అన్వేషించండి

YS Sharmila: వైఎస్సార్ 90 శాతం పనులు చేస్తే, జగనన్న 10 శాతం చేయలేకపోయాడు: వైఎస్ షర్మిల

AP PCC Chief Sharmila: రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలకు సిద్ధమన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి. ఎన్ని దాడులు చేసినా భరిస్తానని, తన కుటుంబాన్ని చీల్చినా పర్వాలేదన్నారు.

YS Sharmila Comments : రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలకు సిద్ధమని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి (Sharmila Reddy)స్పష్టం చేశారు. ఎన్ని దాడులు చేసినా భరిస్తానని, తన కుటుంబాన్ని చీల్చినా పర్వాలేదన్నారు. హంద్రీనీవాకు సంబంధించి వైఎస్సార్ 90 శాతం పనులు చేస్తే, జగనన్న 10 శాతం చేయలేకపోయాడు అని షర్మిల విమర్శించారు. అనంతపురం (Anantapuram) జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి (Congress Party Meeting)సమావేశం జరిగింది. మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి(Raghuveera Reddy), శైలజా నాథ్ ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా షర్మిలా రెడ్డి మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడటానికి వైఎస్సార్ బిడ్డ అడుగు పెట్టిందన్నారు. బీజేపీకి బానిసలుగా మారిన  జగన్ కి ,బాబు కి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించిన షర్మిలా రెడ్డి, ఆంధ్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టినందుకు ఓటు వేయాలా ? అని నిలదీశారు. ఆంధ్ర ప్రజల కోసం కొట్లాడుతుంటే తనపై దాడులు చేస్తున్నారని...తనపై ఎన్ని దాడులు చేసినా భరిస్తానన్నారు. 

అనంతపురం జిల్లా అంటే వైఎస్సార్ కి ప్రియమైన జిల్లా అన్న షర్మిలా రెడ్డి...దేశంలోనే అత్యల్ప వర్షపాతంలో జిల్లా రెండో స్థానం ఉందన్నారు. ఈ ప్రజలను బతించుకోవాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గమని వైఎస్ రాజశేఖర్ రెడ్డి నమ్మారని...ఇక్కడి ప్రజలకు మంచినీళ్ళ కోసం రఘువీరా రెడ్డి తాత పేరు మీద మంచినీటి పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం ఈ జిల్లా నుంచే ప్రారంభించారని, వైఎస్సార్ హయాంలో  22 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట సాగయ్యేదన్నారు షర్మిలారెడ్డి. వేరుశెనగ పంట పండక పోతే డబ్బులు పండిస్తామన్నారని...వైఎస్సార్ హయాంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేదన్నారు. దీంతో రైతులకు భరోసా ఉండేందని...ప్రస్తుతం 3 లక్షల ఎకరాల్లో కూడా పంట వేయడం లేదన్నారు. బీమా లేకపోవడంతో రైతులు సాహసం చేయడం లేదన్న షర్మిలారెడ్డి...దీనికి కారణం జగన్ ఆన్న ప్రభుత్వమేనని విమర్శించారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయంపై సబ్సిడీ ఉండేదని...అన్ని రకాల పరికరాలు సబ్సిడీపై వచ్చేవని, ఇప్పుడు సబ్సిడీ అనే పథకమే లేదన్నారు. సబ్సిడీలు ఎత్తివేసిన జగన్ ఆన్న ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. 

వైఎస్సార్ వెళ్ళిపోయాక రఘువీరా రెడ్డి...రైతుల కోసం చాలా తాపత్రయ పడ్డారన్న షర్మిలారెడ్డి...ఇక్కడ రైతులకు మేలు చేసేందుకు కేంద్రానికి లేఖ రాశారని షర్మిలా రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్ట్ అనంత సృష్టికర్త రఘువీరా రెడ్డి అన్న షర్మిలా...8 వేల కోట్ల రూపాయలు విడుదల చేయించారని అన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అన్ని ఇక్కడికి వచ్చేవని...కాంగ్రెస్ ఓడిపోవడంతో అంతా వృధా అయ్యిందన్నారు. గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ అధికారంలో ఉండి ప్రాజెక్ట్ అనంత గురించి పట్టించుకోలేదని షర్మిలా రెడ్డి విమర్శించారు. బీజేపీకి బానిసలుగా మారి.. అనంత ప్రాజెక్టుకు తూట్లు పోడించారని...హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే...6.50 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే... నాలుగు జిల్లాలకు సాగునీరు అందేదన్నారు. హంద్రీనీవా పనులు 90 శాతం వైఎస్సార్ పూర్తి చేశారన్న షర్మిలారెడ్డి... 10 శాతం పనులు జగన్ అన్న పూర్తి చేయలేక పోయాడని విమర్శించారు. హంద్రీనీవా కోసం జల దీక్ష కూడా చేశారన్న షర్మిలారెడ్డి...6 నెలల్లో పూర్తి చేస్తా అని హామీ ఇచ్చారని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ తన పుట్టినిల్లు అని, ఇక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతోందని, ప్రజల హక్కులు హరిస్తున్నారని షర్మిలారెడ్డి మండిపడ్డారు. టీడీపీ, వైసీపీలు బీజేపీకి బానిసలుగా మారి, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని విమర్శించారు. జగన్ ఆన్న ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని, జనవరి 1న ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారని...5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ రాలేదన్నారు. కనీసం ఒక డీఎస్సీ కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget