అన్వేషించండి

Bonda Uma in Tirumala: రాష్ట్రంలో రాక్షస పాలన, ప్రతికూల సర్వేలతో జగన్ కు భయంపట్టుకుంది- బోండా ఉమామహేశ్వరరావు

Bonda Uma in Tiruala: టీడీపీ మాజీ మంత్రి బోండా ఉమా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బయటకు వచ్చి.. సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్ఖాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Bonda Uma in Tiruala: వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో దొరికిన దొంగలకు జైలు శిక్ష తప్పదని టీడీపీ మాజీ మంత్రి బోండా ఉమా అన్నారు. శనివారం ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో బొండా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ మొదలు పెట్టిన యువగళం పాదయాత్రకు వైసీపి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిస్తోందని అన్నారు. పాదయాత్రలో లోకేష్ ను మాట్లాడకుండా మైకులు, స్టూళ్లు లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు వచ్చిన వారిపై కేసులు పెట్టడం, ఆటోలను సీజ్ చేయడం చేస్తున్నారని వివరించారు. ప్రతిపక్షాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడంతో పాటుగా గొంతును నొక్కె ప్రయత్నం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో రాక్షస పరిపాలన వికృతంగా కొనసాగుతుందని చెప్పిన ఆయన, ఇంటికి వెళ్లిపోతున్నామని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వేలు, సొంతంగా చేసుకున్న సర్వేలతో జగన్ కు భయం పట్టుకుందన్నారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పార్టి కార్యాలయాలపై దాడులు, కార్లు తగులబెట్టడం వంటివి చేస్తున్నారని విమర్శించారు. అనపర్తిలో జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న చంద్రబాబును దాదాపు ఎనిమిది కిలో మీటర్ల పాటు లైట్లు తీసి నడిపించారన్నారు. పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత లోకేష్ పై ఇరవై కేసులు పెట్టారని, ఏం తప్పు చేసారని కేసులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టం ఉల్లంఘన చేస్తున్న అధికారులకు కనువిప్పు కలగాలని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు అధికారులు కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. తప్పు చేసిన ప్రతీ అధికారి సర్వీస్ రికార్డుల్లో శిక్షింపబడ్డారని చెప్పారు. పాదయాత్రకు అద్బుతంగా ప్రజల నుండి స్పందన వస్తుందని, లోకేష్ పాదయాత్రకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే లోకేష్ కు దుష్టశక్తుల నుండి రక్షణ కల్పించాలని, లక్ష్యం పూర్తి చేసే విధంగా శక్తిని ప్రసాదించాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలియజేశారు.

అతి త్వరలోనే ఈ దుర్మార్గపు పరిపాలనకు ప్రజలు చరమగీతం పలుకబోతున్నారని, అవినాష్ రెడ్డి దొరికి పోయిన దొంగ అని, అవినాష్ రెడ్డి వెనుక ఇంకా అసలైన శక్తులు ఉన్నాయని, అందులో అవినాష్ రెడ్డి తండ్రి కూడా కేసులో ఉన్నారని, మరికొందరు త్వరలోనే బయట పడతారన్నారు. ఇక గూగుల్ పే కోర్టు వాస్తవాలను బయట పెట్టిందని, కొన్ని రకాలుగా వివేకానంద రెడ్డి హత్య చేసి కొన్ని రోజులు మభ్య పెట్టగలిగారని, టెక్నాలజీ, సీబీఐ మొత్తం విషయాలు బయట‌ పెడుతుందన్నారు. దొరికిన దొంగకు జైలుకు వెళ్ళక తప్పదని ఆయన హెచ్చరించారు. వివేకానంద హత్య కేసులో ఆధారాలను తప్పు దోవ పట్టించింది అవినాష్ రెడ్డే అని, తెల్లవారుజామున మూడు గంటల నుండి భారతీ ఓఎస్డీ కృష్ణమోహన్, జగన్ తో మాట్లాడింది అవినాష్ రెడ్డే అని ఆయన తెలిపారు. వైఎస్ సునీత చేస్తున్న పోరాటం వీరి మెడకు చుట్టుకుందని, ఇంకా ఇద్దరూ వ్యక్తులను విచారణకు పిలుస్తారని, వివేకానంద హత్యలో నిందుతులు, పాత్రదారులు తప్పించుకోలేరని ఆయన తెలియజేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget