అన్వేషించండి

Supreme Court : అక్రమాస్తుల కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - జగన్‌కు మరిన్ని కష్టాలు తప్పవా ?

Andhra Pradesh : జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వెంటనే ప్రారంభించాలని సీబీఐ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణలో కాలయాపనపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Jagan Illegal Assets Cases  :  జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు.. సీబీఐ కోర్టును ఆదేశించింది. రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.   జగన్ అక్రమాస్తుల కేసుపై జరుగుతోన్న విచారణలో కాలయాపనపై   జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఆఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పు అనేలా కాలయాపన చేస్తున్నారని.. ట్రయల్స్ ముందుకు సాగకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని.. ఇదే విచారణలో జాప్యానికి కారణం అవుతుందని సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. 

జగన్‌ అక్రమాస్తుల కేసు వివరాలు, పురోగతిని సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. డిశ్చార్జ్ పిటిషన్లు వేసి విచారణ ముందుకు సాగనివ్వట్లేదని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికి 39 క్వాష్, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని ఈ  పిటిషన్లపై తీర్పులు ఇచ్చేలోపే జడ్జీలు బదిలీ అవుతున్నారని సీబీఐ అఫిడవిట్‌లో తెలిపింది.  ఈ కేసులో ఉన్న నిందింతులంతా శక్తిమంతులే అని సీబీఐ తెలిపింది. మొత్తంగా క్వాష్ పిటిషన్లపై విచారణ సమయంలోనే  ఆరుగురు జడ్జిలు మారిపోవడం, రిటైర్‌ కావడం జరిగిందని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.  డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తున్నారని ట్రయల్‌ ముందుకు సాగకుండా ఇది అడ్డంకిగా మారుతోందని న్యాయస్థానానికి సీబీఐ వివరించింది. దీంతో.. డిశ్చార్జ్ పిటిషన్లకు.. అసలు కేసుల ట్రయల్‌కు సంబంధం లేని వీలైనంత వేగంగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిది. తదుపరి విచారణను నవంబర్‌కు వాయిదా వేసింది. 

 వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు నానాటికీ ఆలస్యమవుతోందని, తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా జగన్ తో పాటు ఇతర నిందితులు వందల కొద్దీ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ గత ఏడాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.   ఈ కేసును విచారిస్తున్న హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇప్పటికే 3 వేల సార్లు వాయిదా వేసిందని  జగన్ కేసుల్ని తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ కోరారు.                                             

రఘురామ పిటిషన్లపై గతంలో విచారణ జరిపినప్పుడే సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు నేరుగా సీబీఐ కోర్టుకు... సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ ప్రారంభమయ్యే అవ  కాశాలు ఉన్నాయి. అదే జరిగితే జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.  ఇప్పటికే  చార్జిషీట్లు దాఖలు చేసి పన్నెండేళ్లు  దాటినా  న్యాయవ్యవస్థలో ఉన్న అవకాశాల్ని ఆధారంగా చేసుకుని ట్రయల్ ప్రారంభం కాకుండా పిటిషన్లు వేస్తున్నారన్న ఆరోపణలను సీబీఐ చేస్తోంది.                            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
Embed widget