అన్వేషించండి

Special Buses For Sankranti: సంక్రాంతికి ఊరు వెళ్లే ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్- 6వేలకుపైగా స్పెషల్‌ బస్సులు- మరి ఛార్జీలు!

Sankranti Special Buses In AP: ఏపీ ప్రజలను సంక్రాంతి కానుక అందిస్తోంది APSRTC. పెద్దపండుగకు 6,795 స్పెషల్‌ బస్సులు నడుపుతోంది.

APSRTC Sankranti Special Buses: సంక్రాంతి... తెలుగు ప్రజలకు పెద్దపండుగ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాద్‌తోపాటు ఇతర  ప్రాంతాల్లో ఉన్నవారంతా సొంతూళ్లకు వచ్చి... కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ వాసులంతా... సొంత గ్రామాలకు ప్రయాణం కడతారు. దీంతో బస్సులు, రైళ్లు అన్నీ ముందే నిండిపోతాయి. మూడు, నాలుగు నెలల ముందే రిజర్వేషన్లు అయిపోతాయి. దీంతో ప్రత్యేక బస్సులు,  రైళ్లు అందుబాటులోకి తెస్తుంటారు.

ప్రత్యేక బస్సులు

ప్రతి ఏడాదిలాగే... ఈ సంక్రాంతికి కూడా రెగ్యులర్‌ బస్సుల్లో టికెట్లన్నీ ముందే అయిపోయాయి. దీంతో ప్రత్యేక బస్సులను నడుపుతోంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  (APSRTC). మొత్తం 6,795 స్పెషల్ బస్సులను సంక్రాంతి పండుగ కోసం నడపుతోంది. అంతేకాదు.. స్పెషల్‌ బస్సుల్లో ఈసారి అదనపు ఛార్జీలు వసూలు చేయడంలేదు.  సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. అందేకాదు.. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకున్నవారికి 10 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు  ప్రకటించింది.

పది నుంచి ప్రత్యేక బస్సులు

ఈనెల 10 నుంచి 13వ తేదీ మధ్యలో రెగ్యులర్‌ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయని, అందుకే.. ఆయా మార్గాల్లో ప్రత్యేక బస్సు సర్వీసులను  అందుబాటులోకి తెస్తున్నట్టు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటిల్లో కూడా రిజర్వేషన్లు మొదలైనట్టు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు  పెంచుతామని ప్రత్యేక బస్సుల పర్యవేక్షణకు సూపర్‌వైజర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు,  చెన్నై, కర్ణాటక, తమిళనాడులోని ఇతర ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నారు. 

18 వరకు ప్రత్యేక బస్సులు

నేటి (జనవరి 6వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడవనున్నాయి. సంక్రాంతికి ముందుగా.. ఇవాళ్టి (జనవరి 6వ తేదీ) నుంచి 14వ తేదీ వరకు 3,570  ప్రత్యేక బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం ఈనెల 16 నుంచి 18 వరకు 3,225 బస్సులు నడుపుతున్నారు. సంక్రాంతి ముందు నడిపే బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి 1600,  బెంగళూరు నుంచి 250, చెన్నై నుంచి 40, విజయవాడ నుంచి 300, విశాఖ నుంచి 290, రాజమండ్రి నుంచి 230, తిరుపతి నుంచి 70, ఇతర ప్రాంతాల నుంచి 790  బస్సులు ఏర్పాటు చేశారు. 

నార్మల్ ఛార్జీలే

సంక్రాంతి తర్వాత అంటే ఈనెల 16 నుంచి 18 వరకు హైదరాబాద్‌ నుంచి 1,500, బెంగళూరు నుంచి 495, చెన్నై నుంచి 85 సర్వీసులు, విజయవాడ నుంచి 200, విశాఖపట్నం  నుంచి 395,  రాజమహేంద్రవరం నుంచి 50, తిరుపతి నుంచి 50, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 700 ప్రత్యేక సర్వీసులను నడుపనున్నారు. చార్జీలకు చిల్లర సమస్య లేకుండా యూటీఎస్‌ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్‌పే, గూగుల్‌ పే, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా టికెట్లు  తీసుకోవచ్చు. 

వాస్తవానికి... సంక్రాంతి, దసరా పండుగలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. సాధారణ చార్జీలపై 50శాతం అధికంగా వసూలు చేసేవారు. దీని  వల్ల ప్రయాణికులపై ఆర్థిక భారం పడేది. అయితే... ఈసారి ఆ విధానానికి స్వస్తి పలికింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సర్కార్‌. సాధారణ చార్జీలతోనే పండుగ ప్రత్యేక సర్వీసులను  నడపాలని నిర్ణయించింది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం కూడా కల్పించింది. అంతేకాదు... ఒకేసారి రానూపోనూ రిజర్వేషన్‌ చేసుకుంటే 10శాతం  రాయితీ కూడా ఇస్తోంది. దీంతో సాధారణ చార్జీల కంటే తక్కువగానే ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chicken Price Hike May 2026: చికెన్ రేట్లకు రెక్కలు - కిలో రూ.350 దాటిన ధర.. సామాన్యుడికి నాన్‌వెజ్ భారమే!
చికెన్ రేట్లకు రెక్కలు - కిలో రూ.350 దాటిన ధర.. సామాన్యుడికి నాన్‌వెజ్ భారమే!
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget