అన్వేషించండి

TDP News : తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఓటర్ల జాబితా గోల్ మాల్ - టీడీపీ తీవ్ర ఆరోపణలు

ఏపీ ఓటర్ల జాబితా గోల్ మాల్ తాడేపల్లి ప్యాలెస్ నుంచే జరుగుతోందని టీడీపీ ఆరోపించింది. నిజమైన ఓటర్ల ఓట్లు కాపాడేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తుందన్నారు.


TDP News :  ఏపీ ఓటర్ల జాబితాలో అనేక అవకతకవలు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్  బాబు ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో కొన్ని నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ బూత్ లకు సంబంధిం చిన ఓటర్ల జాబితాలు లేవు. ఎలక్షన్ కమిషన్ తమకు అందించిన ఓటర్ల జాబితాలో బూత్ ల వారీ ఓటర్ల వివరాలు లేవు. పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాలలో బూత్ లకు సంబంధించిన వివరాలు లేవు. మరో ప్రధాన అంశం ఏమిటంటే ఓటర్ల జాబితాలో  వైసీపీ ప్రభుత్వం భారీ స్థాయిలో జరిపించిన అవకతవకలు. ముఖ్యంగా ఉరవకొండ.. చీరాల.. విశాఖపట్నం నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలోని అర్హులైన ఓటర్లను ఇంకా తొలగించారని ఆరోపించారు. 

ఓట్ల తొలగింపు కుట్రలు తాడేపల్లి ప్యాలెస్‌లో 

రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న ఫామ్ -7 దరఖాస్తులు .. వాటి ద్వారా జరిగే ఓట్ల తొలగింపుకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టడం కోసం  జగన్  ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్ పెద్ద బృందాన్నే నియమించింది. ఏఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు తొలగించాలి.. తద్వారా వైసీపీ అభ్యర్థుల్ని ఎలా గెలిపించాలనే పక్కా ప్రణాళికలు....వ్యూహాలు అన్నీ తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే అమలవుతున్నాయని అశోక్ బాబు ఆరోపించారు. అర్హుల ఓట్లు .. టీడీపీ ఓట్లు తొలగిస్తే తమ గెలుపు తేలికవుతుందనే భ్రమల్లో వైసీపీ ఉందని మండిపడ్డారు.  ఉరవకొండ నియోజకవర్గంలో 6, 7 వేల ఓట్లు తొలగిస్తే.. సహజంగా అది గెలుపోటము లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలానే చీరాల.. విశాఖపట్నం తూర్పు, పర్చూరు నియోజకవర్గాలపై కూడా దృష్టిపెట్టారని ఆరోపించారు.   టీడీపీ ఓట్లు.. న్యూట్రల్ గా ఉండేవారి ఓట్లు తొలగిస్తే తమపార్టీ అభ్యర్థుల గెలుపు తేలికవుతుందనే భ్రమల్లో అధికారపార్టీ ఉందిని మండిపడ్డారు.  

ఓట్లను బంగారం కంటే మిన్నగా కాపాడటానికి టీడీపీ ప్రయత్నిస్తోంది
                                                                                                                                                                                           ప్రభుత్వం అర్హుల ఓట్లు తొలగించడం.. దొంగఓట్లు సృష్టించడం చేస్తుంటే..ఆ తంతులో కొందరు అధికారులు నిస్సిగ్గుగా పాలుపంచుకుంటున్నారు. కొన్నిచోట్ల వీ.ఆర్.ఏలు.. ఈ.ఆర్.వోలు, వాలంటీర్లు వారి ఇళ్లల్లో పెళ్లికి పనిచేసినట్టు.. వైసీపీనేతలు..అధికారపా ర్టీ ఎమ్మెల్యేల ఆదేశాలతో ఫామ్ -7ల ద్వారా అడ్డగోలుగా ఓట్లు తొలగిస్తున్నారు. మొన్నటికి మొన్న అనకాపల్లి జిల్లా కొవ్వూరులో వీఆర్ఏ ప్రభావతిని సస్పెండ్ చేశారు. ఆమె చేసిన అతిపెద్ద తప్పేమిటంటే.. 13 మంది బతికున్నవారిని చనిపోయిన ట్టుగా ఫామ్ -7లు ఇవ్వడం. నియోజకవర్గాల వారీగా వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు  ఇలాంటి తప్పులు తమ దృష్టికి వస్తున్నాయి.ఓట్లను  కాపాడటానికి.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారీగా చాలా జాగ్రత్తగా ఓటర్లజాబితాను పరిశీలిస్తోంది. బంగారం కంటే మిన్నగా ఓట్లను కాపాడటం కోసం శ్రమిస్తోందని అశోక్ బాబు స్పష్టం చేశారు.  

 ఎవరైనా సరే తప్పులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే
 
ఓటర్ జాబితా పరిశీలనలో భాగంగా ఇళ్లకు వెళ్లినప్పుడు  ఆ ఇళ్లల్లో ఎవరైనా లేకపోతే వాలంటీర్లు ఎవరూ లేరంటూ ఫామ్ -7 ల ద్వారా ఓట్లు తీసేస్తున్నారు. ఇళ్లల్లోని ఓటర్లు స్థానికంగా లేరనో.. చనిపోయారనో చెబుతూ బూత్ కు ఇన్ని ఓట్లు తీసేయాలనే లక్ష్యంతో వాలంటీర్లు పనిచేస్తున్నారు. కాకినాడలో వైసీపీనేతలే నేరుగా ఓటర్లజాబితా పరిశీలనలో వేలుపెట్టి.. ఫామ్ -7 దరఖాస్తులు అందించారు. వారిపై ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ కేసులు పెట్టారు. అలానే గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతిలో పోలైన దొంగఓట్లపై పెట్టిన కేసుల్లో ఇంతవరకు ఎలాంటి పురోగతిలేదు. గ్రాడ్యుయేట్లు కాని వారు ఓట్లు వేశారని నిరూపిస్తూ..టీడీపీ ఆధారాలిచ్చినా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? కొన్నిచోట్ల కలెక్టర్లే వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. ఎవరైనా సరే చేసే తప్పులకు మూల్యం చెల్లించుకుంటారు. ఎలాంటి ఫామ్ లు అందించినా అవన్నీ రికార్డెడ్ అని.. చట్టాలపరంగా తప్పించుకోలేమనే వాస్తవాన్ని అధికారులు గుర్తుం చుకోవాలని హెచ్చరించారు. 

నిజమైన ఓట్లు కాపాడేందుకు తెలుగుదేశం ఎంతదూరమైనా వెళ్తుంది
                                                                                                                                                                                              డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం రాష్ట్రంలో 4,02,21,450 మంది ఓట్లుంటే...వాటిలో 15 లక్షల ఓట్లు యాడ్ చేస్తే.. 13 లక్షలు తొలగించారు. 6.50 లక్షల ఓట్లను అదర్ ఎన్ రోల్ మెంట్ కింద చూపారు.. అదర్ ఎన్ రోల్ మెంట్ అంటే ఏమిటో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని అశోక్  బాబు డిమాండ్ చేశారు.  వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఓట్లు ఉంటే.. ఆధార్ సీడింగ్ ప్రొసీజర్ ప్రకారం బీ.ఎల్.వోలు తొలగించే ఓట్లపై కూడా కమిషన్ దృష్టి పెట్టాలన్నారు.  టీడీపీ ఫిర్యాదులపై స్పందించి, సున్నా  డోర్ నెంబర్లు.. తప్పుడు డోర్ నెంబర్లపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  నిజమైన ఓట్లను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతదూరమైనా వెళ్తుందని  అశోక్ బాబు తేల్చిచెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Embed widget