అన్వేషించండి

Chandrababu: కేంద్రం సహకారం కోసం బీజేపీతో పొత్తు- ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం అని, ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలంటే కేంద్రంతో కలిసి ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

ఢిల్లీ: ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం అని, ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలంటే కేంద్రంతో కలిసి ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బీజేపీతో పొత్తుపై క్లారిటీ రావడం, సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదరడంపై చంద్రబాబు ఇలా స్పందించారు. బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కూటమిగా ఏపీ ఎన్నికలకు వెళ్తున్నాయని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరిన తరువాత శనివారం ఢిల్లీ నుంచి పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని, ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడానికి కేంద్రం సహకారం అవసరమని నేతలకు చంద్రబాబు తెలిపారు.  రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా కొందరికి సీట్లు రాకపోతే నిరుత్సాహపడొద్దని, పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలని పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు. సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చిందని... త్వరలోనే మరోసారి భేటీ అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 

ఉమ్మడి బహిరంగ సభకు ప్రధాని మోదీ?
టీడీపీ, జనసేన ఈనెల 17న చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా బీజేపీతో పొత్తు కుదరడంతో మూడు పార్టీలు కలిసి ఈ సభను నిర్వహించనున్నాయి. ఈ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ 17న ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ ఉంటే, 18కి బహిరంగ సభ వాయిదా వేస్తారని వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, మరోసారి ఎన్డీఏలోకి టీడీపీ చేరిన తరువాత నిర్వహిస్తున్న సభ కావడంతో భారీగా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. 

రెండు విడతలుగా చర్చలు.. పొత్తుపై క్లారిటీ 
ఢిల్లీలో రెండు విడతలుగా చంద్రబాబు, పవన్ బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. పొత్తుల అంశంపై శనివారం నాడు స్పష్టత వచ్చింది. టీడీపీ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో, జనసేన 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాలు ఫిక్స్ చేశారు. రాజంపేట, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, హిందూపురం నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. ఏపీ అసెంబ్లీ స్థానాల్లోనూ లెక్క కుదిరింది. టీడీపీ 145 స్థానాల్లో పోటీ చేయనుండగా.. బీజేపీ, జనసేనకు కలిసి 30 నియోజకవర్గాలు కేటాయించారు. ఇందులో ఇరవై నాలుగు స్థానాల్లో  జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. అయితే త్వరలోనే అభ్యర్థుల రెండో జాబితాపై భేటీ కానున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Politics: జనసేనలో ఏం జరుగుతోంది? కేడర్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?
జనసేనలో ఏం జరుగుతోంది? కేడర్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?
KA Paul Sensational Comments: గద్దర్ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి, మా మద్ద అన్ని ఆధారాలున్నాయి: కేఏ పాల్ డిమాండ్
గద్దర్ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి, మా మద్ద అన్ని ఆధారాలున్నాయి: కేఏ పాల్ డిమాండ్
Telangana High Court: సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbha Mela 2025 | అతి తక్కువ బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభమేళాకు రూట్ మ్యాప్ | ABP DesamBumrah ICC Mens Test Cricketer of The Year | బౌలింగ్ తో అదరగొట్టాడు..ఐసీసీ కిరీటాన్ని ఒడిసి పట్టాడు | ABP DesamBaba Ramdev Maha Kumbh Mela Yoga | మహా కుంభమేళాలో యోగసేవ చేస్తున్న బాబా రాందేవ్ | ABP DesamAmit Shah Prayagraj Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో అమిత్ షా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Politics: జనసేనలో ఏం జరుగుతోంది? కేడర్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?
జనసేనలో ఏం జరుగుతోంది? కేడర్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?
KA Paul Sensational Comments: గద్దర్ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి, మా మద్ద అన్ని ఆధారాలున్నాయి: కేఏ పాల్ డిమాండ్
గద్దర్ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి, మా మద్ద అన్ని ఆధారాలున్నాయి: కేఏ పాల్ డిమాండ్
Telangana High Court: సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
IPL Held Date Change: ఐపీఎల్ నిర్వహణ తేదీ మార్పు.. కొత్త డేట్ పై అప్డేట్ ఇచ్చిన లీగ్ చైర్మన్
ఐపీఎల్ నిర్వహణ తేదీ మార్పు.. కొత్త డేట్ పై అప్డేట్ ఇచ్చిన లీగ్ చైర్మన్
Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
PM Modi And Trump Talk Over Phone:డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే! 
డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే! 
Embed widget