగళం పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్, అనంతరం యువగళం పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
Budget 2025: పీఎం ఆవాస్ యోజన నుంచి కిసాన్ సమ్మాన్ నిధి వరకు - సంక్షేమ పథకాలపై బడ్జెట్‌లో భారీ తాయిలాలు!
పీఎం ఆవాస్ యోజన నుంచి కిసాన్ సమ్మాన్ నిధి వరకు - సంక్షేమ పథకాలపై బడ్జెట్‌లో భారీ తాయిలాలు!
Thandel First Review: 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
Crime News: టీడీపీ సభ్యత్వం పేరుతో కొత్త తరహా మోసం, మహిళ అకౌంట్ నుంచి లక్ష కట్! న్యాయం చేయాలంటూ వీడియో
టీడీపీ సభ్యత్వం పేరుతో కొత్త తరహా మోసం, మహిళ అకౌంట్ నుంచి లక్ష కట్! న్యాయం చేయాలంటూ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్, అనంతరం యువగళం పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్, అనంతరం యువగళం పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
Budget 2025: పీఎం ఆవాస్ యోజన నుంచి కిసాన్ సమ్మాన్ నిధి వరకు - సంక్షేమ పథకాలపై బడ్జెట్‌లో భారీ తాయిలాలు!
పీఎం ఆవాస్ యోజన నుంచి కిసాన్ సమ్మాన్ నిధి వరకు - సంక్షేమ పథకాలపై బడ్జెట్‌లో భారీ తాయిలాలు!
Thandel First Review: 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
Crime News: టీడీపీ సభ్యత్వం పేరుతో కొత్త తరహా మోసం, మహిళ అకౌంట్ నుంచి లక్ష కట్! న్యాయం చేయాలంటూ వీడియో
టీడీపీ సభ్యత్వం పేరుతో కొత్త తరహా మోసం, మహిళ అకౌంట్ నుంచి లక్ష కట్! న్యాయం చేయాలంటూ వీడియో
Rythu Bharosa Amount: తెలంగాణలో ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ - నేటి నుంచి విత్ డ్రా షురూ
తెలంగాణలో ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ - నేటి నుంచి విత్ డ్రా షురూ
Tilak Varma Comments: గంభీర్ సలహాలు బాగా పని చేశాయ్.. టీ20ల్లో తన ప్రదర్శనపై తిలక్ వ్యాఖ్యలు
గంభీర్ సలహాలు బాగా పని చేశాయ్.. టీ20ల్లో తన ప్రదర్శనపై తిలక్ వ్యాఖ్యలు
Maoist Encounters: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
India-US Trade: ట్రంప్‌ భయాలు పటాపంచలు, చివురిస్తున్న కొత్త ఆశలు - భారత్ నుంచి USకు పెరిగిన ఎగుమతులు
ట్రంప్‌ భయాలు పటాపంచలు, చివురిస్తున్న కొత్త ఆశలు - భారత్ నుంచి USకు పెరిగిన ఎగుమతులు
Embed widget