అన్వేషించండి

YS Sharmila: వైఎస్సార్ 90 శాతం పనులు చేస్తే, జగనన్న 10 శాతం చేయలేకపోయాడు: వైఎస్ షర్మిల

AP PCC Chief Sharmila: రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలకు సిద్ధమన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి. ఎన్ని దాడులు చేసినా భరిస్తానని, తన కుటుంబాన్ని చీల్చినా పర్వాలేదన్నారు.

YS Sharmila Comments : రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలకు సిద్ధమని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి (Sharmila Reddy)స్పష్టం చేశారు. ఎన్ని దాడులు చేసినా భరిస్తానని, తన కుటుంబాన్ని చీల్చినా పర్వాలేదన్నారు. హంద్రీనీవాకు సంబంధించి వైఎస్సార్ 90 శాతం పనులు చేస్తే, జగనన్న 10 శాతం చేయలేకపోయాడు అని షర్మిల విమర్శించారు. అనంతపురం (Anantapuram) జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి (Congress Party Meeting)సమావేశం జరిగింది. మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి(Raghuveera Reddy), శైలజా నాథ్ ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా షర్మిలా రెడ్డి మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడటానికి వైఎస్సార్ బిడ్డ అడుగు పెట్టిందన్నారు. బీజేపీకి బానిసలుగా మారిన  జగన్ కి ,బాబు కి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించిన షర్మిలా రెడ్డి, ఆంధ్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టినందుకు ఓటు వేయాలా ? అని నిలదీశారు. ఆంధ్ర ప్రజల కోసం కొట్లాడుతుంటే తనపై దాడులు చేస్తున్నారని...తనపై ఎన్ని దాడులు చేసినా భరిస్తానన్నారు. 

అనంతపురం జిల్లా అంటే వైఎస్సార్ కి ప్రియమైన జిల్లా అన్న షర్మిలా రెడ్డి...దేశంలోనే అత్యల్ప వర్షపాతంలో జిల్లా రెండో స్థానం ఉందన్నారు. ఈ ప్రజలను బతించుకోవాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గమని వైఎస్ రాజశేఖర్ రెడ్డి నమ్మారని...ఇక్కడి ప్రజలకు మంచినీళ్ళ కోసం రఘువీరా రెడ్డి తాత పేరు మీద మంచినీటి పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం ఈ జిల్లా నుంచే ప్రారంభించారని, వైఎస్సార్ హయాంలో  22 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట సాగయ్యేదన్నారు షర్మిలారెడ్డి. వేరుశెనగ పంట పండక పోతే డబ్బులు పండిస్తామన్నారని...వైఎస్సార్ హయాంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేదన్నారు. దీంతో రైతులకు భరోసా ఉండేందని...ప్రస్తుతం 3 లక్షల ఎకరాల్లో కూడా పంట వేయడం లేదన్నారు. బీమా లేకపోవడంతో రైతులు సాహసం చేయడం లేదన్న షర్మిలారెడ్డి...దీనికి కారణం జగన్ ఆన్న ప్రభుత్వమేనని విమర్శించారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయంపై సబ్సిడీ ఉండేదని...అన్ని రకాల పరికరాలు సబ్సిడీపై వచ్చేవని, ఇప్పుడు సబ్సిడీ అనే పథకమే లేదన్నారు. సబ్సిడీలు ఎత్తివేసిన జగన్ ఆన్న ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. 

వైఎస్సార్ వెళ్ళిపోయాక రఘువీరా రెడ్డి...రైతుల కోసం చాలా తాపత్రయ పడ్డారన్న షర్మిలారెడ్డి...ఇక్కడ రైతులకు మేలు చేసేందుకు కేంద్రానికి లేఖ రాశారని షర్మిలా రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్ట్ అనంత సృష్టికర్త రఘువీరా రెడ్డి అన్న షర్మిలా...8 వేల కోట్ల రూపాయలు విడుదల చేయించారని అన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అన్ని ఇక్కడికి వచ్చేవని...కాంగ్రెస్ ఓడిపోవడంతో అంతా వృధా అయ్యిందన్నారు. గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ అధికారంలో ఉండి ప్రాజెక్ట్ అనంత గురించి పట్టించుకోలేదని షర్మిలా రెడ్డి విమర్శించారు. బీజేపీకి బానిసలుగా మారి.. అనంత ప్రాజెక్టుకు తూట్లు పోడించారని...హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే...6.50 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే... నాలుగు జిల్లాలకు సాగునీరు అందేదన్నారు. హంద్రీనీవా పనులు 90 శాతం వైఎస్సార్ పూర్తి చేశారన్న షర్మిలారెడ్డి... 10 శాతం పనులు జగన్ అన్న పూర్తి చేయలేక పోయాడని విమర్శించారు. హంద్రీనీవా కోసం జల దీక్ష కూడా చేశారన్న షర్మిలారెడ్డి...6 నెలల్లో పూర్తి చేస్తా అని హామీ ఇచ్చారని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ తన పుట్టినిల్లు అని, ఇక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతోందని, ప్రజల హక్కులు హరిస్తున్నారని షర్మిలారెడ్డి మండిపడ్డారు. టీడీపీ, వైసీపీలు బీజేపీకి బానిసలుగా మారి, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని విమర్శించారు. జగన్ ఆన్న ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని, జనవరి 1న ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారని...5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ రాలేదన్నారు. కనీసం ఒక డీఎస్సీ కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
Embed widget